మంచిర్యాల మేయర్ ను కలిసిన మూడో వార్డు కార్పొరేటర్…

మంచిర్యాల మేయర్ ను కలిసిన మూడో వార్డు కార్పొరేటర్:
నేటి ధాత్రి:- శ్రీరాంపూర్:-

మూడవ వార్డు శ్రీరాంపూర్ ప్రజల సమస్యలు కార్పొరేటర్ పత్తి పకృతి వెంకటేష్. మేయర్ ధరణి మధును కలిసి కృష్ణ కాలనీలో ఉన్న నీటి సమస్యలను. పరిష్కరించాలని కోరుతూ బోరు మోటార్స్ కొత్తవి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అలాగే. మూడో వార్డులో ఉన్న ఇంకెన్నో సమస్యలు కూడా మాకు వీలైనంత త్వరగా చేకూర్చాలని మేయర్ పత్తి పకృతి వెంకటేష్ తెలిపారు. ఎలాంటి సమ స్యలైనా నా ప్రజలకు నేను తీర్చిదిద్దుతానని చెప్పాను. నాకు వీలైనంత త్వరగా మా యొక్క పనులు పూర్తి చేయాలని మేయర్ ను కోరడం జరిగింది.

నిరుపేద కుటుంబానికి అండగా ఒకటో వార్డ్ యువత..

నిరుపేద కుటుంబానికి అండగా ఒకటో వార్డ్ యువత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డ్ లో నిరుపేద కుటుంబానికి చెందిన సుర చెన్నమల్లు అనే వ్యక్తి చనిపోవడంతో వారి కుటుంబానికి మేమున్నామంటూ ఒకటో వార్డు యువత, వార్డ్ ప్రజలు కలిసి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చెన్నమల్లు కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో వార్డు ప్రజలు ,యువత కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఇంకెవరైనా దాతలు ఉంటే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా చొరవ తీసుకోవాలని ఒకటో వార్డ్ యువత కోరారు. ఈ కార్యక్రమంలో ఆశనవేని సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య పిల్లి సతీష్, ముక్తి శ్రీనివాస్, మేకల కుమారస్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి చేయూత..

నిరుపేద కుటుంబానికి చేయూత

నేటిదాత్రి :హన్మకొండ

ఇటీవల కాలంలో బండారి లక్ష్మి ముదిరాజ్ అనారోగ్య రీత్యా మరణించిన నేపథ్యంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి తాళ్ళ రవీందర్, సింగారపు రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కుల పెద్దలు దండు నర్సయ్య, దండు రవి, దండు రాజు సమక్షంలో బాధిత కుటుంబానికి 10,000 పదివేల రూపాయలు క్వింటల్ బియ్యం అందజేశారు.

అనంతరం సంఘం నేతలు వార్డు మెంబరు మేక సుమలత రాజు, గంగరబోయిన నిరంజన్ లు సంయుక్తంగా మాట్లాడుతూ, కూలి పనికి వెళ్లి వచ్చి కట్టుకున్న భార్య లక్ష్మి తన కళ్ళ ముందు చనిపోతుంటే చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న కొమురయ్య పరిస్థితి, కుటుంబ దయనీయ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని

పిఆర్ ముదిరాజ్ సేవా సమితి పెద్దలు సిద్దిపేట మాజీ కౌన్సిలర్ పెసరు రాజన్న
గ్రామ వాస్తవ్యులు కె ఎస్ ఆర్ అభ్యాస్ విద్యాసంస్థ చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి కుల ప్రముఖులు, దాతల సహకారంతో బాధిత కుటుంబానికి సాయం చేయడం చాలా గర్వకారణమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ముదిరాజ్ జాతి ఐక్యతకు దోహదపడతాయని, ముదిరాజు బిడ్డలు దానం చేసే స్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సేవకులు ముద్రబోయిన రమేష్
దండు రవి, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు దండు నర్సయ్య, కార్యదర్శి దండు రాజు, డైరెక్టర్ మేక అనిల్, మేక సుమలత రాజు;
గౌరవ సలహాదారులు గాలిబు సంపత్, గంగరబోయిన నిరంజన్ వాడకట్టు కుల బంధువులు కుమ్మరికుంట్ల రాంబాబు, భూమ సంపత్, పొన్నం, కోమ్మయ్య, దండు రాజేందర్ , రాములు కుమ్మరికుంట్ల చంటి యువజన నాయకులు గంగరబోయిన నవీన్, దండు ఉదయ్ కిరణ్, సందీప్, దండు రమేష్, సాంబయ్య, దండు బాలయ్య, దండు చిరంజీవి ముదిరాజ్; బండారి లక్ష్మి కుటుంబ సభ్యులు కొమురయ్య, కూతురు ఎలా స్వాతి, సంధ్యరాణి, సిరి చందన, రిక్విత మణికుమార్ పాల్గొన్నారు.

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం…

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రి

 

 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య ఆదేశాలమేరకు
దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన
మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ
ములుగు జిల్లా మంగపేట మండలం పెరకలకుంట గ్రామం లో నిరుపేద కుటుంబంకు చెందిన మడకం నరెందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ పరామర్శించి మనోధైర్యం కల్పించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.ఇలాంటి సంధర్బంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దశదిన కర్మలకు 50 కేజీ ల బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని శాసనసభ్యులు మాణిక్ రావు …

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని శాసనసభ్యులు మాణిక్ రావు …

జహీరాబాద్ నీటి ధాత్రి:

 

జహీరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని రాచన్నపేట్ లో నివాసముండే అప్పం రజిత బతుకు తెరువు కోసం తన ఇరువురు పిల్లలతో హైదరాబాదులోని బోరబండా ప్రాంతంలో ఉంటున్నారు కుమారుడు నందకిషోర్(14 సంవత్సరాలు) గత వారం రోజుల క్రితం గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు గాలిపటం చిక్కుకోవడంతో విద్యుత్ షాక్ వచ్చి ఎక్కువ మొత్తంలో శరీరం కాలిపోయి ఆసుపత్రిలో నాలుగు రోజులు చికిత్స పొంది రెండు రోజుల క్రితం మృతి చెందడం జరిగింది శాసనసభ్యులు మాణిక్ రావు రాచన్నపేట్ లోని వారి ఇంటికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారుకుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అధైర్యపడొడ్డు అండగా ఉంటాం అని భరోసా కల్పించారు తల్లి జీవన ఆధారం కొరకు తమ వంతు సాయం చేస్తాం అని అన్నారు
ఎమ్మెల్యే పాటుగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, ఆర్ సుభాష్ ,స్థానిక నాయకులు నందు గౌడ్, తులసి మక్కని తదితరులు ఉన్నారు,

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందిగా పనిచేస్తున్న కనకం దుర్గమ్మ భర్త కుమార్ గురువారం రోజున మృతిచెందినారు. వీరిది చాలా బీద కుటుంబం దహన సంస్కారం కొరకై ఆర్థిక అత్యవసరాల కొరకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న గోపాలరావుపేట గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు ఎనిమిది వేల ఏడు వందల నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనుకయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి రవిశాస్త్రి, గౌరవ అధ్యక్షులు ఒద్దుల హన్మంత రెడ్డి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు దాసరి అనిల్, ఉపాధ్యక్షులు సిపెల్లి తిరుపతి, మాజీ ఎంపిటిసి దాసరి అరుణ్ కుమార్, ఐదవ వార్డు సభ్యులు ఏపూరి పరుశురాంగౌడ్, మాజీ వార్డు మెంబర్స్ దాసరి బాబు, సిపెళ్లి వెంకటేష్, సేవా సంస్థ సభ్యులు ముంజ శేఖర్ గౌడ్, దాసరి శ్రీనివాస్, సీపెళ్లి చంద్రయ్య, జీపీ కార్మిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

“నిరుపేద రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలి”

అకస్మాత్తుగా మరణించిన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఆకారపు రాజయ్య నిన్నటి రోజు గుండెపోటు రావడంతో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రామానికి చెందిన రాజయ్య నిన్నటి రోజు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి నా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి రాములు. రాజయ్య జిల్లెల గ్రామంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికునుగా పనిచేస్తూ వడ్ల సీజన్లో అమాలిగా వడ్లు జోకుతూ ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని వారి పెండ్లిలకు గాను తనకున్న యావదాస్తి భూములు జాగాలు పొలం అమ్ముకొని ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో గుడిసెలో జీవనం సాగిస్తూ ఉంటున్నారని. అలాంటి నిరుపేద వారికి గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో గాని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ వారికి కానీ ఇటువంటి నిరుపేదలు కనిపించడం లేదా. ఇలాంటి నిరుపేద కార్మికుల కుటుంబాన్ని ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి వారి జీవితాలు మారడం లేదని వెంటనే ప్రభుత్వ o . గుర్తించి ఇలాంటి కుటుంబాల వారిని ఆదుకోవాలని కోరుతూ ఇటువంటి నిరుపేదలు ఉండడానికి ప్రభుత్వం కేటాయించే డబ్బులు బెడ్ రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అందించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూవారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని ఇచ్చి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని. వారినీ ప్రభుత్వాo ఆదుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు. జిల్లా నాయకులు బాచుపల్లి శంకర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version