ఘనంగా గణపతి నిమజ్జనం…

ఘనంగా గణపతి నిమజ్జనం

మరిపెడ నేటిధాత్రి

 

 

భక్తులతో నవరాత్రులలో ఘనంగా పూజలందుకున్న గణనాధుడి నిమజ్జనం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం తోపాటు ఊరూరా గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో కోలాహలంగా నిర్వహించారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ ప్లాజా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది.మహిళల కోలాటాలు,డప్పు చప్పుల్లతో భక్తులు బారీగా హాజరై పట్టణ వీధుల్లో ర్యాలీగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఆర్ సత్తి రెడ్డి మాట్లాడుతూ గణపతి నీ భక్తి శ్రద్దలతో పూజించి కోరిన కోర్కెలు తీర్చాలని, అందరూ ఆరోగ్యంగా, సుభిక్షముగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామనన్నరు,మాకుల చెరువు దగ్గర నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు,అంతకుముందు గణేషుడి లడ్డు వేలంపాట నిర్వహించగా 61 వేల రూపాయలకు కరుణాకర్ రెడ్డి ఝాన్సీ దంపతులు,51 వేల రూపాయలకు రావుల సుమంత్ రెడ్డి లావణ్య దంపతులు, దక్కించుకున్నారు. లక్కీ డ్రా ద్వారా గందసిరి సునీత రమేష్ గౌడ్ దంపతులు దక్కించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్లాజ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆర్ సత్తి రెడ్డి, నీరంజన్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి,దోమల సత్య శ్రీనివాస్, ఉడుగుల శ్రీను,కృష్ణ,భద్రీ,సాగర్,కార్తీక్,ఉపేందర్,సురేష్,సోమిరెడ్డి, రామ చంద్రయ్య,రేపల యాదయ్య, ఉపేందర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.

గణనాధుని ప్రత్యేక పూజల్లో సమ్మి గౌడ్ చిలువేరు

గణనాధుని ప్రత్యేక పూజల్లో సమ్మి గౌడ్ చిలువేరు

సమ్మి గౌడ్ చేతులమీదుగా లడ్డు లక్కీ డ్రా -విజేతలకు అందజేత

సభ్యులందరికీ సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్ట్ లు అందజేత

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ లో కేసరి మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపానికి యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని గణనాధుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు కాంగ్రెస్ మండల నాయకులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసరి మిత్ర యూత్ సభ్యులు, విలేజ్ కేసముద్రం గ్రామ ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు ఆ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం లడ్డు పాట వేలం వేయగా లడ్డు, కలశం, పంచ కండువాలు చీటీ డ్రా సమ్మి గౌడ్ చేతుల మీదుగా తీసి గణపతి లడ్డు గెలుచుకున్న కొలిపాక గోపి,కలశం గెలుచుకున్న వేల్పుల శ్రీ హర్ష,పంచ,కండువా గెలుచుకున్న నార బోయిన రమేష్ లకు అందజేయడం జరిగింది.అన్నా అంటూ ఆదరిస్తున్న కేసరి యూత్ సభ్యులు అడిగిన వెంటనే స్పందించి వారికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి 45 టీ షర్టులను అందజేశారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ… మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మా అన్న సమన్నకు ఎల్లవేళలా మేము తోడుంటామని, అదేవిధంగా ఆ ఏకదంతుని ఆశీస్సులు సమ్మి గౌడ్ అన్నకు తన ఆశయాలు నెరవేర్చడంలో తోడ్పడాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డొనికల రాజు, కొమ్ము నరేష్,ఎస్కే తాజా,ఎస్ కే యాకూబ్, నాగరాజు,సందీప్, సాయి,దాసరి సందీప్,సిహెచ్ సురేష్, శ్రీనాథ్,ఈశ్వర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

లక్కీ డ్రాలో పది కిలోల గణపతి లడ్డు గెలుచుకున్న ప్రణయ్ కుమార్

లక్కి డ్రాలో పది కిలోల లడ్డు కైవసం చేసుకున్న నల్లగోని ప్రణయ్ కుమార్ గౌడ్..

ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:

 

ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో లక్కీ డ్రా ద్వారా గణపతి లడ్డూను ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు. పోత్కపల్లి శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ కొత్త గుడిసెల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నల్లగోని భవాని-వెంకటేష్ గౌడ్ తన కుమారుడు ప్రణయ్ కుమార్(చిన్నా) పేరుపై రూ.101 రూపాయలకు లక్కీ డ్రా వేశాడు. నవరాత్రులు పూజలు అందుకున్న స్వామివారి పది కిలో ల లడ్డును లక్కి డ్రా లో సొంతం చేసుకున్నాడు.విఘ్నేశ్వర యూత్ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. లడ్డు రావడం పట్ల వెంకటేష్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఎల్లవేళలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version