ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే జీతాలు చెల్లించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-26T140309.723.wav?_=1

 

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే జీతాలు చెల్లించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు జీతాలు రాక పండగ పూట పస్తులే నేనా అని పీల్డ్ అసిస్టెంట్ల ఝరాసంగం మండల స్వతంత్ర సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ పటేల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ గడిచిన గత 20 సంవత్సరాలు నుండి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటు వంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు రావడం లేదన్నారు.

గత మూడు నెలల నుండి జీతాలు రాక ఫీల్డ్ అసిస్టెంట్లు హరిగోస పడుతున్నారన్నారు. పండుగ పూట జీతాలు వస్తాయని ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదురుచూస్తున్నారన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మూడు నెలలుగా అందని వేతనాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-26T132947.445.wav?_=2

 

మూడు నెలలుగా అందని వేతనాలు

◆:- ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల దుస్థితి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల అభివృద్ధి కార్యాలయంలో విధులు నిర్వహి స్తున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు మూడు. నెలలుగా వేతనాలు అందకపోవడంతో పండుగకు పస్తులు ఉండవలసిన పరిస్థితి దాపురించిందని ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం ఝరాసంగం మండల అధ్యక్షులు రవి కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 25 మండలాలలో 72 మంది ఈ పంచాయతీ ఆపరేటర్ కార్మికులు గా కొనసాగుతున్నారు. ఒక్కొక్కరికి 5.19500 చొప్పున వేతనాలను అందిస్తుండటంతో చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వాపోయారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ప్రతినెల వేతనాన్ని అందించాలని కోరు తున్నాము తప్ప పర్మనెంట్ చేయమని కోరడం లేదన్నారు. 2015 నుండి ఇప్పటివరకు ప్రభుత్వానికి అనేక రకాలైన సేవలను అందజేస్తున్నమన్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వము మమ్ములను గుర్తించకుండా వేతనాలను ప్రతి నెల అందజేయకపోవడంతో కుటుంబ పోషణ భారమై భార్య పిల్లలు ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నామని వ్యక్తపరిచారు. అదేవిధంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కూడా వేతనాలు సమయానికి చెల్లించకపోవడంతో పండుగకు అప్పు పుట్టక పోవడంతో కుటుంబాలకు షాపింగ్ కూడా చేయలేకపోతున్నామన్నారు.

పెదమెడిసి లేరు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేస్ వర్కర్ల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు..

పెదమెడిసి లేరు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేస్ వర్కర్ల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండలంలో పెద మెడిసి లేరు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్లు సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు పిలుపుమేరకు ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావు ఎస్కె సాదిక్ నాయకత్వంలో సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్టీ సెల్ సెక్రెటరీ డైలీవేజ్ వర్కర్లు 12 వ తేదీ నుండి సమ్మె చేస్తున్నరు వారికి రావలసిన జీతం బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి వారిని అనేక సంవత్సరాల నుండి పాఠశాలలో వర్క్ చేయించుకుంటున్న వారిని పర్మినెంట్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుంది వెట్టి చాకిరి చేయించుకుంటూ డైలీ వేస్ వర్కర్లకు జీతం ఇవ్వకుండా నాన ఆగచాట్లు పెడుతుంది జీతం వస్తే గాని రోజు గడవని కార్మికులకు జీతాలు ఆపి వేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించాలి భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ డైలీ వేస్ వర్కర్ల సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నామని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్యామల రామారావు కారం కోటేష్ పూనమ్ నారాయణ పూనం ముత్తయ్య తాంబ నరసింహారావు తాంబ లక్ష్మయ్య పూజారి శ్రీను పూజారి మహేష్ ఎస్కె వహీద్ తదితర టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

చినుకు పడితే నర(డ)క ప్రాయమే…

చినుకు పడితే నర(డ)క ప్రాయమే…
హైడ్రా ఆర్.&బి. అధికారులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారేమో??
ఫ్లై ఓవర్ బ్రిడ్జి రోడ్డు బాగు చేయాలని బాలానగర్ వాసుల వినతి
హైదరాబాద్, నేటిధాత్రి:
హైదరాబాద్ లోని బాలానగర్ వార్డు పరిధిలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గత కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకి ఇబ్బందులుగా మారాయి.వర్షం కురిస్తే చాలు ఇక్కడ గుంతల్లో నీరు నిలిచి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఈ గుంతలు చూసి స్థానికులు మన్సూర్ ఎమర్జెన్సీ బాధ్యతలు తీసుకున్న హైడ్రా సిబ్బంది కి కూడా తెలియజేస్తే వారు ఆర్ అండ్ బీ కి సంబందించిన పని కాబట్టి వాళ్ళకి ఫిర్యాదు చేయాలని తప్పించుకుంటున్నారు.

Balanagar Flyover

అటు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవిస్తే అది హైడ్రా కంట్రోల్లో ఉంది అందుకే మేము అక్కడ ఏ పని చేయలేవు అని ఆర్.&బి అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇలా ఇరు శాఖలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని తప్పించుకుంటున్నాయి తప్ప ప్రజల సేఫ్టీ కోసం ఏ శాఖ కూడా ఆలోచన చేయడం లేదు. స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు జరగకముందే గుంతలు పూడ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అని స్థానికులు వాపోతున్నారు.

Balanagar Flyover

ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్డు పైన గుంతలు పునరావృత్తం కాకుండా నాణ్యమైన మెటీరియల్ తో పూడ్చి ఏ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు..

తాసిల్దార్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయండి.

ఈనెల 15న తాసిల్దార్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయండి

మడిపల్లి శ్యాంబాబు మాదిగ
జిల్లా ఇన్చార్జి

అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ విహెచ్ పేస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం
ఎంఆర్పిఎస్ భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి
మడిపల్లి శ్యాంబాబు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగలు హాజరై మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీయడానికి ఈనెల 15వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల తాసిల్దార్ కార్యాలయాల ముట్టడించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రతి గ్రామం నుండి వచ్చి ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వికలాంగులు వృద్ధులు విత్తంతులు బీడీ గీత నేత నూతన పెన్షన్ దరులందరూ పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు బొల్లి బాబు మాదిగ
నోముల శ్రీనివాస్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేంద్ర మాదిగ దూడపాక శ్రీనివాస్ మాదిగ
టౌన్ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ మిరపటి అశోక్ మాదిగ రేణిగుంట్ల రవి మాదిగ మంద తిరుపతి మాదిగ ఎర్ర భద్రయ్య మాదిగ చంటి మాదిగ నూనెపాకుల కుమారు మాదిగ మంద కిరణ్ మాదిగ మంచినీళ్ల వైకుంఠం మాదిగ బోడికల శ్రీకాంత్ మాదిగ ఒంటెరి రాజేష్ మాదిగ కుమ్మరి అనిల్ మాదిగ బోడికల సమయ మాదిగ సునీల్ మాదిగ మంగళ రవి
తదితరులు
పాల్గొన్నారు.

వంట కార్మికులకు భీమా కల్పించాలి డిమాండ్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T135851.019.wav?_=3

 

మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని భాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు,, మల్లంపల్లి మండలాల సంయుక్త సమావేశము గున్నాల రాజకుమారి,,అంకం పధ్మ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ పాఠశాలలలో వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులు అంటే ప్రభుత్వానికి, అధికారులకు చిన్నచూపు అన్నారు అందుకే వారి సర్వీసు,సేవాభావానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హేళనగా చూస్తున్నారు అన్నారు,వంట కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్ళినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికే వంటలు చేస్తున్న సందర్భంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా జరిగాయి అన్నారు రంగారెడ్ది జిల్లా శంషాబాద్ లో, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గాంధినగర్ లో, హన్మకొండ జిల్లా కటాక్షపూర్ లో,నిన్న నిజామాబాద్ జిల్లా అమ్రాధ్ ఉన్నత పాఠశాలలో లలిత అనే కార్మికురాలు ఇలా గంజి పడి ఒకరు, కుక్కర్ పేలి ఒకరు కూర పడి ఒకరు ఇలా అనేక మంది వంట కార్మికులకు విపరీతమైన గాయాలై నడువలేని స్థితిలో ఉన్నారు అన్నారు ఇదంతా విధ్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్న సందర్భంలో జరిగినవే లక్షలాది రూపాయలు వారు స్వంతంగా పెట్టుకోవలసిన పరిస్థితితులు వీరు ప్రభుత్వం లో భాగస్వాములు కారా వారి ఖర్చులు ప్రభుత్వం భరించకూడదా అన్నారు కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి వంట కార్మికులకు భీమా కల్పించి పరిహరాలు అందించాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే లక్షలాది రూపాయలు స్వంత డబ్బులు పెట్టి వంటలు చేస్తుంటే ఆ బిల్లులు నేలల తరబడి పెండింగ్లో ఉండి అప్పుల పాలౌతుంటే, మల్లీ ప్రమాదాలు జరుగుచున్న సందర్భంలో ప్రభుత్వం భరించక పోతే ఎలా అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పరిహరాలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్రంలో ఉన్న 54200 మంది వంట కార్మికులను సమీకరించి ఏఐటియుసి నాయకత్వంలో ఉద్యమాలు నిర్వహస్తము అన్నారు,,ఈ సమావేశంలో గున్నాల రాజకుమారి,గుండ్రెడ్డి శ్రీనివాస్,మాలగాని కమల,పౌర రాధ,మాడిశెట్టి భాగ్య,సలువాల స్వరూప, కొత్త కనుకలక్ష్మి, కొత్త పూల,ఆసరి లక్ష్మి,ముత్యం రవీంద్ర,,అకఖం పధ్మ, బండి సరోజన,పోరిక ప్రమీల,భానోత్ బుల్లీ,భానోత్ కమల,సార సుగుణ,పల్లెవేణ మల్లిఖాంభ, తదితరులు పాల్గొన్నారు*

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T131902.044-1.wav?_=4

 

 

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

యూరియా కొరతపై రైతులు బుధవారంరోజున పరకాల పట్టణలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఆందోళనకు దిగారు.యూరియా అందక సాగు సీజన్ మధ్యలో తీవ్రంగా నష్టపోతున్నామంటూ పరకాల హనుమకొండ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.రైతుల ఆందోళన కారణంగా రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలు దాదాపు గంటసేపు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.అనంతరం పరకాల ఎస్ఐ విఠల్ సిబ్బందితో కలిసి నిరసన చేపట్టిన దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అడవిని తలపిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T130918.103.wav?_=5

 

 

అడవిని తలపిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం

◆:- పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారి .

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలంలో ని మాచునూర్ గ్రామంలో గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్మించింది. నేటి ప్రభుత్వం దానిని గాలికి వదిలేసింది. ఎన్నో లక్షలు వేచించి. ప్రజల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి క్రీడల పట్ల ఆసక్తి చూపడానికి, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి మాచునూర్ గ్రామంలో సర్వే నంబర్ 37/ఒక ఎకరం భూమిని కేటాయించింది. అట్టి భూమిలో క్రీడా ప్రాంగణం చుట్టూ కొన్ని మొక్కలు నాటడం జరిగింది. కోకో, వాలీబాల్, కబడ్డీ, శరీర దారుణ్యాన్ని పెంపొందించడానికి ఎక్ససైజ్ చేయడానికి అక్కడ కొన్ని స్తంభాలు నిర్మించడం జరిగింది. క్రీడలకు అనుకూలంగా ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి పట్టించుకోని నాధుడు లేడు. కొన్ని స్తంభాలు విరిగిపోవడం. క్రీడా ప్రాంగణంలో అడవిని తలపించేలాగా ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడం జరిగింది. సంబంధిత అధికారులు పిచ్చి మొక్కలను తొలగించి స్తంభాలకు మరమ్మత్తులు చేయించి, క్రీడలకు అనుకూలంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరమ్మతులకు నోచుకోని…గ్రామీణ బీటీ రోడ్లు..

మరమ్మతులకు నోచుకోని…గ్రామీణ బీటీ రోడ్లు..

గతంలో మారుమూల గ్రామాలకు వేసిన బీటీ రోడ్లు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. పాదైన ఈ రోడ్లకు మరమ్మతులైన చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఆ రోడ్లు ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. అయితే ప్రభుత్వం కొద్ది రోడ్లకు గతంలో నిధులు మంజూరు చేసినా ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రోడ్ల దుస్థితి దారుణంగా ఉన్నది. ఝరాసంగం మండలంలోని ఝరాసంగం నుంచి సిద్ధాపూర్ నరంపల్లి గ్రామాల మీరు గా న్యాబ్ మండలంలోని మిర్నపూర్ గ్రామం వరకు ఉన్న బీటీ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుకు న్నారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై సిమెంట్ పోయి కంకర రోడ్డుగా మారింది. రోడ్డుపై గుంతలు పడడంతో చిన్నపాటి వర్షానికి అవి నిండి ప్రమాద భరితంగా మారుతున్నాయి. ఈ రోడ్డులో పలు ప్రమాదాలు జరిగిన సంఘట నలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఈ రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టడం లేదు. మరోవైపు సిద్దాపూర్ నుంచి దుర్మాపూర్ వైపు ఉన్న బీటీ రోడ్డుపై గుంతలు పడడంతో ప్రమాదంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్రా లకు చెందిన భక్తులు నిత్యం ఈ రోడ్డు కుండానే ఝరాసంగంలోని కేతకి సంగ మేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిపోతుం టారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు కూడా ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. అయినా మర మ్మతులు చేపట్ట కోవడం పట్ల ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు.

 

 

 

 

బర్దీపూర్ నుండి చిలే పల్లి, చిలేపల్లి తండా వైపు ఉన్న బీటీ రోడ్డు దారుణంగా తయారైంది.ఝరాసంగం నుండి బొపాన్ పల్లి,జీర్లపల్లి మీదుగా ముని పల్లి మండలంలోని పెద్ద చెల్మెడ గ్రామం వైపు ఉన్న బీటీ రోడ్డు కూడా గుంతలు పడి గుం తలమయంగా మారింది. బొపాన్ పల్లి నుండి ప్యాలవరం, దేవరంపల్లి వైపుగల బీటి రోడ్డు కూడా ధ్వంసమైంది. ఝరాసంగం నుండి మేదపల్లి, ఈదులపల్లి మీదుగా కోహీర్ మండ లంలోని దిగ్వాల్ వైపు గల బీటీ రోడ్డు అడుగ డుగున గుంతలు పడి ప్రమాదంగా నూరింది. బిడకన్నె నుంచి రాయిపల్లి మధ్య, జాతీయ రహదారి వరకున్న బీటీపై రోడ్డుపై గుంతలు ” పడడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజ లు ఇక్కట్లు పడుతున్నారు. బిడకన్నె నుంచి ” కుప్పానగర్ గ్రామం వైపు ఉన్న మెటల్ – రోడ్డుపై కంకర తేలి గుంతలు పడ్డాయి. ఇక్క ది వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. కోహీర్ మందలంలోని కవేలి చౌరస్తా నుండి చిలేమామిడి జీర్ణపల్లి, ఏడాకు లపల్లి గ్రామాల వైపు ఉన్న బీటీ రోడ్లు ఛిద్రమై 1 ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతు న్నారు. జాతీయ రహదారి నుంచి ంచి కోహీర్ మండలంలోని దిగ్వాల్,రాజనెల్లి గ్రామాల వైపు ఉన్న బీటీ రోడ్డు ధ్వంసమై అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.ఈ రోడ్డుపై వాహనాల మాట అటు ఉంచితే కనీసం నడిచి వెళ్లాలన్నా అనువుగా లేదనిఇ ఆయా గ్రామా ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాడైన రోడ్లలకు వెంటనే మర మృతుల పనులు చేపట్టాలని జహీరాబాద్ – నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

రోడ్లన్నీ అధ్వానం.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T122803.256-1.wav?_=6

 

రోడ్లన్నీ అధ్వానం……!

పల్లెలకు వెళ్లేదెలా..?, ప్రయాణికుల అవస్థలు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని రహదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: దేశ అభివృద్ధికి పల్లెటూళ్లు పట్టు కొమ్మలాంటివి. కానీ, ఆ పల్లెలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారై, ప్రజలకు నరకయాతన చూపి స్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మీదుగా జహీరాబాద్ నుంచి రాయికోడ్, పట్ పల్లి, రేగోడు, మనూర్, మండలాలకు వెళ్లే రహదారి పై అక్కడక్కడ ప్రమాదకర గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వర్గాకాలం కావడంతో భారీ వర్షాలకు గుంతల్లో నీరు నిండడంతో ప్రమాదాలు జరుగుతు న్నాయి. కోహర్ మండలం దిగ్వాల్ నుంచి ఈదుల పల్లి, మేదపల్లి, మీదుగా ఝరాసంగం వెళ్లే రహదారి ధ్వంసమై రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందిక రంగా మారింది. వాహనదా రుకు వర్గానికి గుంతలు తెలి యకపోవడంతో కింద పడిపోతున్నారు. ఝరాసంగం నుంచి సిద్ధాపూర్, చిలేపల్లి, చిలేపల్లి తండా మీదుగా న్యాల్ కల్ కు వెళ్లే రోడ్డుపై ప్రమాద కర గుంతలు ఏర్పడి వాహనదారులు అవస్థలు పడు తున్నారు. బొజనాయక్ తండా పంచాయతీ పరిధి లోని మూడు తండాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రస వానికి ఉన్న మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఆ ను పత్రికి తరలించడంలో తండా ప్రజలు నానా అవస్థ లకు గురవుతున్నారు. ఝరాసంగం నుంచి బొపన్ పల్లి, బోడగామా, జీర్ణపల్లి, చిలేమామిడి, గ్రామాలల మీదుగా కోహిర్ క్రాస్ రోడ్, మునిపల్లి మండలం పెద్ద చేల్కెడకు వెళ్లే రోడ్డు ధ్వంసం అయింది. ఆయా ముండలాల ప్రజలు ఝరాసంగం మండలానికి తరచుగా రాకపోకలు కొనసాగిస్తుంటారు. మాచునూర్ నుంచి బర్జిపూర్ వెళ్లే మూడు కిలోమీ టర్ల దూరం పొడవునా ప్రమాదకర గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమతులను తక్షణమే చేపట్టాలని ఆయా మండలాలకు చెందిన ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటి ధాత్రి ,

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు నేటి వరకు కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఉపాధి ఉపాధి కూలీలు ఎండను సైతం లెక్కచేయకుండా అర్ధాకలితో పస్తులు ఉంటూ ఉపాధి పనులు చేస్తే ప్రభుత్వం కూలి డబ్బులు మంజూరు చేయకపోవడం సరైంది కాదు అని తెలుపుతున్నాం. సంబంధిత మండల ఈజిఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదని ఆరోపిస్తున్నాం. కూలీలు పస్తులు ఉండి పనులు చేస్తే కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుపుచున్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు రావలసిన కూలీ డబ్బులు మంజూరు చేసే వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T112233.101.wav?_=7

 

ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష???

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లా ఇంచార్జి మంత్రి దళితుడే.. ఆరోగ్య శాఖ మరియు జిల్లా మంత్రి మంత్రిదళితడే, నియోజకవర్గం శాసనసభ్యులు దళితుడే కానీ దళితలంటే ఈ అధికారులకు గిట్టదు..

ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష జిల్లా డీ పీ ఓ, మరియు డివిజనల్ పంచాయతీ అధికారి తీరు ఇలా ఉన్నందున తక్షణమే ఈ అధికారుల పైన చర్యలు తీసుకొనేలా చేయాలనీ జహీరాబాద్ నియోజకవర్గం

 

 

శాసనసభ్యులకు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ చెంద్రశేఖర్ లకు దళిత సంఘాల విజ్ఞప్తి చేస్తున్నవి.నెలరోజులు గడవక ముందే సస్పెండ్ అయినా తుంకుంట పంచాయతీ కార్యదర్శి కి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం ఎస్. సి కార్యదర్శి లు సస్పెండ్ అయి ఆరు నెలలు గడిచిన నేటికీ పోస్టింగ్ లు ఇవ్వకపోవడం పైన దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల పైన వివక్ష చూపడం జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారికి తగదని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నారు. అన్ని డివిజనల్ కార్యాలయాలు నియోజకవర్గం లో ఉన్నపుడు డీ ఎల్ పీ ఓ కు ఎందుకు కార్యాలయం ఉండదని కోరుతున్నారు.బి సి లకు ఒక న్యాయం ఎస్ సి లకు ఒక న్యాయమా అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా డీ పీ ఓ మరియు డీ ఎల్ పీ ఓ తీరు మార్చుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తప్పదని

 

హెచ్చరించారు.ప్పాంపాడ్, రాయికోడ్, ఖర్చల్, ఇందూర్, హస్నాబాద్,ఉల్గేరా, రాయి పల్లి, కుస్ నూర్, రాఘవాపుర్, చాల్కి,డప్పుర్, రత్నపూర్, చిక్కుర్తి, రత్నపూర్, ఉసెల్లి, మొగుడం పల్లి, పార్వతపూర్, దనసిరి, సత్వర్, సరిహద్దు తండాలు, సజ్జపూర్, బిళ్ల్పూర్, గోటిగార్పల్లి, శేఖపూర్, జిర్లపల్లి, ఏడాకులపల్లి, గుంతమర్పల్లి, ఝరాసంగం,కంబాలపల్లి, సిద్ధపూర్, గణేశపూర్ బీదర్ సరిహద్దు గ్రామాలు ఎన్నో తీరుగాల్సిన డీ ఎల్ పీ ఓ కేవలం హైవే పైన ఉన్న గ్రామాలు మాత్రమే తిరుగుతు కార్ ట్యాంక్ ఫుల్, బ్యాగ్ ఫుల్ చేసుకొంటూ కార్యదర్శి ల జెబులు నిల్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. డ్రైవర్ కి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేస్తూ మరి ముఖ్యంగా దళిత కార్యదర్శి లపైన టార్గెట్ చేస్తున్నారనీ అందరు కార్యదర్శి లు ఆందోళన చెండుతున్నారు. ఇలాంటి అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి దళిత సంఘాలు కోరుతున్నాయి. నియోజకవర్గం శాసనసభ్యులు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి డాక్టర్ చెంద్రశేఖర్ చోరువ తీసుకొని ఆ అధికారి తీరు మారేటట్టు చూడాలని దళిత సంఘాలు కోరుకొంటున్నారు.

కోనాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ధర్నా…

కోనాపూర్‌లో యూరియా లభ్యం లేక రైతుల రోడ్డుపై ధర్నా..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం నుండి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో యూరియా లభ్యం కాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని వందలాది మంది రైతులు కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, రెండు చక్రాల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆకస్మికంగా ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Farmers Protest Over Urea Shortage in Konapur

రైతులు మాట్లాడుతూ—వర్షాకాలంలో పంటల సాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పంటలపై పెట్టిన ఖర్చు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సహకార సంఘం, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా అందలేదని, ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు మాట్లాడుతూ, “ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. రైతులకు ఎరువులు అందించడం లో విఫలమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలన్నీ నాశనం అవుతాయి. మా జీవితాలు ప్రమాదంలో పడతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులు త్వరలోనే యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే హామీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
స్థానికులు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ—గ్రామంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం డిమాండ్….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-93-1.wav?_=8

నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వం

.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి….

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్

యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా మలహలరావు మండలం లోని కొయ్యూరు గ్రామంలోని ఆదివాసి గిరిజన కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది 60 కుటుంబాలు ఉన్న నిరుపేద ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నాం నిరుపేదలైన ఆదివాసులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వాయిస్తున్నారని బడుగు బలహీన వర్గాలు అయినటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్హులైన నిరుపేదలకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఆ కాలనీవాసులను మందలించగా మాకు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం మూలంగానే ఈ కాలనీ వెనుకబడిపోతుందని తక్షణమే సర్వే నిర్వహించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా చర్యలుచేపట్టాలని ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తక్షణమే స్పందించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా అధికారులకు ఆదేశించాలని లేనియెడల నిరుపేదలను సమీకరించి ఆందోళనలో పోరాటాలకు సిద్ధం చేస్తామని అన్నారు ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఎస్సీ ఎస్టీ దళితులకు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి కూడా ఇల్లు అచ్చిన దాకాలు కానరావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమారస్వామి ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లన్న సేద మల్లేష్ గొట్టం సమ్మక్క అరవండి లక్ష్మి సమ్మయ్య నాయక్ పాల్గొన్నారు

సామాజిక న్యాయానికి మండల్ కమిషన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-1.wav?_=9

మండల్ కమిషన్ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం

*నేటి ధాత్రి.

కేయూ క్యాంపస్*
మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్…

వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

 

 

డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.

 సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జర్వంతో చనిపోయిన మహేష్ (35), శ్రవణ్ కుమార్ (15) అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిమ్మాపూర్ గ్రామంలో 40 నుండి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక.. గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని.. తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు.

గొల్ల కురుమలను అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు…

గొల్ల కురుమలను అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో
గొల్ల కురుమలు అందరు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గొల్ల కాపరులను పట్టింపు చేయకుండా ప్రభుత్వ వైఖరిని కండిస్తూ భూపాలపల్లి జిల్లా జేడీ కార్యాలయ ముట్టడికి భయలుదెరగ ముందస్తు గా తెల్ల వారు జామున అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది,ఈ సంధర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె అనిల్ యాదవ్ మాట్లాడుతూ గొర్లు మేకలకు నట్టల మందులు పంపిణీ చేయాలి గొర్ల మేకల మేత కోసం559_1016 జీవోల ప్రకారం ప్రభుత్వ భూములు సొసైటీలకు ఇవ్వాలి ఆలాగే వివిధ ప్రమాదాలో చనిపోతున్న గొర్ల కాపరులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియో మరియు గొర్లు మేకలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వం రెండో విడుత గొర్లు లేదా నగదు బదలీ ఇవ్వాలని లేదంటే గొల్ల కురుమలును అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల సంఘం మండల అధ్యక్షులు మర్రి నరేష్ యాదవ్ సంఘం అద్యక్షులు కోడారి రవి యూత్ అద్యక్షులు వేముల హరీష్ యాదవ్ సంఘం జిల్లా నాయకులు కట్టే కొల్ల రాజు కోశాధికారి యదండ్ల మహేష్ యాదవ్ పాల్గొన్నారు.

కె ఎం సి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి

కె ఎం సి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి

రేపటి నుండి సమ్మెను మరింత ఉధృతం చేస్తాం.

యాద నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

కాశిబుగ్గ నేటి ధాత్రి.

 

వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మెన్స్ & ఉమెన్స్ హాస్టల్ నందు పనిచేస్తున్న 86 మంది వర్కర్స్ కు 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న “నిరవధిక సమ్మె”ఈ రోజుకు 10వ రోజుకు చేరుకుంది.సమ్మెలో భాగంగా ఈరోజు కాకతీయ వైద్య కళాశాల ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాద నాయక్ మాట్లాడుతూ హాస్టల్ వర్కర్స్ కు చెల్లించాల్సిన 8 నెలల వేతనాలు పెండింగ్ లో ఉండటం వలన కుటుంబాలు గడవక,అప్పులు పుట్టక,స్థానిక అధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందనీ అన్నారు. వేతనాలు చెల్లించనందునే గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని,ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వం,అధికారులు వహించవలసి వస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్ వేతనాలు చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని అన్నారు.లేనియెడల వీరి సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరి మద్దతును కూడగట్టి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జే సుధాకర్,అల్లం రమేష్,రాణి, రాజకుమారి,ఎండి అతిక్ హనుమకొండ రవి,బాబు,మంద కవిత తదితరులు పాల్గొన్నారు.

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-50-4.wav?_=10

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

* రైతుల గొస పంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో గురువారం రోజున ఆర్ అండ్ బీ అతిథి గృహం ముందు రైతులు ధర్నా నిర్వహించారు,మరిపెడ మండల నికి 45 నుండి 50 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా షాపుల ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. పైమందులు తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తామని షాపు యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు,గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు
* ఒక రైతుకు రెండు బస్తాలేనా…!

మహాదేవపూర్ ఆగస్టు 19 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి మహాదేవపూర్ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో మంగళవారం రోజున పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు బారు తీరారు. ఉమ్మడి మండలమైన మహాదేవపూర్ కి 27 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version