మంజూరు అయి నెలలు గడుస్తున్న పట్టించుకోని ఆర్.అండ్.బి అధికారులు…

మంజూరు అయి నెలలు గడుస్తున్న పట్టించుకోని ఆర్.అండ్.బి అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్ నుండి చించోలి వయా మొగుడంపల్లి మండల మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అంతర్ రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు గత రెండు నెలల క్రితం హోతి బి గ్రామం గోవింద్ పూర్ గ్రామం మద్యన కల్వర్టు పూర్తిగా ద్వంసం అయిపోయింది, దింతో వాహనదారులకు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీళ్లు ఎక్కడిక్కడనే ఆగిపోవడం జరిగింది కల్వర్టు పాడైపోయినందున నీరంత రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఆర్.అండ్.బి డీఈఈ కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి.అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.

దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మిస్తే బాగుటుంది,

ఆర్.అండ్.బి అధికారుల నిర్లక్ష్యం…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

ఆర్.అండ్.బి డీఈఈ కి అక్కడి నుండే సమస్యను వివరించగా కల్వర్టు మంజూరు అయిందని వెంటనే పనులు చేపడతామని అధికారి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఏర్పడి రెండు నెలలైన సమస్యను అధికారి దృష్టికి తెచ్చి కూడా నెల దాటిన ఇప్పటి వరకు కూడా కల్వర్టు నిర్మించలేదు అని నరోత్తం అన్నారు.పంట పొలాల్లో నీరు నిలబడి పంటలకు నష్టం జరుగుతున్నది నీళ్లు రోడ్డుపైకి వచ్చి నిలబడటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి

వాహనదారులు క్రింద పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి అంతర్రాష్ట్ర,మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు కావడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది నాయకులు తిరిగే రోడ్డు మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. దీనికంతటికీ కారణం అధికార పార్టీ నిర్లక్ష్యమే కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని వెంటనే ఆ కల్వర్టును నిర్మించాలని డిమాండ్ ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం అన్నారు.,

విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే…

విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎంబీబీఎస్‌‌ సీటు సాధించిన విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ గారి అల్లుడు ,ఆనంద్ గారి కుమారుడు హర్షిత్ క్వాలిఫై అయ్యి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల, కొనింటి మాణిక్‌రావు విద్యార్థి ని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,నాయకులు తదితరులు..

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు కుటుంబాన్ని…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T135918.056.wav?_=1

 

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు మాతృమూర్తి న్యాలపట్ల మల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామంలో రాజు నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించిన అనంతరం మల్లవ్వ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గునుకులకొండాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో న్యాలపట్ల మల్లవ్వ పాత్ర ఉందని, గత నలభై సంవత్సరాలుగా వారి కుటుంబమంతా సిపిఐకి అండగా ఉంటున్నారని, తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, ఇందుర్తి శాసనసభ్యులుగా పని చేస్తున్న కాలంలో మల్లవ్వతో, వారి కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మల్లవ్వ చిన్న కుమారుడు రాజు విద్యార్థి యువజన దశ నుండే అనేక పోరాటాల్లో పాల్గొన్నాడని, ప్రస్తుతం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతున్నాడని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొని కేసుల పాలై జైలు జీవితం గడిపాడని, నాడు జనశక్తి వారితో ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ గానీ వారి కుటుంబం గానీ మొక్కవోని ధైర్యంతో ఉన్నారని, కుమారునికి ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ ఎంతో ధైర్యంగా ఉండేదని అలాంటి మల్లవ్వ మృతి చెందడం అత్యంత బాధాకరమని వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేయడంతో పాటు అండగా సిపిఐ ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల సిపిఐ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, జాగీరు సత్యనారాయణ, నాగెళ్లి లక్ష్మారెడ్డి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, బూడిద సదాశివ, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలీ బాపు రెడ్డి, నవాబుపేట మాజీ ఉపసర్పంచ్ ఎలగందుల రాజయ్య, సిపిఐ మండల నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, అంజయ్య, తదితరులు ఉన్నారు.

ఎన్నికల వాయిదా ప్రక్రియపై బీసీల నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134943.130.wav?_=2

 

ఎన్నికల వాయిదా ప్రక్రియపై బీసీల నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెలలో పెరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ వేసిన నేపద్యంలో హైకోర్టు స్టే విధించడం పట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సామ్రాజ మల్లేశం అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్టే తేవడం అనేది అగ్రవర్ణాల కుట్రగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి స్టేలకు, కోర్టులకు వెళ్లలేదని తెలిపారు.మా ఓట్లు మీకు అవసరంకాబట్టే ఇలాంటి కుట్ర పన్నుతున్నారని తస్మాత్ జాగ్రత్త అని అగ్రవర్ణాలను సోల్తి సారయ్య హెచ్చరించారు.హై కోర్టు స్టే పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే బీ.సీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బందులో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాలపూర్ నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోల్తి రవి,నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గండు రవి,ఉపాధ్యక్షుడు చీర వెంకట్ నారాయణ,జిల్లా యువ నాయకులు బైరి నాగరాజు, సోల్తి అనిల్,సోల్తి పెద్ద సాంబయ్య,సోల్తి చిన్న సాంబయ్య
అఖిల్,అనీష్,రాజు,రమేష్,సంపత్ సతీష్ ,రాంబాబు, కే సాంబయ్య తదితరులు తెలిపారు.

కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134240.033.wav?_=3

 

— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్

నిజాంపేట: నేటి ధాత్రి

 

విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T133534.280.wav?_=4

 

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది.?
మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ మాట్లాడుతు బి ఆర్ఎస్ పార్టీ పదిఏండ్లు అధికారంలో ఉండి.. బీసీ రిజర్వేషన్ల మీద కనీసం బిల్లు కూడా పాస్ చేయించుకోలేదు టిఆర్ఎస్ పార్టీ..?
బి ఆర్ఎస్ నాయకులంతా గొప్ప గొప్ప మేధావులు..
బిల్లు ఎలా పెట్టాలో తెలుసు..
ఆర్డినెన్సులు ఎలా తీసుకు రావాలో తెలుసు..
కేంద్రంతో ఎలా కోట్లాడలో తెలుసు.. అంటున్నారు..
మరి ఇన్ని తెలిసి పదేండ్లు అధికారం లో ఉండి.. బిసిల పట్ల మీరు చూపించిన నీతి ఏంటి?

నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు.. ఆట ఆడే వాడికి తెలుసు ఎలా ఉంది పరిస్థితి అని.
దేశం లో, స్వాతంత్రం నుంచీ.. పేదల పట్ల చట్టాలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నే..
బిసి రిజర్వేషన్ల బిల్లు కూడా సాధించి తీరుతుంది.*
తెలంగాణ కోసం ఎన్నాళ్లు కోట్లాడితే తెలంగాణ వచ్చింది? అడగగానే తెలంగాణ ఇచ్చారా? ఎన్నో ఏండ్లు కోట్లాడితే వచ్చింది తెలంగాణ.. అది ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే..!!
బీసీ బిల్లు కూడా అంత సులువైన వ్యవహారం కాదు..!
కాంగ్రెస్ పోరాడుతుంది.. సాధిస్తుంది..!
బి ఆర్ఎస్ కి బీసీ ల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే పందేడ్లలో ఏనాడైనా బీసీ ల కోసం ఏమైనా చేసిందా? చెప్పండి..
కనీసం బి ఆర్ఎస్ నుంచి ఒక్కటంటే ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వెయ్యలేదు బీసీ రిజర్వేషన్ల కేసులో..
నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు..
బి సి రిజర్వేషన్లు మాత్రం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం..అవుతుంది.!! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న జీవో నెంబర్ స్టే హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బిజెపి టీఆర్ఎస్ పై ప్రజలు మండి పడుతున్నారని బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాత రాజు రమేష్ విలేకరులకు కాంగ్రెస్ పార్టీవివరించారు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపింది బిజెపి ప్రభుత్వం కాదా? రిజర్వేషన్ 50% మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు ఇక్కడ రెండు పార్టీలు కుట్ర స్పష్టంగా కనబడుతుందని అదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు

తుల్జా భవానీ ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T132840.233.wav?_=5

 

 

తుల్జా భవానీ ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అర్బన్: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఖాన్జమాల్పూర్ (భవనమ్మ పల్లె)లోని తుల్జాభవానీ మాత ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి బంగారం, వెండి నగలు సహా హుండీ ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును అపహరించి ఆలయ పరిసరాల్లో పడేసి వెళ్లిపోయారు. ఇటీవల దసరా వేడుకల అనంతరం అమ్మవారి నగలు, హుండీ కానుకలు లెక్కించకుండా ఉంచడంతో దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.

హుండీ ఆదాయం రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు భావిస్తున్నారు.చోరీ ఘటన తెలుసుకున్న చిరాగ్పల్లి పోలీసులు ఆలయానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115912.178.wav?_=6

 

రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం పట్ల రెడ్డి జాగృతి నాయకులు కేసు వేసి అడ్డుకోవడం పట్ల స్పందించిన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది అని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు . 5 శాతం లేని అగ్రవర్ణాలకు 10 శాతం EWS రిజర్వేషన్ ఇస్తే ఏ బీసీ నాయకులు అడ్డుకోలేదని అగ్ర వర్గాలలో ఉన్న పేదలకు న్యాయం చేయాలని కోరుకున్న బీసీ సమాజానికి నేడు రెడ్డి జాగృతి నాయకులు బీసీలకు వచ్చిన 42% రిజర్వేషన్లు పట్టు పట్టి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో బీసీలు అగ్ర వర్గాలతో రాజకీయ యుధం చేయడానికి సిద్ధమే అని హెచ్చరించారు.ఈ సమావేశంలో లో జహీరాబాద్ తాలూకా బీసీ నాయకులు కొండాపురం నర్సిములు, డా.పెద్దగొల్ల నారాయణ,పెద్దతోట రాచన్న ,కోహిర్ మండల్ నాయకులు,విశ్వనాథ్ యాదవ్,రమేష్ ముదిరాజ్,గొల్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీకాంత్,అంబదాస్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115143.728.wav?_=7

 

 

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. గురువారం కోహీర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ శ్రేణులు ఈ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలు అండగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ…

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ

ఏరియా జియం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

వోల్వో డంప్ ట్రక్కు ఆపరేటర్ కోసం పదవ తరగతి ఉత్తీర్ణులై, కనీసం మూఢు సంవత్స రాల,అనుభవం కలిగివున్న హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి నిరుద్యోగ యువకులైన సింగరేణి ఉద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు, పరిసర గ్రామాల ప్రజలు, భూనిర్వాసితుల కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు . దీనికి ముడునెలలకు ఒక బ్యాచ్ కు 60 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు పదవ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరం, మెరిట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు . ఎస్సీ, ఎస్టీ వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, వయస్సు మినహాయింపు ఉంటుందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారికి ఎటువంటి స్టెఫండ్ కానీ భృతి కానీ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తిగా వారి సొంత పూచికత్తు మీదనే ఆధారపడి ఉంటుందని తెలియజేశారు.ఈ దరఖాస్తులను అక్టోబర్ 20 లోపు సంబంధిత భూపాలపల్లి సింగరేణి ఎంవీటీసీ (మైన్ వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్) లో అందజేయాలని తెలియజేశారు .

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం….

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలు, గుడ్డు,తాజా ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు తగిన పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలని అప్పుడే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలు, మహిళలతో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, ఆయమ్మ,గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు మహిళలు పాల్గొన్నారు.

చే గెవారా ఆశయాలను కొనసాగించాలి….

చే గెవారా ఆశయాలను కొనసాగించాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని చే గువేరా వర్ధంతి సందర్భంగా ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ చే గెవారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.

అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14 న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు.

1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం
నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు చేగువేరా భావించాడు ఎన్నో పోరాటాలు చేసిన అతడు 39 సంవత్సరాలు అనేక ప్రజా పోరాటాలు చేసినారు
1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో జన్మించిన చెగువేరాను..
1967 అక్టోబర్ 9న బొలీవియాలోని లా హిగువేరాలో అమెరికా సీఐఏకు బలైపోయారు. ఆయన్ని ఓ పాఠశాలలో బంధించి కాల్చి చంపారు. ఓ మహా ప్రస్థానానికి ముగింపు పలికారు. కావున చేగువేరా ఆశయాలను కొనసాగించాలి

న్యాయమూర్తి పై దాడి… రాజ్యాంగంపై దాడి జరిగినట్టే…

న్యాయమూర్తి పై దాడి… రాజ్యాంగంపై దాడి జరిగినట్టే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాట్లాడుతు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన జరిగిన దాడి అంటే రాజ్యాంగం పై దాడి అని ప్రజాస్వామ్యం పై దాడి అని దేశ దళిత బహుజనుల పై దాడి రాజ్యాంగాన్ని అవమానించడమేనని మతోన్మాద విష సంస్కృతితో నే ఇలాంటి భౌతిక దాడులు జరుగుతున్నాయి ఈ దేశాన్ని మనువాద కోణంలో పరిపాలించాలనే దురుద్దేశంతో కొంతమంది మనువాదులు దళితుల పట్ల చూపే రాజకీయవాదులు చేసే కుట్రలను మేము ఖండిస్తున్నాం,ఈ సంఘటనను దళిత గిరిజన బహుజనులు వెనుకబడిన వర్గం మేధావులు ప్రజలు వ్యతిరేకించాలని వారు తెలిపారు.

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో. పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రజలను దోచుకున్నోళ్ళు దోకా. కార్డు రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉందని. సిరిసిల్ల వేదికగా చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా అవినీతికి ఆద్యం పోసింది కేటీఆర్ కాదా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తుంటే కళ్ళు మండుతున్నాయి . గత మీ పాలన లో.చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చి కొడుతారని.తప్పుడు ప్రచారానికి తెర లేపుతున్నారని. గత పది సంవత్సరాలు. అమలుకునోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా. ప్రజలను అరిగోశపెట్టి ఇబ్బందులకు గురిచేసింది మీరు కాదా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుంటే గులాబీ నేతల కళ్ళు మండుతున్నాయని హామీ ఇచ్చిన ప్రకారం ఆరోగ్యారంటీలలో నాలుగు హామీలను అమలు చేసిన o. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమం ఆపడం లేదు అని. సిరిసిల్ల వేములవాడ గులాబీ నాయకులు ఇంత దోపిడీ చేసింది ఏం చేసింది అందరికీ తెలుసు అని బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బి ఆర్ఎస్ నేతల . కండ్లు మండుతున్నాయని మీ ప్రభుత్వ హయాంలో మీరు బీసీలకు ఏం చేశారో చెప్పాలి. ఫామ్ హౌస్ లో.పడుకోవడానికి తప్ప పరిపాలన చేతగాని మీరా మమ్మల్ని విమర్శించేది గుట్టలకు గుట్టలకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనం కోట్లు కొల్లగొట్టారని మూడు వేల కోట్ల విలువైన ఇసుకను సిరిసిల్ల నుండి తరలించి మీ నాయకులు కోట్లు
సంపాదించిన మీరు ధోక కార్డు రిలీజ్ చేయడం సిగ్గుచేటని కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని. ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ లీడర్ల అవినీతి కార్డులు రిలీజ్ చేసి ఎన్నికలకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయంలో ఉద్యోగాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు….

వ్యవసాయంలో ఉద్యోగాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు….

తంగళ్ళపల్లినేటి ధాత్రి….

 

బి జె ఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో.08.10.2025.న. వ్యవసాయ ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి ప్రధాన అతిథిగా. శ్రీ మెండు శ్రీనివాసులు. సహాయ వ్యవస్థాపకుడు సమృద్ధి ego అగ్ర ఫ్లెక్సీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు హాజరై. విద్యార్థులకు వ్యవసాయ రంగంలో ఉన్న వివిధ అవకాశాలు వ్యవసాయ పారిశ్రామికత. నైపుణ్య అభివృద్ధి అంశాలపై విలువైన సూచనలు చేశారు కళాశాల అసోసియేట్ డాక్టర్ సునీత దేవి మాట్లాడుతూ విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు అర్జించాలని నూతన వ్యవస్థాపక తలు. చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్లేస్మెంట్ ఇన్చార్జి డాక్టర్ ఆర్ సతీష్. డాక్టర్ భవ్య శ్రీ. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు అవగాహన సదస్సుకు విచ్చేసిన. వారు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు

మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎఫ్ ఆర్ ఓ తేజస్వి ఆర్థిక సహాయం అందజేత…

మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎఫ్ ఆర్ ఓ తేజస్వి ఆర్థిక సహాయం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…

 

తను ఒక ఆడపిల్లనని గర్వించి ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న తండ్రి చనిపోవడంతో మానవత్వం చాటుకున్న ఎడుల్ల బయ్యారం ఎఫ్ ఆర్ ఓ తేజస్వి కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామంలో కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో గత 25 రోజుల నుంచి హాస్పటల్లో ఉంటూ నిన్న రాత్రి హైదరాబాదులో మరణించారు అతనికి ముగ్గురు ఆడపిల్లలే వాళ్లు కూడా చిన్నవారని తెలుసుకున్న మహిళా అధికారిని ఏడుల బయ్యారం రేంజ్ ఎఫ్ఆర్ఓ తేజస్వి వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు తన సహాయకుడి ద్వారా అందించడం జరిగినది, ఆడపిల్లలు ఎప్పుడు కూడాను తల్లిదండ్రులకి భారం కాకూడదని తన మనోవేదన ద్వారా తెలియజేయడం జరిగినది కనుక కుటుంబంలో మగ పిల్లగాడు ఎంతో ఆడపిల్ల కూడా అంతే అని ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి తనదైన శైలిలో తెలియజేయడం జరిగినది.
, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు
పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు
గ్రామ పెద్ద మనుషులు బంధువులు తదితరులు పాల్గొన్నారు

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

*సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*’సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*కమిషనర్ ఎన్. మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి)అక్టోబర్
09:

 

సదరం ధ్రువ పత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య వైద్యులకు సూచించారు. వికలత్వం యొక్క శాతాన్ని నిర్దారిస్తూ రుయాసుపత్రి లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను గురువారం ఉదయం కమిషనర్ తనిఖీ చేశారు. ఏ విధంగా పరీక్షలు చేస్తారు, రోజూ ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయాలను రుయా వైద్యులు కమీషనరకు వివరించారు. చెవి, ముక్కు, ఎముకలు, మానసిక రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్యులు అందించే సదరం ధ్రువ పత్రాల మేరకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పరీక్షలు చేయాలాని వైద్యులకు సూచించారు. పరీక్షల కొరకు వచ్ఛే వారికి తాగునీరు, నీడ తదితర మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. రోజుకి వందమందికి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పలువురు వైద్యులు ఉన్నారు

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

తాండూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద సిఐ దేవయ్య ఆదేశాల మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య పటిష్ట బంధవస్తు నిర్వహించారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్సై లు హెచ్చరించారు.అలాగే తాండూర్ మండల కేంద్రంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ…

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్.

 

తమిళనాడు లోని తాంబరం సివెట్ కళాశాల మైదానంలో ఆదివారం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలమురుగన్ నిర్వహించిన ప్రపంచ రికార్డు ప్రయత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఫునాకోషి షోటోకాన్ కరాటే-డో ఇండియా అసోసియేషన్‌కు చెందిన బ్లాక్ బెల్ట్ 4వ డాన్ షేక్ యాసీన్ పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు సృష్టి కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన యాసీన్‌కు వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ తరఫున పతకం, సర్టిఫికేట్‌ లను లండన్‌కు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌చార్జ్ రిషినాథ్ అందజేశారు.

ఈ విజయంపై ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ రాచా శ్రీనుబాబు (బ్లాక్ బెల్ట్ 7వ డాన్) యాసీన్‌ను అభినందిస్తూ, ఆయన కృషి మరియు ప్రతిభ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం వరంగల్ కరాటే అభిమానులకు గర్వకారణమని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version