29న భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ జిల్లాల చెస్ పోటీలు…

29న భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ జిల్లాల చెస్ పోటీలు

గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేముల పల్లి సుబ్బారావు

నర్సంపేట,నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెంలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్ నందు ఈనెల 29వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం మరియు వరంగల్ జిల్లాల స్థాయి చెస్ పోటీలు లో నిర్వహించినట్లు గీతాంజలి విద్యా సంస్థలు చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 30 ట్రోఫీలతో పాటు ప్రతి ఒక్క క్రీడాకార్డుకి మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయున్నట్లు తెలిపారు.ఈ చెస్ క్రీడలో పాల్గొనేందుకు 15 మంది బాలికలకు 15 మంది బాలురకు, అందులో అండర్ 15 అండర్ 12 అండర్ 9 విభాగంలో వారికి బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలు స్విస్ లీగ్ పద్ధతిలో జరుగుతాయని ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ సిహెచ్ గోపికృష్ణ తెలిపారు.క్రీడలో పాల్గొనే వారు 9440162749,9182225496 చేరవాణి నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు మధ్యాహ్నం భోజనం కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ఓన్ చెస్ బోర్డ్స్ ను తమ వెంట తీసుకురాగలరన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల లోపు భద్రాద్రి కొత్తగూడెం పట్టణం గౌతమ్ నగర్ గీతాంజలి పబ్లిక్ స్కూల్ రావాల్సిందిగా కోరారు. ఈ పోటీలలో ఓడిపోయిన గెలిచిన ప్రతి ఒక్కరు 5 రౌండ్లు ఆడవలసిందిగా చెస్ కోచ్ సీహెచ్ బిశ్వజిత్ కృష్ణ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version