మంథని నియోజక వర్గ దళితులను దగా చేస్తున్న..

మంథని నియోజక వర్గ దళితులను దగా చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతి పెద్ది కిషన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T135658.497.wav?_=1

ముత్తారం :- నేటి ధాత్రి
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో దళిత బంధు ఇస్తుంటే మంథని నియోజక వర్గంలో ఎందుకు అమలు చేయడం లేదని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతి పెద్ది కిషన్ రెడ్డి అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన నియోజక వర్గంలో దళిత బంధు యూనిట్లను విడుదల చేస్తుంటే మంథని నియోజక వర్గంలో
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకు దళిత బంధు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.మంథని నియోజక వర్గంలో దళితులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంథని నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ప్రాంత దళితులందరికీ అంబేద్కర్ అభయాహస్తం ఇయ్యాలని కోరారు.

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షుడు సన్మానం..

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షుడు సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T135154.882.wav?_=2

మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల సుభాష్ గౌడ్ జగిత్యాల జిల్లా ఐ జే యు 143 ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డబ్బా గ్రామంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, కాంగ్రెస్ యువ నాయకులు దేశెట్టి జీవన్, డబ్బా విడిసి చైర్మన్ జాన శంకర్, నేరెళ్ల సత్యం గౌడ్, గుండు రమేష్, గోపి రాజేందర్,ఇబ్రహీంపట్నం ఆర్ఎంపి మరియు పి.ఎం.పి సెక్రటరీ డాక్టర్ శ్రీధర్, కోటి అరుణ్, పాల్గొన్నారు

తొలకరి పలకరింపులతో మొదలైన సాగుబడి.

*తొలకరి పలకరింపులతో మొదలైన సాగుబడి.

వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య*
ఏరువాకకు సిద్ధం అంటున్న రైతులు- రైతన్నలకు బాసటగా నిలుస్తున్న ప్రజాప్రభుత్వం*

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T133619.125.wav?_=3

వర్దన్నపేట( నేటిధాత్రి ):
వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి గ్రామంలో వర్ధన్నపేట మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువాక-సాగుబడి కార్యక్రమానికి వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య & కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో తొలకరి పలకరింపులతో సాగుబడి మొదలవుతుంది అందుకు రైతన్నలు భూములు సిద్ధం చేసుకుని రోహిణి కార్తిలో విత్తనాలు నాటడం మొదలవుతూ రైతన్నలు ఏరువాకకు సిద్ధమవుతారు అని అన్నారు.అదేవిధంగా మృగశిర కార్తిలో వ్యవసాయ సాగుబడి ఊపందుకోవడం ఆనాతిగా వస్తున్న సాంప్రదాయం అని అన్నారు.
గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతన్నలకు వ్యవసాయం ఒక గుదిబండగా మారిందని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వ్యవసాయం దండుగ కాదు ఒక పండుగ అని నిరూపిస్తుందని అన్నారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ వరి వేసుకుంటే ఉరే అని వ్యవసాయాన్ని హెద్దెవా చేశారు. కానీ నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరి వేసుకొని సన్నాలు పండిస్తే మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలుకు 500/- బోనస్ ఇస్తూ రైతన్నలను ఆదుకుంటుంది మన ప్రజాప్రభుత్వం అని అన్నారు.
తెలంగాణ రైతన్నలకు ప్రజాప్రభుత్వం నాణ్యమైన ఎరువులు విత్తనాలు సబ్సిడీపై అందిస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మి అటువంటి వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు ఎవరు అధైర్య పడకూడదు ఏరువాక మొదలై సాగుబడి ప్రారంభమవుతున్న ఈ తరుణంలో రైతులు వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసుకోవాలని హితవు పలికారు.
ఈ ఖరీఫ్ మొదలు ప్రారంభంలోనే రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని ఒకే రోజులో 70 లక్షల మంది రైతులకు 9900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు.
యూరియా కొరత లేదు యూరియా మోతాదు మించకుండా వాడుకోవాలి నికర లాభాలు పొందాలి రైతుల సిఫారసు చేయబడ్డ మోతాదులో మాత్రమే యూరియా వాడాలి సాగు ఖర్చులు తగ్గించుకోవాలి .అధిక యూరియా వాడడం వల్ల పంటలలో చీడ పీడలు మరియు వాతావరణ నీటి కాల్షియం మరియు భూసార తగ్గుదల జరుగుతుంది.నాన్ యూరియా స్ప్రే చేసుకొవాలి , గుళికల యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ఎస్‌ఎస్‌ఎంబీ29.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..

సూపర్‌స్టార్‌ మహేశ్‌ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి కాంబోతో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చారు.సూపర్‌స్టార్‌ మహేశ్‌ (Mahesh BabU) దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) కాంబోతో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (SSMB 29) వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. ప్రస్తుతం మహేశ్‌ టూర్‌లో ఉన్నారు. కానీ వెనక జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి ఫామ్‌హౌస్‌లో రికార్డింగ్‌ మొదలుపెట్టారు కీరవాణి. మరోవైపు అల్యూమినియం ఫ్యాక్టరీలో నెలకొల్పిన సెట్‌లో వందమందికిపైగా ఫైటర్స్‌ ఓ భారీ ఫైట్‌కు సంబంధించిన రిహార్సెల్‌ జరుగుతున్నాయని చిత్ర వర్గాల నుంచి సమాచారం అందింది. త్వరలో ప్రారంభం కాబోయే షెడ్యూల్‌లో సినిమాకు కీలక పొరాట ఘట్టాలను తెరకెక్కించనున్నారట. దానికి సంబంధించే ఇప్పుడు రిహార్సెల్స్‌ జరుగుతున్నాయట. ఇక మహేశ్‌ శ్రీలంక టూర్‌ పూర్తి చేసుకుని రాగానే తాజా షెడ్యూల్‌ మొదలు పెడతారని తెలిసింది. 

ఇటీవల ఈ చిత్రం గురించి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘రాజమౌళి చిత్రాలు భారీగా ఉంటాయి. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా అలాగే ఉంటుంది. ఇదొక అద్భుత దృశ్య కావ్యం. ప్రతిఒక్కరినీ అలరించేలా కథను చెప్పడంలో ఆయన ఎక్స్‌పర్ట్‌. ఈ సినిమాను విజువల్‌ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు’ అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చారు. విహారయాత్రలో భాగంగా మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లారు. ఆగస్టులో తిరిగి షూటింగ్‌ ప్రారంభిస్తారని తెలిసింది. మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జులైలో టీమ్‌ అంతా కెన్యాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాలనుకున్నారు. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌, ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో మరికొందరు తారలు పాల్గొనాల్సి ఉంది. పలు కారణాల వల్ల తాజా షెడ్యూల్‌ను నిలిపివేశారు.

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను..

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ముశం రమేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T130848.280.wav?_=4

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో బీడీ అండ్, సిగార్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఇట్టి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమా రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి గార్లు హాజరవుతున్నారు
ఈ మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంగా 4000 పెన్షన్ అమలు చేస్తానని ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోయింది
బీడీ కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్న కంపెనీ యజమానులపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో బీడీ కంపెనీలో బీడీ కంపెనీ యజమాన్యం విపరీతమైన దోపిడీకి పాల్పడతా ఉంది ప్రతి కార్మికుల నుండి కంపెనీ యజమానులు 2000 కూలీని దోచుకుంటున్నారు అనేక రకాల పేర్లతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో బీడీల నుండి ఆదాయం వస్తున్న కూడా బీడీ కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించడం లేదు రాబోయే కాలంలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని కనీస వేతనం 1000 బీడీలకు 600 రూపాయలు చెల్లించాలని ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని 2000 బీడీల కోత విధించకుండా చేయాలని 26 రోజుల పని కల్పించాలని బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాణ్యమైన ఆకు తంబాకు అందించాలని ము శం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర జిందo కమలాకర్, దాసరి రూప, బేజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కోహీర్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన సుభాష్ రావు..

కోహీర్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన సుభాష్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T130329.595.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ పురపాలక సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ఆరోగ్య కారణాలతో సుదీర్ఘ సేవలపై విరమించారు. ఈ నేపథ్యంలో జహీరాబాద్ కమిషనర్ డి. సుబాష్ రావు దేశ్ముఖ్ శనివారం ఉదయం కోహీర్ పురపాలక సంఘం కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T125709.628.wav?_=6

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల్ హద్నూర్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బక్క రెడ్డి పరితపించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ ,మాజి మండల పార్టీ అధ్యక్షులు నరసింహ రెడ్డి ,రాజ్ కుమార్, ప్రవీణ్ ,శ్రీకాంత్ రెడ్డి ,అశోక్ పాటిల్ , మహేష్ తదితరులు ఉన్నారు.

చోరీకి గురైన ద్విచక్ర వాహనం.

చోరీకి గురైన ద్విచక్ర వాహనం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T124710.328.wav?_=7

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే రైతు మెట్టలు కుంట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న తన సొంత పంట పొలం వద్ద తన యొక్క వాహనము టి ఎస్ 15 ఎఫ్ ఎచ్ 8026 నెంబర్ గల వాహనాన్ని పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేశాడని బాధితుడు తెలిపారు.

దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హద్నూర్ ఎస్ ఐ తెలిపారు.

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక.

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక,

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T124034.400.wav?_=8

ఝరాసంగం మండల కమాల్పల్లికి చెందిన బి.నరేశ్ సీయూసెట్-2025లో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. ప్రత్యేక కోచింగ్ లేకుండా కేవలం ఇంటి వద్దనే చదువుకొని ఈ విజయాన్ని సాధించాడు. ప్రాథమిక విద్యను ఝరాసంగం ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ను కొండాపూర్ గురుకులంలో పూర్తి చేశాడు. నరేశ్ను గ్రామస్థులు, ఉపాధ్యా యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి..

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T123430.605.wav?_=9

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం కొండ ముచ్చులు దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, రోగులకు రక్షణ కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.

ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

◆:- ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన వంతెన

◆:- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T122654.349.wav?_=10

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రా ష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన, ప్రభుత్వాలు మా 8న కొన్ని పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి: మండల పరిధిలోని ఝరాసంగం, చిలపల్లి రహదారిపై నూతన వంతెన గత ఎనిమిది ఏళ్ల క్రితం మంజూరు అప్పట్లో ఆ వంతెన పూర్తయితే పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్లపల్లి తాండ, ఎల్గోయి గ్రామాలకు వెళ్లే వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తప్పుతాయని అందరూ భావించారు. కానీ అప్పట్లో వంతెన ని ర్మా ణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రా రంభించి చేతులు దులుపుకొని వెళ్లి పోవడంతో ఆ వంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోయింది.

2017 ఆగస్టు 11న ప్రధానమంత్రి సడక్ యోజన ని ధుల క్రింద సుమారు 55 లక్షలు నిధులతో మంజూరైన ఈవంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోవడంతో ఆ యా గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం బర్దిపూర్,పొట్టిపల్లి చిలపల్లి చిలపల్లి తం డా, ఎల్గోయి గ్రామాల ప్రజలతో పాటు కేతకి సంగమేశ్వ ర స్వామి ఆలయానికి వచ్చే మహారాష్ట్ర, కర్ణాటక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు.ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మా ణానికి అదనపు నిధులను మంజూరు చే యించి అసంపూర్తిగా ఉన్న వంతెనను పూర్తి చేయగలరని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

◆:- వంతెనకు పూర్తి కావాలంటే రూ.70 లక్షల

◆:- నిధులు కావాలి…. (పిఆర్ఎ శశిధర్ రెడ్డి)

అసంపూర్తిగా ఉన్న వంతెన కు పూర్తి చేయాలంటే రూ. 70 లక్షల నిధులు అవసర మవుతాయని వాటిని మం జూరు నిమి త్తం ప్రతిపాద నలు తయారు చేసి పంపిం చడం జరిగింది.

◆:- ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం…. (ఎండి.ఆరిఫ్, చిలపల్లి గ్రామస్థుడు)

రహదారిపై వంతెనలేకపో వడంతో వర్షాకాలంలో తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని అకస్మాత్తుగా గ్రామంలో ఎవరికై నా అనారోగ్యం పాలైతే ఆసు పత్రికి వెళ్లాలంటే కష్టంగా మారిందని త్వరలో వం తెన పూర్తి చేసి ఇబ్బందులు దూరం చేయాలి.

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన…

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన పైడిగుమ్మల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T121657.839.wav?_=11

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల్ కు నూతనంగా ఎస్ ఐ గ బాధ్యతలు తీసుకున్న నరేష్ కు పైడిగుమ్మల్ యువ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు కోహీర్ మండల్ లోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్, మాజీ ఎంపీటీసీ జ్ఞనారత్నం నాయకులు దావీదు యేసయ్య రామయ్య లక్ష్మయ్య బాలయ్య నర్సిములు ఆనందం కాంగ్రెస్ యువ నాయకులు మధు శాంసన్ అశోక్ సంపత్ సుమన్ మహేందర్ ప్రేమ్ యూత్ కాంగ్రెస్ నాయకులు బన్నీ రాకేష్ భాస్కర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కూరగాయల హోల్ సేల్ రిటైల్ మార్ట్ ను ప్రారంభించిన..

నూతన కూరగాయల హోల్ సేల్ రిటైల్ మార్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T120520.991.wav?_=12

జహీరాబాద్ పట్టణం లోని కూరగాయల మార్కెట్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన సంగమేశ్వర కూరగాయల హోల్ సేల్ & రిటైల్ మార్ట్ ను ప్రారంభించి ప్రోప్రెటర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు అశోక్ రెడ్డి గారిని అభినందించి ,శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్. నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్ సహా నేడు వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాము.

భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (2025 జులై 25) ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్‌ బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.1,00,470కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.92,090కు చేరుకుంది. ఇక వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,17,000గా ఉంది. ఇక 10 గ్రాముల ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.38,880కు చేరుకుంది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు

చెన్నై: రూ.1,00,470; రూ.92,090; రూ.75,890

ముంబయి: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

ఢిల్లీ: రూ.1,00,620; రూ.92,240; రూ.75,470

కోల్‌కతా: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

బెంగుళూరు: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

హైదరాబాద్: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

కేరళ: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

పూణె: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

వడోదరా: రూ.1,00,520; రూ.92,140; రూ.75,390

అహ్మదాబాద్: రూ.1,00,520; రూ.92,140; రూ.75,390

వివిధ నగరాల్లో వెండి ధరలు (కిలో)

చెన్నై: రూ.1,27,900

ముంబయి: రూ.1,17,900

ఢిల్లీ: రూ.1,17,900

కోల్‌కతా: రూ.1,17,900

బెంగుళూరు: రూ.1,17,900

హైదరాబాద్: రూ.1,27,900

కేరళ: రూ.1,27,900

పూణె: రూ.1,17,900

వడోదరా: రూ.1,17,900

అహ్మదాబాదు: రూ.1,17,900

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు..

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈస్ట్ జోన్ డీసీపీ,అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమావేశం

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నశాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా యువతలో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిను వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి,డిఇఓ జ్ఞానేశ్వర్,డిడబ్ల్యుఓ రాజమణి, పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హ్యూమన్‌ వర్షిప్‌..బెస్ట్‌ లీడర్‌ షిప్‌!

`సీఎం. రేవంత్‌ పై రాహుల్‌ ప్రశంసలు.

`సంక్షేమ సారథి రేవంత్‌.

`పట్టుదలకు మారు పేరు రేవంత్‌.

`ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ రేవంత్‌ తో రాహుల్‌ ఆలింగనం.

`రేవంత్‌కు అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున అభినందనలు.

`ద బెస్ట్‌ లీడర్‌ రేవంత్‌ అని సోనియా కితాబు.

`రేవంత్‌ పై ప్రియాంక పొగడ్తలు.

`డిల్లీ వర్గాలలో లో రేవంత్‌ పాలనపై సానుకూల చర్చలు.

`తెలంగాణలో సంపూర్ణ, సమగ్ర, అర్థిక, సామాజిక, కుల గనణపై రేవంత్‌ చిత్తశుద్ధిపై మెచ్చుకోలు.

`రేవంత్‌ భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్న ఖర్గే.

`రేవంత్‌ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం ఖుషీ.

`మోడల్‌ ఆఫ్‌ తెలంగాణ ఈస్‌ ద బెస్ట్‌ అని అందరి కితాబు.

`రాష్ట్ర ప్రభుత్వంపై అధిష్టానం పెద్దల నుంచి సానుకూల స్పందన.

`అధిష్టానానికి రేవంత్‌ దూరమనే వార్తలు పటా పంచెలు.

`త్వరలో రేవంత్‌ బిహార్‌ ఎన్నికల ప్రచార బాధ్యతలు.

`రైజింగ్‌ తెలంగాణతో బీహార్‌లో రేవంత్‌ ప్రచారం.

`అధిష్టానంతో ఎలాంటి గ్యాప్‌ లేదు.

`గాసిబ్స్‌ ప్రచారానికి ఇక తావులేదు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 డిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ అధినేతల నుంచి ప్రశంసలందుకున్నారు. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్షనేత, పార్టీ మాజీ అధ్యక్షుడు, అగ్రనేత రాహుల్‌గాందీ నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి అభినందనలు అందుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి చాలా గొప్పగా పాలన సాగిస్తున్నారు. తన అంచనాలకు మించి పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, ప్రబుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమంలో ముందుందని కొనియాడేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాన ప్రభత్వం నిర్వహించిన సమగ్ర సంపూర్ణ ఆర్దిక, సామాజిక, గణనపై పార్టీ అగ్రనేతలకు సిఎం. రేవంత్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇచ్చారు. సిఎం. రేవంత్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌కు ముగ్థులైన పార్టీ అదినేతి సోనియా గాంధీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడంతోపాటు, తొలి అడుగు వేసింది. దేశానికి ఆదర్శవంతమైన పాలనతోపాటు, సామాజిక గనణపూర్తి చేసంది. దాంతో కాంగ్రెస్‌ పెద్దలు సిఎం. రేవంత్‌ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. రేవంత్‌రెడ్డి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. తెలంగాణలో కుల గణనతోపాటు చేపట్టిన అన్ని రకాల అంశాలు సుదీర్ఘం వివరించారు. తెలంగాణలో కుల గణన ఎలా చేపట్టారు. ఎంత మంది ఈ కార్యాక్రమంలో వినియోగించారు. కేవలం 60 రోజుల్లో ఎలా పూర్తి చేశారు. సమగ్ర సమాచారాన్ని ఎలా సేకరించారు. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు వస్తే, మరో 15 రోజుల గడువుతో పూర్తి స్ధాయి సామాజిక గణన ఎలా పూర్తి చేశారన్న విషయాలను సిఎం. రేవంత్‌ రెడ్డి అదిష్టానానికి చక్కగా వివరించారు. దాంతో రాహుల్‌ గాంధీ మెచ్చుకొని రేవంత్‌ రెడ్డిని లయన్‌ ఆఫ్‌ ది తెలంగాణ అని కీర్తించారు. రేవంత్‌ రెడ్డి పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలనుద్దేశించ రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ రేవంత్‌ను సంక్షేమ సారధిగా అభివర్ణించారు. పట్టుదలకు రేవంత్‌ రెడ్డి మారు పేరంటూ కీర్తించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్‌ రెడ్డిన శ్రమను రాహుల్‌ కొనియాడారు. పార్టీని అదికారంలోకి తేవడంతోపాటు, ఆదర్శవంతమైన పాలన రేవంత్‌ సాగిస్తున్న తీరును అభినందించారు. దేశమంతా తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్న బిసి గణనను చేపట్టేందుకు ముందుకు రాలేదు. కాని కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విధానంపై దేశమంతా ఆసక్తికనబర్చింది. దాంతో ప్రజల నుంచి కూడా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడిరది. బిజేపి పాలిత రాష్ట్రాలే కాకుండా ఎన్డీయే పక్ష రాష్ట్రాలు కూడా బిసి గణనపై మొగ్గు చూపాయి. దాంతో కేంద్రం దిగి రాక తప్పలేదు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ ఘనతే అన్నారు. అయితే అందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాహుల్‌ గాందీ పేర్కొన్నారు. ఎంతో పట్టుదలతో కుల గణన చేపట్టిన సిఎం. రేవంత్‌ను పట్టుదలకు మారు పేరుగా రాహుల్‌ అభివర్ణించారు. కాంగ్రెస్‌ ఫార్టీ ధ్యేయాం ఒక అడుగు ముందుకు పడేలా చేసిన రేవంత్‌ రెడ్డిని ఆలింగనం చేసుకొని అభినందించారు. సిఎం. రేవంత్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ నచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. సిఎం. రేవంత్‌ చొరవ వల్లనే ఇదిసాధ్యమైందన్నారు. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు సామాజిక సృహ కల్గి వుంటే బిసిలకు భవిష్యత్తులో పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. బిజేపి ప్రభుత్వాలు కాంగ్రెస్‌ డిమాండ్‌కు తలొగ్గేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కారణమని, బెస్ట్‌ లీడర్‌ అని రేవంత్‌ రెడ్డిని కొనియాడారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ అగ్ర నాయకురాలు, వాయినాడ్‌ ఎంపి. ప్రియాంకా గాంధీ కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. రేవంత్‌ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్చే రేవంత్‌ రెడ్డి భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్నారు. ఈ సమయంలో పార్టీ పెద్దలను ప్రశంసలు అందుకున్నతీరును గుర్తు చేస్తూ సోనియా గాందీ మాటలే తనకు నోబెల్‌, ఆస్కార్‌ అవార్డులనుకుంటానన్నారు. ఏద ఏమైనా తెలంగాణలో 42శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేసి, రిజర్వేషన్లపై వున్న గీత చెరిపేస్తామన్నారు. బిసి రిజర్వేషన్లకు అడ్డుగావున్న 50శాతం సీజింగ్‌ను బద్దలు కొడతామన్నారు. అయితే కొంత కాలం పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గర కాలేనంత దూరం ఏర్పడిరదంటూ పెద్దఎత్తున ప్రచారం జరగుతూ వచ్చింది. సిఎం.రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు డిల్లీకి వెళ్లినా రాహుల్‌ గాంధీ అప్పాయింట్‌ మెంటు ఇవ్వడం లేదని పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చేవి. ప్రతిపక్షాలు సోషల్‌ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు సాగించింది. రేవంత్‌రెడ్డిని కలవడానికి రాహుల్‌ ఇష్టపడడం లేదని ప్రచారం సాగించారు. రేవంత్‌రెడ్డి రోజుల తరబడి పడిగాపులు కాసినా కనీసం ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదంటూ వార్తలు రాశారు. రేవంత్‌ రెడ్డిమీద అదిష్టానం ఎంతో కోపంగా వుందంటూ కూడా పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ రెండు సంవత్సరాలలో కొన్ని సందర్భాలలో రాహుల్‌ గాందీ ఎదురైనా సిఎం.రేవంత్‌రెడ్డితో కనీసం పలకరించలేదంటూ కూడా వార్తలురాశారు. డిల్లీలో మొదట్లో కలిసిన ఫోటోలు తప్ప, ఇప్పటి వరకు కొత్త ఫోటోలు విడుదల చేయలేదని రకరకాల వార్తలు రాశారు. బిఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌ రెడ్డి మీద నిత్యం అబాండాలు వేస్తున్నారు. వాటన్నింటికీ ఈ ఒక్క సందర్భం అనుమానాలన్నీ పటాంపంచెలు చేసినట్లైంది. రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇస్తున్న సమయంలో రాహుల్‌ గాందీతోపాటు, పార్టీ పెద్దలందరూ ఎంతో ఆసక్తితో గమనించారు. ఆ సమయంలో రేవంత్‌ సర్కారు సాధించిన విజయాన్ని చూస్తూ ఆనందంగా పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ తిలకించారు. కొన్ని సందర్బాలలో రాహుల్‌ గాందీ ఎంతో ఆసక్తితో ఆ ప్రెసెంటేషన్‌ విన్నారు. ఆ సమయంలో రాహుల్‌ గాందీ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. తర్వాత రేవంత్‌ రెడ్డిని పొగడ్తలతో రాహుల్‌ గాందీ ముంచెత్తారు. అయితే రాహుల్‌ గాందీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల ఆరోపణలన్నీ పటాపంచెలైపోయినట్లే అంటున్నారు. ఇక సిఎం. రేవంత్‌ రెడ్డి మీద మాట్లాడేందుకు బిఆర్‌ఎస్‌కు ఎలాంటి అవకాశం లేకుండాపోయింది. ఓ వైపు సిఎం. రేవంత్‌రెడ్డి పనితీరును ప్రశంసిస్తూనే హ్యూమన్‌ వర్షిప్‌ రాహుల్‌ కొనియాడారు. అంటే పేదల ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప నాయకుడు అన్నారు. ప్రజలను ఆరాదించే పార్టీ కేవలం కాంగ్రెస్‌ పార్టీయే అని రాహుల్‌ అన్నారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం, దేశ ప్రగతి కోసం, రేపటి తరం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని రాహుల్‌ పేర్కొన్నారు. అలా కాంగ్రెస్‌ భావాలను, ఆచరణలోకి తీసుకెళ్తున్నా రేవంత్‌ రెడ్డిని రాహుల్‌ అభినందించారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా ప్రచారం జరగాలని రాహుల్‌ కోరుకున్నారు. తెలంగాణ రైజింగ్‌ దేశమంతా చూస్తుందన్నారు. జిడీపి గ్రోత్‌లో దేశమంతా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని, అందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వస్తేనే సాద్యమౌతాయని అన్నారు. వచ్చే బీహార్‌ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డికి ప్రచార బాధ్యతలు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించనున్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై రేవంత్‌రెడ్డి చేత పెద్దఎత్తున ప్రచారం సాగించాలని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటోంది. తెలంగాణలో సక్సెస్‌ పుల్‌గా అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ ఫార్టీ తరుపున విసృతంగా ప్రచారం చేయడానికి రేవంత్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు పధకం వల్ల మహిళలకు ఎంత మేలు జరుగుతుందో బిహార్‌ ఎన్నికల్లో చెప్పనున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రవాణా ఎలా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందో రేవంత్‌ వివరించనున్నారు. ఈ పద్దెనమిది నెలల్లో రెండు వందల కోట్ల ప్రయాణాలను మహిళలు సాగించారు. అంతే కాకుండా ఆర్టీసీ లాబాల పట్టింది. ఉచిత బస్సు పధకం విజయవంతం కావడంతో బిఆర్‌ఎస్‌కు పాలు పోవడం లేదు. ఆర్టీసి మరింత బలోపేతమౌతుంటే బిఆర్‌ఎస్‌ ఆశ్చర్యపోతోంది. తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పధకం గురించి రేవంత్‌ రెడ్డి బిహార్‌లో విసృతంగా ప్రచారం సాగించనున్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్న తీరు, విధానం గురించి బీహార్‌ ప్రజలకు వివరించనున్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లపై కూడా రేవంత్‌ రెడ్డి ప్రచారం సాగిస్తారు. తెలంగాణ రైజింగ్‌పై ప్రచారం సాగించనున్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల..

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సంకల్ప్ ల్యాబ్ ను ప్రారంభించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
విద్యార్థులు వారి విద్య విధానాలను అలవర్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
శుక్రవారం మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో పీఎం శ్రీ నిధి ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి ( సంకల్ప్) ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు.

Collector Dr. Satya Sarada

విద్యాలయానికి ముఖ్య అతిథిగా చేరుకున్న కలెక్టర్ డాక్టర్ సత్య శారదను ప్రిన్సిపల్ పూర్ణిమ,ఎన్సిసి స్కౌట్ గైడ్ విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలను పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబ్ లో విద్యార్థులు రోబోటిక్స్ ఐ ఓ టి, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని అన్నారు.కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా సంభాషించి ఇష్టపూర్వకంగా చదివి భావిభారత పౌరులు కావాలని కోరారు.విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ భయాన్ని సంకోచతత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ లో భాగంగా విద్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు సురేష్ రామలింగయ్య ఉపాధ్యాయులు,విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు అనుమతి రద్దుచేయాలి..

*కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు అనుమతి రద్దుచేయాలి..

*గిరిజనులను హేళనగా మాట్లాడిన హీరోను అడ్డుకుంటాం..

*నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్..

తిరుపతి(నేటి ధాత్రి(;జూలై 25:

విజయదేవర కొండ నటించిన కింగ్డమ్ చిత్రం ట్రైలర్ ఈవెంట్ కు తిరుపతిలో అనుమతి రద్దు చేయాలని నిఘా నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ నగర పాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన హిరో సూర్య రెట్రో చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు హీరో విజయదేవకొండ హాజరయ్యారని, ఈవెంట్ కార్యక్రమంలో అభిమానుల తోపులాటను గుర్తించిన విజయదేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యానించారని విమర్శించారు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకుంటున్నట్లు అభిమానులు కొట్టుకుంటున్నారని హేళన చేసి మాట్లాడడం దారుణమన్నారు. వివక్షత లేని సమాజం సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన హీరో ఒక జాతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఇటీవల ఫల్మాం సంఘటనలో దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మురళీ నాయక్ మా జాతి బిడ్డ అని గర్వంగా చెప్పారు. అలాంటి గిరిజన జాతిని హేళనగా మాట్లాడిన దేవరకొండ సినిమా కింగ్డమ్ చిత్రం ఈవెంట్ను తిరుపతిలో అడ్డుకుంటామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో నేతలు రవీంద్రనాయక్, శివశంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం..

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం

రెవెన్యూ డివిజన్ ప్రజల చిరకాల ఆకాంక్ష

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం జేఏసీ నిర్వహించిన బంద్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలిసి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం జేఏసీ తలపెట్టిన బంద్ తో పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి.చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి, ధూల్మీట్ట మండల మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలు సైతం ఉదయం నుండే జేఏసీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో 18 నెలల కాలంలో వారి హామీని నెరవేర్చకపోవడం ఈప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలే నాయకులై స్వచ్ఛందంగా బందు చేశారని, ఇందుకు నిదర్శనమే రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష ప్రజల్లో ఎంత ప్రభలంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఒక భౌతిక అంశం మాత్రమే కాకుండా ఈప్రాంత ప్రజల ఆకాంక్ష అస్తిత్వం, ఉనికి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నదని ఈ బందు ద్వారా ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇదే స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామన్నారు. త్వరలో విద్యాసంస్థల బంద్, రహదారి దిగ్బంధం, చలో కలెక్టరేట్, వంటావార్పు తదితర అంశాలపై తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు , అందె బీరయ్య, అందే అశోక్ .బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, ఎక్కలదేవి సుధాకర్, ఈరి భూమయ్య, సుతారి రమేష్, కత్తుల భాస్కర్ రెడ్డి,పొన్నబోయిన మమత,సనవాల ప్రసాద్, పోషబోయిన పరమశేఖర్, భూమిగారి మధూకర్, పుల్ల ఆంజనేయులు, నంగి కనకయ్య, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, అరుట్ల లింగం, కడుదూరి పుల్లారెడ్డి, పొన్నబోయిన శ్రీనివాస్, కర్రె నర్సిరెడ్డి, భూర సీతారాముల, పుల్ల కుమార్, ముద్దల్ల యాదయ్య, కత్తుల లక్ష్మరెడ్డి, బింగి పోశయ్య, మురళి, మహేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.

టీబీజీకేఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

టీబీజీకేఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

*కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్
జెట్టి శంకర్రావు*

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

గత కొంతకాలం నుండి టీబీజీకేఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణలను మానుకోవాలని ఐఎన్టియుసి కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు.సింగరేణిలో టీబీజీకేఎస్ ఇంచార్జ్,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించడమే తప్ప వాస్తవం కాదని తెలిపారు.మితి మీరిన రాజకీయ జోక్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం బాండ్ల రూపంలో ఉన్న సింగరేణి మిగులు బడ్జెట్‌ను కొల్లగొట్టి సంస్థకు రూ.29 వేల కోట్లపైగా ప్రభుత్వ బకాయిలు ఇవ్వకుండా అజమాయిష్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.మీ పరిపాలనలో ఒక్క కొత్త గనిని కూడా తెరవలేని దుస్థితికి సింగరేణిని తీసుకొచ్చారని,సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసింది కూడామీ ప్రభుత్వమేనని విమర్శించారు.
మీ టీబీజీకేఎస్ నాయకులను, సంస్థ పాలనా పరంగా చేసిన బదిలీలను రాజకీయ జోక్యంగా చిత్రీకరించడం అసత్యప్రచారం తప్ప మరేమీ కాదన్నారు.అప్పటి గుర్తింపు సంఘం,అధికారంలో మీ పార్టీ ఉండగా జరిగిన ఈ చర్యలు ఇప్పుడు మితిమీరిన జోక్యమని మాట్లాడడం విడ్డురమన్నారు.
2022 లో యాజమాన్యం సంస్థ పాలన పరంగా, సింగరేణి వ్యాప్తంగా 20 మంది యూనియన్ నాయకులను, శ్రీరాంపూర్‌లో ఐదుగురు టీబీజీకేస్ నేతలను బదిలీ చేసింది.అప్పుడు గుర్తింపు సంఘంగా టీబీజీకేస్, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటాన్ని మరిచి,ఇప్పుడు రాజకీయ జోక్యం గురించి మాట్లాడడం నైతిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.మీ రాజకీయ హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వంపై నీతిమాలిన ఆరోపణలు చేయడం తగదని హితువు పలికారు.నిజం తెలుసుకున్న కార్మికులు తప్పకుండా మీ వాస్తవ రూపాన్ని గ్రహిస్తారని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version