సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం రామారావు పేట గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుట కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ పులి రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమాన్ ఆలయాన్ని ముందుగా శుద్ధిచేసి నూతన రంగులతో అలంకరించి సీతారాముల కళ్యాణం కొరకు 10,116 రూపాయలు అందించినట్లు వారు తెలిపారు.అలాగే హనుమాన్ భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
