మద్యం అధిక ధరల అమ్మకాలపై చర్యలెప్పుడు…

మద్యం అధిక ధరల అమ్మకాలపై చర్యలెప్పుడు

దుగ్గొండి మండలంలో మద్యం దుకాణాలపై చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు

బెల్టు షాపులపై మమకారం..గుడుంబా అమ్మకాలపై దాడులు

బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులు

దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దుగ్గొండి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో వందల కొద్ది అక్రమ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కాని ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం వాటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘దుగ్గొండి మండలంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు” అనే వార్త శీర్షికను నేటి ధాత్రి దినపత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. మీ కథనంపై స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని నేటిధాత్రి ప్రతినిధులతో తెలిపినప్పటికీ రోజులు గడుస్తున్న చర్యలు తీసుకోవడంలో మాట తప్పడం పట్ల ఆంతర్యం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నాటుసారా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ గ్రామాలలో బెల్ట్ షాపులు గుడుంబా అమ్మకాలు ఒకే దుకాణాలలో జరుగుతున్నప్పటికీ గుడుంబా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన సంబంధిత ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల నిర్వహణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల రోజువారి కూలికి వెళ్లే సాధారణ ప్రజలు గ్రామాల్లో మద్యానికి బానిసై వారి కుటుంబాలు ఇచ్చిన పరిస్థితి లేనుకుంటున్నాయని పలువురు సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో ఒక మద్యం షాపు గిన్నిబావిలో రెండు మద్యం షాపులలో బెల్ట్ షాపుల పేరుతో అధిక ధరలకు చేపడుతూ సిండికేట్ పేరుతో దందా నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శలు ఎదురవుతున్నాయి.

 

 

 

ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులకు వివరణ కోసం సంప్రదించక గత కొన్ని రోజులు స్పందించకపోవడం గమనార్హం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version