ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

#నెక్కొండ, నేటి ధాత్రి:

బంజర్‌పల్లిలో అభివృద్ధి పనులకు ప్రజల ప్రశంసలు
నెక్కొండ మండలంలోని బంజర్‌పల్లి గ్రామ పరిధిలోని పొన్నాలవాడలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ రాథోడ్, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కి అశోక్ , నెక్కొండ మండల కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి దిశగా ఇటువంటి పనులు కొనసాగాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామసభ నిర్వహణ…

గ్రామసభ నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్నందున, నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామని ప్రతి ఇంటికి సరిపడా నీటిని అందజేస్తామన్నారు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. ఇంకా దోమల నివారణ, చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతర్గత సిసి రోడ్లు, కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంబించామని తెలిపారు. సిబ్బందితో అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న అదనంగా సిబ్బందిని పెట్టి పనులు కోన సాగిస్తున్నాం అని తెలిపారు. ఈకార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప సర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు తడగొండ రాజు, పాదం ఉమ, పాదం రాజయ్య, పన్యాల విద్యా సాగర్, పెంచాల అంజయ్య, డా.మౌనిక, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు అధ్యక్షులు సులోచన, సీఏలు వనజ, రజిత, లైన్ మెన్ గాల్ రెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version