ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T181749.145.wav?_=1

 

ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకం

నేటిధాత్రి చర్ల

 

గుంటూరుకు చెందిన నల్లూరి ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకమని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు ఉదయలక్ష్మి భర్త నల్లూరి సుబ్బారావు వర్దంతి సందర్భంగా వారి కుమారులు బాబ్జి నాగార్జున లు వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం విద్యార్దులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆశాలత మాట్లాడారు ఉదయలక్ష్మి కుటుంబం మొదటి నుండి సేవాభావం కలిగి ఉండటం హర్షనీయమని పేర్కొన్నారు 1977 లో దివిసీమ ఉప్పెన సందర్భంగా ప్రాణ ఆస్దినష్టం సంభవించి సర్వం కోల్పోయిన బాదిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్ ఎస్ ఎస్ ద్వారా చర్లలో నల్లూరి సుబ్బారావు ఉదయలక్ష్మి దంపతులు నిది సేకరించారని వెల్లడించారు ఆ నిది సేకరణలో వచ్చిన నగదుతో దివిసీమలోని దీనదయాలపురం గ్రామంలో ఒక ఇంటిని నిర్మించారని తెలిపారు ఆ ఇంటిపై చర్ల స్వయం సేవకుల సహకారంతో నిర్మాణం చేపట్టినట్లు పేరు రాసి ఉందని వెల్లడించారు నాటి విదేశాంగ శాఖ మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నిర్మాణం ప్రారంబోత్సం చేసారన్నారు ఉదయలక్ష్మి ఇదే స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అబినందనీయమని అన్నారు ప్రతి ఏటా కొమరం భీం విద్యార్ది నిలయంకు వితరణ అందిస్తూ మానవత్వం చాటుకుంటుంన్నారని అన్నారు ‌నిలయ కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి తమ పిన్ని ఉదయలక్ష్మి ద్వారా వితరణలను అందించడం అబినందనీయని ప్రశంసించారు విద్యార్దులు ఇటువంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి విద్యార్ది క్రమశిక్షణతో మెలగి తమనుతాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడటం ద్వారా తల్లిదండ్రులతో పాటు గురువుల కలలను సాకారం చేయాలని హితవుపలికారు ఈ కార్యక్రమంలో వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ కొమరం భీం నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు మహిళా ప్రముఖ్ బందా స్వరూప రాణి కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి లవన్ కుమార్ రెడ్డి నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ..

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

ఈరోజు మందమర్రి సింగరేణి ఉన్నత పాఠశాల మనోవికాస పిల్లలకు

బెల్లంపల్లి నివాసి గుండేటి అంబదాస్ లత గార్ల కుమారుడు శివరాంప్రసాద్ ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా
మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క వైష్ణవి మేనమామ మేనత్త ఆడేపు అశోక్ కుమార్ సరోజన సహకరించిన స్కూల్ టీచర్ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

కోట గుళ్ళు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ…

కోట గుళ్ళు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన సూర్యదేవర స్రవంతి, కార్తీక్ దంపతుల కుమారుడు ఆరవ్ సాయి జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. జన్మదిన సందర్భంగా వారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన కార్తీక్ స్రవంతి దంపతులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆరవ్ సాయి కి కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

వసతి గృహం విద్యార్థులకు ట్యూబ్ లైట్స్ అందజేత…

వసతి గృహం విద్యార్థులకు ట్యూబ్ లైట్స్ అందజేత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బెల్లంపల్లి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకస్మికంగా పర్యటించగా అక్కడ ఉన్న వసతి గృహంలో సరైన వెలుతురు లేక చీకటి అలుముకున్న దృశ్యాలను చూసి వారు చలించి పోయారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలసి వసతి గృహంలో సరైన వెలుతురు,కాంతి ఎందుకు లేవని అడిగారు.దానికి ప్రధాన ఉపాధ్యాయులు గతంలో ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు అవి పూర్తిగా చెడిపోయాయి అని అన్నారు.ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు అందకపోవడంతో అభివృద్ధిలో లోటు ఏర్పడిందని తెలిపారు.7వ తరగతి చదువుతున్న బి.అశ్విత్ తండ్రి మల్లేష్ మంచి మనసుతో వెంటనే స్పందించి పాఠశాల విద్యార్థుల అభివృద్ధికై తమ వంతు సహాయముగా 30 ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ కొనుగోలు చేసి పాఠశాలకు అందజేశారు.పేరెంట్స్ కమిటీ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ సాగర్,పేరెంట్స్,విద్య కమిటీ చైర్మన్ రాజేశ్వర్,ఉపాధ్యాయులు కొండలరావు,గోపి పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం….

ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం

మత సామరస్యానికి ప్రతీకగా పెనుగొండ ఆటో యూనియన్ – సమ్మయ్య గౌడ్

దేవాలయం చుట్టూ స్టీల్ ఫెన్సింగ్ కు 20వేల రూపాయలు అందించిన సమ్మిగౌడ్

మైసమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఒక్కరూ క్షేమం: ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం గ్రామం పెనుగొండ ఆటో యూనియన్ మత సామరస్యానికి ప్రతీకగా, ఆటో డ్రైవర్లకు, ప్రయాణీకులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీవిస్తూ మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ గ్రామంలో ఆటో కేంద్రం వద్ద ఉన్న మైసమ్మ తల్లిని చెట్టు కింద కొలిచేవారమని, అనంతరం ఆటో డ్రైవర్ల సహకారంతో రేకుల షెడ్డుతో నీడను ఏర్పాటు చేసినప్పటికీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మైసమ్మ తల్లికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, మండలం లోని ప్రజా ప్రతినిధుల సహకారాన్ని కోరామని తెలిపారు. అడగగానే స్పందించి ఆలయం చుట్టూ ఏర్పాటు చేసే స్టీల్ ఫెన్సింగ్ కు మండల కాంగ్రెస్ నాయకు సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.మామూలుగా ఆలయాలను హిందువులు మాత్రమే నిర్మిస్తారని కానీ అందుకు భిన్నంగా హిందు, ముస్లీం తేడాలు లేవని దేవుడు ఎవరికైనా ఒక్కరేనని విశ్వాసం వ్యక్తం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందించదగ్గ విషయమని, అలాంటి వారితో నేను సైతం ఉండాలని, మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించిన పెనుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్, ఇతర సభ్యులకు సమ్మయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు షేక్ ఇమామ్ పాషా, తాటి వీరన్న,నాంచారి శ్రీను,ఈసాల లక్ష్మయ్య, కొండ బత్తుల నరేష్, దేవరపు వెంకన్న,తాటి ఉపేందర్,ముత్యం వెంకన్న బొమ్మర మల్లయ్య,షేక్ మదార్, తాటి కుమారస్వామి, షేక్ ఇమ్రాన్,షేక్ అమీర్, చిన్నబోయిన వీరన్న, పూణెం సంతోష్,కల్తీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం…

దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో వచ్చేనెల నవంబర్ తేదీలో 13 14 15 16 జరగనున్న ప్రతిష్టాపన మహోత్సవం ప్రఖ్యాతిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాబోయే కార్తీక మాసంలో జరగనున్న గణపతి శివలింగ నవగ్రహ అష్ట బలిపీఠ ప్రతిష్టాపన కొరకు తమ వంతుగా గణపురం మండల కేంద్రానికి చెందిన మాదాసు సురేష్ దంపతులు 5000 రూ ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి రూ నగదుగా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ భటిక స్వామి బూర రాజగోపాల్ గౌడ్ మాదాసు మొగిలి గౌడ్ మాదాసు అర్జున గౌడు ఉయ్యాల బిక్షపతి గౌడ్ దయ్యాలభద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ గోరంటల రాజన్న గుప్త పాల్గొన్నారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పంచ లోహ వాహనాలు అందజేత

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T122402.592.wav?_=2

 

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పంచ లోహ వాహనాలు అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలోని వర్ష కొండలో దసరా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన మంగిలిపెల్లి మహిపాల్ ఎన్నారై స్వామివారికి ఐదు పంచలోహ వాహనాలు కోసం హంస వాహనము, హనుమాన్ వాహనము, సింహ వాహనము, గోమాత వాహనము, గజవాహనము, వాహనాల కోసం సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ గల స్వామివారి వాహనాల తయారు కి విరాళంగా ఇచ్చాడు మరియు గతంలో మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఆట వస్తువులు మరియు పాఠశాలకు రంగులు మరియు దేశ భక్తుల చిత్ర పటాలువేయించారు సుమారుగా మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశాడ మరియు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో విద్యార్థిని విద్యార్థుల కోసం క్రీడ ప్రాంగణం ఏర్పాటు చేయాలని పది లక్షల రూపాయలు ఇస్తా అని మాట ఇచ్చారు మహిపాల్ మాట్లాడుతూ ఉన్న ఊరికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అతను మాట్లాడారు అనంతరం ఇంతటి గొప్ప మహాదాతకు గ్రామం తరపున గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు మధుర అన్వేష్చార్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T124645.920-1.wav?_=3

 

మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళం

◆:- మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళాలు ఇస్తున్న మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతీ మాజీ ఎంపిటిసిలు శివానంద శ్రీపతి జగన్నాథ్ మహాత్మా బోమగొండేశ్వర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బండప్ప సభ్యులు మారుతీ మానిక్ మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు శ్రీకాంత్ మహేష్ పవన్ నగేష్ సునీల్ సాయి తదితరులు పాల్గొన్నారు,

రెడ్డి గుడి దేవాలయంలో పూజలు…

రెడ్డి గుడి దేవాలయంలో పూజలు

చంద్రగ్రహణం తర్వాత ప్రారంభమైన పూజలు

దూలం కుమార్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో పురాతన దేవాలయంలో శ్రీ నాగ లింగేశ్వర స్వామి రెడ్డి గుడి దేవాలయం వద్ద నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసి వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు తెరిచి ఆలయ అర్చకులు భద్రమయ్య సంప్రోక్షణ పూజ జరిపించి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి దాత దూలం కుమార్ గౌడ్ శ్రీదేవి దంపతులు స్వామివారికి నిత్య దీపారాధన చేసే దీపాంతలను 2500 ఆలయ అర్చకునికి అందించడం జరిగింది ఆ దంపతులకు స్వామివారి కృప క్రెటాక్షణ ఉండాలని ఆశిస్తూ ఆలయ కమిటీ

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-67.wav?_=4

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విశ్రాంతి ఉపాధ్యాయుడు నాగులపల్లి యాదగిరి రూ 46,116 విరాళాన్ని శనివారం దేవాలయం నిర్వాహలకు అందజేశారు. ఈ విరాళంతో దేవాలయం గోపురం పైన ఉన్న కలశం చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి దాతలు విరాళాలు అందజేయాలని నిర్వాహకులు కోరారు.

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

– సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను అందజేసిన మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

 

 

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామంలో ని ఎల్లమ్మ గడ్డ కాలనీ వాసులు అడగగానే వెంటనే మాట ఇచ్చిన ప్రకారం మారుతి అసోసియేషన్ చందాయిపేట గారికి గణపతి ఉత్సవాలకు గ్రామప్రజల ఆశీర్వాదంతో ని సుమారు 9500 రూపాయలు సెట్ హాంప్లివేర్ పుంగి సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను బహుకరణ సభ్యులకు తలారి రమేష్, జింక స్వామి కి అందజేయడం చేయడం జరిగింది.

తుల్జాభవాని దేవాలయ అభివృద్ధికి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T130231.684-1.wav?_=5

 

తుల్జాభవాని దేవాలయ అభివృద్ధికి
రూ.2,00,000 విరాళం.

ఆమనగల్/ నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గంలోని
ఆమనగల్ మండలం రాంనుంతల గ్రామ పంచాయతీ,చిన్న తండాలో పర్యటించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిర్మాణంలో ఉన్న తుల్జాభవానీ మాత దేవాలయాన్ని సందర్శించిన అనంతరం…గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ అభివృద్ది తన వంతు సహకారంలో బాగంగా
రూ.2,00,000/- (రెండు లక్షలు)ల విరాళం గా ప్రకటించి, మొదటగా రూ,60,000/-(అరవై వేలు) చెక్ ను గ్రామస్తుల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది..ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేవాలయాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని,దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని,వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. గ్రామస్తులు,ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..తమ దేవాలయానికి చెప్పిన హామీకంటే కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నందుకు,ధన్యవాదాలు తెలుపుతూ,వారు అమ్మవారి ఆశీస్సులతో గొప్ప శిఖరాలను చేరుకోవాలని కోరుతూ,ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు..ఈకార్యక్రమంలో…
మాజీ ఎంపీటీసీ సరిత పంతు నాయక్,మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు,జింత నాయక్, పీక్ల నాయక్, పరమేష్,బన్సిలాల్,శాంతి లాల్,నర్రా యాదయ్య, భాస్కర్ లతో తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి అన్నదాన

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి అన్నదాన సత్రానికి వస్తువుల విరాళం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీకేతకీ సంగమేశ్వరస్వామి అన్నదాన సత్రానికి వస్తువుల విరాళం గ్యాస్ పొయ్యి, స్టీల్ గిన్నెలు, 50 కేజీ అన్నం వండే పాత్రనలను మారుతి ఎన్ కోరే బీదర్ వాస్తవ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీమండల సర్పంచుల పోరం అధ్యక్షులు రుద్రప్ప పాటిల్,మల్లయ్య స్వామి, తదితరులు పాల్గొని శాలువాతో వారికి సన్మానించి ప్రసాదం అందజేశారు.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీరదానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు.కొన్ని మత ఆచారాలు అవయవ దానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం కాదన్నా అపోహ ఉందని, కానీ మనిషి ప్రాణం నిలబడితే ఆ దైవం కూడా అనుగ్రహిస్తాడని తెలిపారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.మనిషి చనిపోతే ఇక తిరిగి రారు,ఇక లేరు అనుకుంటారని,కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు.వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అయితే దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం కలెక్టర్ చేయాలని కోరారు.
దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులకు అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వక్తలు మాట్లాడుతూ
అవయవ దానం యొక్క
ప్రాముఖ్యతను వివరించారు
చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు మట్టిలో పాతడం ద్వారా మట్టి పాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు
కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి,డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు, తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ

పరకాల నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా పరకాల శాఖ గ్రంథాలయానికి ఉపాధ్యాయులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి సుమారు 5000 రూపాయాల విలువ అయిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథ పాలకులు డి.రాజేంద్ర ప్రసాద్ కి అంద చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యావేత్త ఎస్ వి విద్యా సంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాస చారి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని స్వాతంత్రోధ్యమం లో గ్రంథాలయాల పాత్ర ఎనలేనిదన్నారు.ఉపాధ్యాయులు కవి కామిడి సతీష్ రెడ్డి పరకాల గ్రంథాలయం కి స్వంతముగ పుస్తకాలు కొనుగోలు చేసి అందించడం అభినందనీయమన్నారు.ప్రతీ ఒక్కరు గ్రంథాలయం కి వచ్చి పుస్తకాలు చదివి ఉత్తమ పాఠకులుగా ఎదగాలని అన్నారు.పుస్తక ప్రియులు సతీష్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకుని పరకాల గ్రంథాలయానికి తమ వంతుగా పుస్తకాలు బహుకరన చేయాలని గ్రంథాలయాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అభివృద్ధి కమిటీ ముఖ్య సలహా దారులు యడ్ల సుధాకర్,జర్నలిస్ట్ రేపాల నర్సింహ రాములు,రంగ స్థల కళాకారులు ఏర్కొండ రామ దాసు,బి.ఎం.ఎస్ సీనియర్ నాయకులు ఆడగాని జనార్దన్ రావు,గ్రంథాలయ సిబ్బంది అరుణ,పాఠకులు నూతన్, యాట రాజేందర్,రవి,సురేష్, నవీన్,శ్రీనివాస్,అజయ్, సుమలత,మేఘన,శ్రీకాంత్ పాల్గొన్నారు.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ
వనపర్తి నెటిదాత్రి :
మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలలను బ్రతికించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
గురువారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా ప్రదర్శిస్తున్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర జీవ సమాధి ఘట్టంచివరి రోజు నాటక ప్రదర్శనకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల నాటక ప్రదర్శనను చూసి సంతోషం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమే అని అన్నారు సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు,టీవీలు,సెల్ ఫోన్లు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొంది ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం యొక్క గొప్పదనం దానిదేనని వివరించారు.గ్రామాలలో నాటక కళ ఆదరింపబడుతూ ఉందంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీపై ఉందని ఆయన సూచించారు. చిన్ననాడు తాను చూసిన నాటకాలను ఎస్పీ గుర్తు చేసుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్ గారు నాటకంలో పాల్గొన్న పాత్రధారుల అభినయాన్ని ప్రశంసిస్తూ శాలువా పూలమాలలతో సన్మానించారు అంతేగాక నాటక సమాజం వారికి విరాళాన్ని అందజేశారు అనంతరం గ్రామస్తులు కళాబృందం వారు ఎస్పీ ని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎక్సైజ్ సీఐ,వెంకట్ రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, కళాకారులు,ఇతర గ్రామాల నుండి వచ్చిన కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత.

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత

గణపురం నేటి ధాత్రి:

shine junior college

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ నిర్వహించారు గణపురం మండల కేంద్రంలోని సోమేశ్వర మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు పబ్బ. వర్షిని. రాకేష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజ అనంతరం రాకేష్.వర్షిని దంపతులు 3.000 రూపాయలతో నిత్య ధూప దీప సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బాటిక స్వామి మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

చిట్యాల, నేటి ధాత్రి

 

 

Shine Junior Colleges

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామం లో నిర్మాణంలో వున్న శివ పంచాయతన ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీ&శ్రీమతి పాశికంటి రాజేందర్ వనమాల దంపతులు రూ.200116 అక్షరాల రెండు లక్షలు విరాళం గా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో గుడి చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం,చెక్క నర్సయ్య, మందల రాఘవరెడ్డి మరియు గ్రామ ప్రజలు అమరేందర్ రెడ్డి,ఓదెలు, కత్తెరసాల రాజయ్య,సాంబయ్య,అనగాని రాజయ్య పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు టి యు డబ్ల్యు జె ఐ జె యు, ఐటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలన్న పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్ని దానాల కన్నరక్త దానం గొప్పదనం గొప్పదని అన్నారు, ఈ రక్తదాన శిబిరంలో జర్నలిస్టులందరూ పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్, శామంతుల శ్యామ్ ఐజేయు జిల్లా జిల్లా నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు పుల్ల రవితేజ, వెల్దండ సత్యనారాయణ, శృంగారపు రంగాచారి, బోల రాజేందర్, బుర్ర రమేష్, గుర్రం రాజమౌళి, కటుకూరి శ్రీనివాస్, సరి గొమ్ముల రాజేందర్, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version