పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి…

పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి
శ్రీరాంపూర్: నేటిధాత్రి

అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు నాణ్యమైన పోషకాహారాలను అందించాలని, 4వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రాంతం 4వ డివిజన్ లోని అంగన్వాడి సెంటర్ -2 లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో చిన్నారులకు ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడి కేంద్రంలో ఉన్న చిన్నారులకు పోషకాహారాలు అందించడంలో వెనుకాడరాదని అన్నారు. అలాగే అంగన్వాడి కేంద్రంలో విధిగా గర్భిణీలకు కోడిగుడ్లు, పాల ప్యాకెట్లను అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పి సుమలత, ఆయా నాగలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం..

అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం

మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని శాంతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలో ఏఎన్ఎంఎస్సి కమిటీ సమావేశం ప్రాజెక్ట్ సిడిపిఓ మధురిమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిడిపిఓ మధురిమ మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మాతా శిశు సంక్షేమం కోసం పౌష్టికాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్ర అభివృద్ధి కోసం ఏఎన్ఎంఎస్సి కమిటీ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్, కౌన్సిలర్ బత్తిని రాజేందర్ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా చైర్మన్ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలు గాజుల జ్యోతి, జగన్నాధ దీపికలకు శ్రీమంతం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ గర్భిణీగా నమోదైనప్పటి నుండి పిల్లలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరుణ, స్థానిక అంగన్వాడీ టీచర్లు దాసరి రమాదేవి, నల్లా భారతి, గొర్రె రాధ, బత్తిని శిరీష, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు నాడెం రాజ్యలక్ష్మి, బాలుగు రజిత, ఆర్పి అనిత, జ్యోతి, దీపిక, సంధ్య, మమత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మిక వ్యవస్థకు తావులేదు: ఎస్సై లెనిన్

బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదు : ఎస్సై లెనిన్

బాలానగర్ / నేటి ధాత్రి

బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని ఎస్సై లెనిన్ శనివారం అన్నారు. మండల కేంద్రంలో శ్రీరంగ బెంగళూరు అయ్యంగార్ బేకరీ యజమాని రాకేష్.. కోయిలకొండ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చెందిన 18 సంవత్సరాలు నిండని ఓ బాలుడిని పనిలో పెట్టుకోవడంతో.. చైల్డ్ లేబర్ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ఎండబెట్లలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బాలసదన్ భవనం శంకుస్థాపన

నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ ఎండబెట్ల గ్రామంలో కోటి 30 లక్షల మంజూరైన బాల సదన్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాలసదన్ భవన నిర్మాణం ద్వారా అనాధ మరియు ఆశ్రయంలేని పిల్లలు కు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు
అభివృద్ధి పనుల్లో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ పట్టణ కౌన్సిలర్లు ఎండబెట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

పిల్లలకు మెకానిక్ అసోసియేషన్ చేయూత..

పిల్లలకు మెకానిక్ అసోసియేషన్ చేయూత..

తిరుపతి(నేటిధాత్రి)

 

లక్ష్మీపురం లోని అంగనవాడి ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకు భోజన సౌకర్యార్థం తిరుపతి టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సిలిండర్ స్టవ్ మంగళవారం వితరణ చేసి. తమవంతు చేయూత అందించారు. అలాగే ప్రైమరీ స్కూల్లోని పిల్లలకు బిస్కెట్స్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల మునిరెడ్డి. గౌరవ అధ్యక్షుడు జలంధర్. కార్యదర్శి గురు ఆచారి. అంగన్వాడి ప్రైమరీ స్కూల్ నిర్వాహకులు
జి.గీత.కే. చెంచమ్మ పాల్గొన్నారు.

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు….

 అనంత ఘటన విచారణపై మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Sandhya Rani) ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయారనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేశారు మంత్రి సంధ్యారాణి.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి సంధ్యారాణి వార్నింగ్ ఇచ్చారు.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని ఐసీడీసీ సూపర్వైజర్ సద్గుణ అన్నారు.తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో సోమవారం మొగుడంపల్లి మండలంలో అంగన్వాడి టీచర్ ఎస్.తుల్జమ్మ ఆధ్యక్షతన అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు.తల్లిపాలు బిడ్డ మానసిక,శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు.చాలా మంది తల్లులు పిల్లలకు తేనె,నీళ్లు వంటివి పడుతుంటారని,అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు.రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని సూపర్వైజర్ సద్గుణ పేర్కొన్నారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప,ప్రవీణ, అంగన్వాడి టీచర్ తుల్జమ్మ, ఆశ వర్కర్లు యశోద, ప్రకృత,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version