ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

#నెక్కొండ, నేటి ధాత్రి:

బంజర్‌పల్లిలో అభివృద్ధి పనులకు ప్రజల ప్రశంసలు
నెక్కొండ మండలంలోని బంజర్‌పల్లి గ్రామ పరిధిలోని పొన్నాలవాడలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ రాథోడ్, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కి అశోక్ , నెక్కొండ మండల కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి దిశగా ఇటువంటి పనులు కొనసాగాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version