చే గువేరా ఆశయాలను కొనసాగించాలి.

చే గువేరా ఆశయాలను కొనసాగించాలి

భూపాలపల్లి నేటిధాత్రి:

జిల్లా కేంద్రంలో చేగువేరా జయంతి వేడుకలను కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చే గువేరా జయంతిని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ఈ రోజున అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత గెరిల్లా నాయకుడైన ఎర్నెస్టో “చే” గువేరా జ్ఞాపకార్థం గుర్తు చేసుకుంటారు. ఆయన 1928 జూన్ 14న జన్మించారు.
చే గువేరా 33 ఏళ్ల వయస్సులో క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత విప్లవాన్ని విస్తరించేందుకు ఆయన ఆ పదవిని వదులుకున్నారు.
అర్జెంటీనా రాజధాని బ్యూనెస్ అయిరెస్ కళాశాలలో డాక్టర్ చదువు పూర్తి చేసిన చే గువేరా సుఖంగా జీవితం గడపాలని అనుకున్నారు.
కానీ, తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, జరుగుతున్న దోపిడీలను చూసి చలించిపోయి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో పెరుగుతున్న సమస్యలకు సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి ఉద్యమాలు నడిపించారు.
1955లో ఆయన తన 27 ఏళ్ల వయసులో క్యూబా విప్లవ నాయకుడైన ఫిడెల్ కాస్ట్రోతో కలిశారు. ఆ తర్వాతి క్రమంలో పలు ఉద్యమాలలో పాల్గొన్న ఫలితంగా యువ విప్లవకారుడిగా ఆయన పేరు నలు దిశలా మార్మోగింది. ఆయన అన్నారు

ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి.

మహానీయుల ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

దేశ వ్యాప్తంగా దళితులపై మహిళలపై జరుగుతున్న సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలువిఫలమైనాయని వాటిని ఎదుర్కోవడానికి మరియు*అంబేద్కర్ పాటు మహానీయుల ఆశయాలను భావజాలాన్ని* ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ యువజన సంఘాలను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళ పెళ్లి శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడారు .భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజల చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని తనం ను ఎదుర్కోని పట్టుదలతో భవిష్యత్తు తరాల ప్రజల కోసం సమాన హక్కులను కల్పిస్తూ అందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం రిజర్వేషన్లు ఓటు హక్కును కల్పించారన్నారు. పల్లెల్లో ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను ఆలోచనలు ప్రజలకు తెలియ పరువాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31 వరకు గ్రామ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల కోశాధికారి కనకం తిరుపతి జిల్లా నాయకులు బండార్ రాజు, దొమ్మటి ఓదెలు, బొచ్చు నరసయ్య, సంపత్, సదానందం, భూమి రెడ్డి, సుమంత్, తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

చిట్యాల,నేటిధాత్రి

 

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని బిజెపి చిట్యాల మండలాధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇప్పుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నదంటే అదికేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందనిఅన్నారూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారత దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది అంటే ఆ మహనీయుని కారణంగ భారత రాజ్యాంగంవ్యవహరిస్తున్నదని కుల మత విభేదం లేకుండా ఓటు అనే ఆయుధం ద్వారా బానిస సంకెళ్లను తొలగించడంజరిగిందని*
భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గ కాశయాలను కొనసాగిచలనిఅన్నారు,
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ సదానందం శ్రీహరి గుర్రపు రవీందర్ మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలి.

అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలి

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, ఏప్రిల్ – 14(నేటి ధాత్రి):

 

మహానీయులను స్మరిస్తూ మాతృదేశానికి సేవ చేయడమే వారికి మనం ఇచ్చే ఘాన నివాళి అని, అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
సామాజిక వివక్షను జయించి,అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతిగా,అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం కల్పిస్తూ భారత దేశ అభివృద్ధికి , అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు.
అంబేద్కర్ జీవితం,బోధనల నుండి ప్రేరణ పొంది,ఆయన ఆశయల దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి కళావతమ్మ.

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి కళావతమ్మ
వనపర్తి నేటిదాత్రి:
సంఘసంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి పట్టణం లో శ్వేతా నగర్ లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. సంఘసంస్కర్త అయిన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యనభ్యసించి దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేశారన్నారు. మహిళలు, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించి చదువు చెప్పారన్నారు. సావిత్రిబాయి పూలే ఆమె అడుగు జాడలలో అందరం నడవాలన్నారు. సంఘసంస్కర్తలు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే, సిద్ధాంతాన్ని భారత దేశంలో అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు.ఈకార్యక్రమంలో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ పట్టణ కోకన్వీనర్ శిరీష, శ్రీదేవి, జ్యోతి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్, సిపిఐ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version