ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు..

ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు..

తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్ 13:

 

నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారుఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా,10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారితమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. లక్ష్మీపురం కూడలి పనులు,పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్.కె.బాబు ఫోన్ ద్వారా కోరారు. యాదవ వీధిలో త్రాగునీటిలో మురుగు నీరు కలుస్తున్నాయి పరిష్కరించాలని,పింఛన్ ఇప్పించాలని, కోర్లగుంట రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, యాదవ వీధిలో రోడ్డు నిర్మించాలని, కూరపాటి లే అవుట్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోర్లగుంట మారుతీ నగర్ లో వర్షపు నీరు నిలిచి పోతున్నది పరిష్కరించాలని,ఏ ఆర్ హాస్పిటల్ రోడ్డులో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, కుక్కల సమస్య పరిష్కరించాలని,ఎల. ఎస్. నగర్ నందు కాలువలు మరమ్మత్తు చేయాలని, నగరంలోని ఓపెన్ డ్రైన్స్ లో చెత్త వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి,ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

*సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*’సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*కమిషనర్ ఎన్. మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి)అక్టోబర్
09:

 

సదరం ధ్రువ పత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య వైద్యులకు సూచించారు. వికలత్వం యొక్క శాతాన్ని నిర్దారిస్తూ రుయాసుపత్రి లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను గురువారం ఉదయం కమిషనర్ తనిఖీ చేశారు. ఏ విధంగా పరీక్షలు చేస్తారు, రోజూ ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయాలను రుయా వైద్యులు కమీషనరకు వివరించారు. చెవి, ముక్కు, ఎముకలు, మానసిక రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్యులు అందించే సదరం ధ్రువ పత్రాల మేరకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పరీక్షలు చేయాలాని వైద్యులకు సూచించారు. పరీక్షల కొరకు వచ్ఛే వారికి తాగునీరు, నీడ తదితర మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. రోజుకి వందమందికి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పలువురు వైద్యులు ఉన్నారు

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య.

*పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి నేటి ధాత్రి

 

నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం ఉదయం కమిషనర్ ఎన్.మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని నిమ్మకాయల వీధి,మిట్ట వీధి, రాములవారి గుడి వీధి, కాళికమ్మ గుడి తగితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు కుడితి సుబ్రమణ్యం, శైలజ, అధికారులతో కలసి పరిశీలించారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండడం తో నీరు అక్కడే ఆగి పోయి అపరిశుభ్రత అవుతోందని అన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని కాలువలు శుభ్రం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా తొలగించాలని అన్నారు. ప్రజలు కూడా తమనవంతు సహకారం అందిస్తే నగరం సుబ్రంగా ఉంటుందని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,ఏసిపి మధు,డి.ఈ లు రాజు, శిల్ప,సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version