పుంగనూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం…

పుంగనూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం

పార్టీ కార్యకర్తలకు అవగాహన
కల్పించిన

పుంగునూరు ఇన్ చార్జీ
చల్లా బాబురెడ్డి

అవగాహన కార్యక్రమంలో
పాల్గొన్న
షాప్ చైర్మన్ రవి నాయుడు, కర్నాటి అమర్నాథ్ రెడ్డి,

పుంగనూరు(నేటిధాత్రి) 

 

 

పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కమిటీలు వేయుటకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన నియోజకవర్గ అబ్జర్వర్లు మరియు మండల అబ్జర్వర్లు కలిసి రొంపిచర్ల మండలం వి ఎం ఆర్ ఫంక్షన్ హాల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా అబ్జర్వర్ రవి నాయుడు కర్నాటి అమర్నాథ్ రెడ్డి అశోక్ మరియు మండల అబ్జర్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని కమిటీలు వేయుటలో అలసత్వం వహించకుండా అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో సూచించారు.
ఈ సందర్భంగా చల్లా బాబు రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ మరియు మండల కమిటీలను ఎన్నుకోవటంలో కార్యకర్తల సూచనల మేరకు మరియు పార్టీని బలోపేతం చేసే నాయకులకు నిరంతరం పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలియజేశారు.
అనంతరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క మండలంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్క చోట గెలిచే విధంగా నాయకులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version