శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పంచ లోహ వాహనాలు అందజేత

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T122402.592.wav?_=1

 

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పంచ లోహ వాహనాలు అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలోని వర్ష కొండలో దసరా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన మంగిలిపెల్లి మహిపాల్ ఎన్నారై స్వామివారికి ఐదు పంచలోహ వాహనాలు కోసం హంస వాహనము, హనుమాన్ వాహనము, సింహ వాహనము, గోమాత వాహనము, గజవాహనము, వాహనాల కోసం సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ గల స్వామివారి వాహనాల తయారు కి విరాళంగా ఇచ్చాడు మరియు గతంలో మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఆట వస్తువులు మరియు పాఠశాలకు రంగులు మరియు దేశ భక్తుల చిత్ర పటాలువేయించారు సుమారుగా మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశాడ మరియు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో విద్యార్థిని విద్యార్థుల కోసం క్రీడ ప్రాంగణం ఏర్పాటు చేయాలని పది లక్షల రూపాయలు ఇస్తా అని మాట ఇచ్చారు మహిపాల్ మాట్లాడుతూ ఉన్న ఊరికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అతను మాట్లాడారు అనంతరం ఇంతటి గొప్ప మహాదాతకు గ్రామం తరపున గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు మధుర అన్వేష్చార్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T124645.920-1.wav?_=2

 

మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళం

◆:- మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు మహాత్మా బోమగొండేశ్వర్ మినీ ఫంక్షన్ హాల్ కు లక్ష రూపాయలు విరాళాలు ఇస్తున్న మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతీ మాజీ ఎంపిటిసిలు శివానంద శ్రీపతి జగన్నాథ్ మహాత్మా బోమగొండేశ్వర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బండప్ప సభ్యులు మారుతీ మానిక్ మహాత్మా బోమగొండేశ్వర్ గణేష్ యూత్ సభ్యులు శ్రీకాంత్ మహేష్ పవన్ నగేష్ సునీల్ సాయి తదితరులు పాల్గొన్నారు,

రెడ్డి గుడి దేవాలయంలో పూజలు…

రెడ్డి గుడి దేవాలయంలో పూజలు

చంద్రగ్రహణం తర్వాత ప్రారంభమైన పూజలు

దూలం కుమార్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో పురాతన దేవాలయంలో శ్రీ నాగ లింగేశ్వర స్వామి రెడ్డి గుడి దేవాలయం వద్ద నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసి వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు తెరిచి ఆలయ అర్చకులు భద్రమయ్య సంప్రోక్షణ పూజ జరిపించి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి దాత దూలం కుమార్ గౌడ్ శ్రీదేవి దంపతులు స్వామివారికి నిత్య దీపారాధన చేసే దీపాంతలను 2500 ఆలయ అర్చకునికి అందించడం జరిగింది ఆ దంపతులకు స్వామివారి కృప క్రెటాక్షణ ఉండాలని ఆశిస్తూ ఆలయ కమిటీ

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-67.wav?_=3

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విశ్రాంతి ఉపాధ్యాయుడు నాగులపల్లి యాదగిరి రూ 46,116 విరాళాన్ని శనివారం దేవాలయం నిర్వాహలకు అందజేశారు. ఈ విరాళంతో దేవాలయం గోపురం పైన ఉన్న కలశం చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి దాతలు విరాళాలు అందజేయాలని నిర్వాహకులు కోరారు.

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

– సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను అందజేసిన మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

 

 

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామంలో ని ఎల్లమ్మ గడ్డ కాలనీ వాసులు అడగగానే వెంటనే మాట ఇచ్చిన ప్రకారం మారుతి అసోసియేషన్ చందాయిపేట గారికి గణపతి ఉత్సవాలకు గ్రామప్రజల ఆశీర్వాదంతో ని సుమారు 9500 రూపాయలు సెట్ హాంప్లివేర్ పుంగి సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను బహుకరణ సభ్యులకు తలారి రమేష్, జింక స్వామి కి అందజేయడం చేయడం జరిగింది.

తుల్జాభవాని దేవాలయ అభివృద్ధికి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T130231.684-1.wav?_=4

 

తుల్జాభవాని దేవాలయ అభివృద్ధికి
రూ.2,00,000 విరాళం.

ఆమనగల్/ నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గంలోని
ఆమనగల్ మండలం రాంనుంతల గ్రామ పంచాయతీ,చిన్న తండాలో పర్యటించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నిర్మాణంలో ఉన్న తుల్జాభవానీ మాత దేవాలయాన్ని సందర్శించిన అనంతరం…గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ అభివృద్ది తన వంతు సహకారంలో బాగంగా
రూ.2,00,000/- (రెండు లక్షలు)ల విరాళం గా ప్రకటించి, మొదటగా రూ,60,000/-(అరవై వేలు) చెక్ ను గ్రామస్తుల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది..ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేవాలయాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని,దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని,వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. గ్రామస్తులు,ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..తమ దేవాలయానికి చెప్పిన హామీకంటే కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నందుకు,ధన్యవాదాలు తెలుపుతూ,వారు అమ్మవారి ఆశీస్సులతో గొప్ప శిఖరాలను చేరుకోవాలని కోరుతూ,ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు..ఈకార్యక్రమంలో…
మాజీ ఎంపీటీసీ సరిత పంతు నాయక్,మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు,జింత నాయక్, పీక్ల నాయక్, పరమేష్,బన్సిలాల్,శాంతి లాల్,నర్రా యాదయ్య, భాస్కర్ లతో తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి అన్నదాన

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి అన్నదాన సత్రానికి వస్తువుల విరాళం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీకేతకీ సంగమేశ్వరస్వామి అన్నదాన సత్రానికి వస్తువుల విరాళం గ్యాస్ పొయ్యి, స్టీల్ గిన్నెలు, 50 కేజీ అన్నం వండే పాత్రనలను మారుతి ఎన్ కోరే బీదర్ వాస్తవ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీమండల సర్పంచుల పోరం అధ్యక్షులు రుద్రప్ప పాటిల్,మల్లయ్య స్వామి, తదితరులు పాల్గొని శాలువాతో వారికి సన్మానించి ప్రసాదం అందజేశారు.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీరదానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు.కొన్ని మత ఆచారాలు అవయవ దానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం కాదన్నా అపోహ ఉందని, కానీ మనిషి ప్రాణం నిలబడితే ఆ దైవం కూడా అనుగ్రహిస్తాడని తెలిపారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.మనిషి చనిపోతే ఇక తిరిగి రారు,ఇక లేరు అనుకుంటారని,కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు.వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అయితే దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం కలెక్టర్ చేయాలని కోరారు.
దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులకు అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వక్తలు మాట్లాడుతూ
అవయవ దానం యొక్క
ప్రాముఖ్యతను వివరించారు
చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు మట్టిలో పాతడం ద్వారా మట్టి పాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు
కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి,డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు, తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ.

పరకాల గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ

పరకాల నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా పరకాల శాఖ గ్రంథాలయానికి ఉపాధ్యాయులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి సుమారు 5000 రూపాయాల విలువ అయిన వివిధ రకాల పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథ పాలకులు డి.రాజేంద్ర ప్రసాద్ కి అంద చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యావేత్త ఎస్ వి విద్యా సంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాస చారి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని స్వాతంత్రోధ్యమం లో గ్రంథాలయాల పాత్ర ఎనలేనిదన్నారు.ఉపాధ్యాయులు కవి కామిడి సతీష్ రెడ్డి పరకాల గ్రంథాలయం కి స్వంతముగ పుస్తకాలు కొనుగోలు చేసి అందించడం అభినందనీయమన్నారు.ప్రతీ ఒక్కరు గ్రంథాలయం కి వచ్చి పుస్తకాలు చదివి ఉత్తమ పాఠకులుగా ఎదగాలని అన్నారు.పుస్తక ప్రియులు సతీష్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకుని పరకాల గ్రంథాలయానికి తమ వంతుగా పుస్తకాలు బహుకరన చేయాలని గ్రంథాలయాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అభివృద్ధి కమిటీ ముఖ్య సలహా దారులు యడ్ల సుధాకర్,జర్నలిస్ట్ రేపాల నర్సింహ రాములు,రంగ స్థల కళాకారులు ఏర్కొండ రామ దాసు,బి.ఎం.ఎస్ సీనియర్ నాయకులు ఆడగాని జనార్దన్ రావు,గ్రంథాలయ సిబ్బంది అరుణ,పాఠకులు నూతన్, యాట రాజేందర్,రవి,సురేష్, నవీన్,శ్రీనివాస్,అజయ్, సుమలత,మేఘన,శ్రీకాంత్ పాల్గొన్నారు.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ
వనపర్తి నెటిదాత్రి :
మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలలను బ్రతికించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
గురువారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా ప్రదర్శిస్తున్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర జీవ సమాధి ఘట్టంచివరి రోజు నాటక ప్రదర్శనకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల నాటక ప్రదర్శనను చూసి సంతోషం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమే అని అన్నారు సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు,టీవీలు,సెల్ ఫోన్లు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొంది ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం యొక్క గొప్పదనం దానిదేనని వివరించారు.గ్రామాలలో నాటక కళ ఆదరింపబడుతూ ఉందంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీపై ఉందని ఆయన సూచించారు. చిన్ననాడు తాను చూసిన నాటకాలను ఎస్పీ గుర్తు చేసుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్ గారు నాటకంలో పాల్గొన్న పాత్రధారుల అభినయాన్ని ప్రశంసిస్తూ శాలువా పూలమాలలతో సన్మానించారు అంతేగాక నాటక సమాజం వారికి విరాళాన్ని అందజేశారు అనంతరం గ్రామస్తులు కళాబృందం వారు ఎస్పీ ని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎక్సైజ్ సీఐ,వెంకట్ రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, కళాకారులు,ఇతర గ్రామాల నుండి వచ్చిన కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత.

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత

గణపురం నేటి ధాత్రి:

shine junior college

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ నిర్వహించారు గణపురం మండల కేంద్రంలోని సోమేశ్వర మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు పబ్బ. వర్షిని. రాకేష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజ అనంతరం రాకేష్.వర్షిని దంపతులు 3.000 రూపాయలతో నిత్య ధూప దీప సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బాటిక స్వామి మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

శివాలయం నిర్మాణానికి 2లక్షల 16 వేల విరాళం.

చిట్యాల, నేటి ధాత్రి

 

 

Shine Junior Colleges

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామం లో నిర్మాణంలో వున్న శివ పంచాయతన ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీ&శ్రీమతి పాశికంటి రాజేందర్ వనమాల దంపతులు రూ.200116 అక్షరాల రెండు లక్షలు విరాళం గా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో గుడి చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం,చెక్క నర్సయ్య, మందల రాఘవరెడ్డి మరియు గ్రామ ప్రజలు అమరేందర్ రెడ్డి,ఓదెలు, కత్తెరసాల రాజయ్య,సాంబయ్య,అనగాని రాజయ్య పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు టి యు డబ్ల్యు జె ఐ జె యు, ఐటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలన్న పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్ని దానాల కన్నరక్త దానం గొప్పదనం గొప్పదని అన్నారు, ఈ రక్తదాన శిబిరంలో జర్నలిస్టులందరూ పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్, శామంతుల శ్యామ్ ఐజేయు జిల్లా జిల్లా నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు పుల్ల రవితేజ, వెల్దండ సత్యనారాయణ, శృంగారపు రంగాచారి, బోల రాజేందర్, బుర్ర రమేష్, గుర్రం రాజమౌళి, కటుకూరి శ్రీనివాస్, సరి గొమ్ముల రాజేందర్, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల నిర్మాణానికి భారీ విరాళం.

ఆలయాల నిర్మాణానికి భారీ విరాళం

ఆలయాల నిర్మాణానికి తండ్రి జ్ఞాపకార్థకంగా తనయులు భారీ విరాళం అందజేత

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం మున్సిపల్ లోని విలేజ్ కేసముద్రంలో ఇటీవలే విశ్వబ్రాహ్మణ సంఘ వారు శ్రీశ్రీ కాశీ విశ్వేశ్వరాలయం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయము మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల ఆలయాల నిర్మాణానికి భూమి పూజ సిలన్యాస శంకుస్థాపన చేయడం జరిగింది.

అనంతరం ఆలయాల కమిటీ సభ్యులు ఆలయాల నిర్మాణం కొరకు నిధుల సేకరణ చేపట్టడం జరిగింది.

ఈ నిధుల సేకరణలో భాగంగా కేసముద్రం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి కీర్తిశేషులు చిల్లం చర్ల లక్ష్మణరావు ల జ్ఞాపకార్ధకంగా వారి సతీమణి చిల్లం చర్ల ధనమ్మ మరియు కుమారులు చిల్లం చర్ల శ్రీనివాస్, శ్యాంసుందర్, సంతోష్ కుమార్, సతీష్ కుమార్ లు ఆలయ నిర్మాణం కొరకు వారి తండ్రి జ్ఞాపకార్థకంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 ఆలయాల నిర్మాణం కొరకు భారీ విరాళం అందజేయడం జరిగింది.

చిల్లంచర్ల లక్ష్మణరావు కుటుంబం గ్రామంలో ఇప్పటివరకు నిర్మించిన ఆలయాలకు విరాళం దాతలుగా ముందు వరసల ఉండేవారని అనాదిగా

ఈ కుటుంబం భక్తి శ్రద్దలకు నిదర్శనంగా నిలిచారని అలాగే వ్యాపార రంగంలో ఎంతో నిజాయితీగా కొనసాగే వారిని అందరిని తన మంచితనంతో ఆకట్టుకునే వారిని ఇలాంటి వారు సమాజానికి ఎంతో అవసరమని వారి జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

వీరి తనయులు కూడా తండ్రి బాటలో నడుస్తున్నందుకు వారి ఆశయాలను నిలబెట్టుకుంటూ తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నారని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు గ్రామం ప్రజలు వీరి దాతృత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉల్లి రాజేశ్వరరావు, చిట్టోజు రమణాచారి, ఆరెందుల కుమారస్వామి, కందుకూరి సోమయ చారి, ఉల్లి వెంకటేశ్వర్లు, తుమ్మనపల్లి జితేందర్ రావు, బొల్లోజు శ్రీనివాస్, చిట్టోదు శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ విగ్రహం పునః ప్రతిష్టకు 10,116 రూ, విరాళం.

ఆంజనేయ విగ్రహం పునః ప్రతిష్టకు 10,116 రూ, విరాళం

దేవేందర్ పటేల్, కేటీఆర్ సేన సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండలం లోని అంకుషాపూర్ సోమనపల్లి గ్రామ పురాతనమైన ఎంతో విశిష్టత మహిమ కలిగిన శ్రీ అభయాంజనేయ ఆలయం శిథిల అవస్థలో ఉండడం వలన ఉమ్మడి గ్రామాల ప్రజలు అభివృద్ధి కమిటీ వేసుకొని, ఆ కమిటీ ద్వారా శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగింది, మూడు రోజులు అంగరంగ వైభవంగా మే 31 వ రోజు నాడు గణపతి పూజతో ప్రారంభమై అయి జూన్ 1వ తారీకు నాడు విగ్రహాలను జల నివాసం చేయడం జరిగింది, జూన్ రెండో తారీకు శ్రీ అభి ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభం గణపతి సుబ్రహ్మణ్యస్వామి నవగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది, మూడు రోజులు పాటు సోమనపల్లి అంకుషాపూర్ ఉమ్మడి గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మూడు రోజులు మహా అన్నదానం ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది,
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కి దేవేందర్ పటేల్ కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు భూపాలపల్లి 10,116 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మీసేవ, పోతన వేన ఐలయ్య, అబ్బేంగుల శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, పెద్దోజు భీష్మాచారి మంద రాజయ్య, నందికొండ రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

కల్వకుర్తి  నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి ఆ కుటుంబంలో ఆనందము నింపుతుంది. పరోపకార హృదయంతో మీరు చేసిన ఈ కార్యము ఎందరికో ఆదర్శ ప్రదమైనది. సమాజము పట్ల సేవా భావము కలిగిన మీ మంచి మనసుకు హృదయపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు చేసిన మానవ సేవ మానవళికి ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శివరాం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు యశోద భాయ్, మాజీ కౌన్సిలర్ శానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు రేష్మ, దున్న భాస్కర్, యువ నాయకులు పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం, శివ, ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత.

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీత రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చక సారమ్మ కీర్తిశేషులు జ్ఞాపకార్థం వారి కుమారుడు మచ్చక ముఖేష్ కుమార్ ఆలయ అభివృద్ధి కొరకు 10,000₹ రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బటక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య ఆలయ ప్రాంగణంలో హనుమాన్ మాల ధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత.

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయానికి పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులు ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళంను మంగళవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన సింహద్వారా తలుపులకి అదనంగా అయ్యే మరో లక్ష రూపాయలని కూడా మేమే భరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులను గ్రామస్తులతో పాటు కులసంఘ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, పలువురు గ్రామస్తులు, కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

శివాలయ పునర్నిర్మాణానికి 3లక్షల విరాళం.

శివాలయ పునర్నిర్మాణానికి 3లక్షల విరాళం.

చిట్యాల, నేటిధాత్రి :

 

చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఏలేటి రామయ్య పల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు ఏలేటి రాంరెడ్డి జ్ఞాపకర్థం వారి కుమారులు అయినటువంటి ఏలేటి రాజు – ప్రసన్న, మరియు శ్రీనివాస్ – జమున దంపతులు శివాలయానికి విరాళంగా 300116/- రూపాయలు అక్షరాల (మూడు లక్షల నూట పదహారు రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version