*నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్…

*నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్
మహదేవపూర్ ఉపాధ్యాయులు

మహాదేవపూర్ నవంబర్ 04నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో
ఛత్తిస్ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో ఈ నెల 5వ తేది నుండి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్ లో మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి. ప్రభాకర్ రెడ్డి, మరియు బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు పాల్గొననున్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 162 మంది సైన్స్ టీచర్స్ ఎంపికయ్యారు. తెలంగాణా నుండి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరు మన మహాదేవపూర్ ఉపాధ్యాయులు ఉండడం గర్వకారణం. ఈ కాన్ఫరెన్స్
నెట్వర్క్ ఆఫ్ ఆర్గనైజషన్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్,ఇస్రో నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ఇండియన్ యంగ్ ఇన్వెంటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ కాన్ఫరెన్స్ గత పద్నాలుగు సంవత్సరాలుగా సైన్స్ అభివృద్ధికి కృషి చేస్తూ, సైన్స్ మరియు మాథ్స్ టీచర్స్ కు వేదికగా టీచర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తోంది. ఈ కాన్ఫరెన్స్ ప్రముఖ శాస్త్రవేత్తలతో సంభాషించడానికి అవకాశం కల్పిస్తూ యువ వర్ధమాన శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుంది.
ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పరిశోధకులు తమ వినూత్న ఆలోచనలను, ప్రాజెక్టులను మరియు పరిశోధన పత్రాలను ప్రదర్శించడానికి ఈ కాన్ఫరెన్స్ చక్కని వేదిక.దీనికి ఎంపికైన ఉపాధ్యాయులను మండల విద్యాధికారి, ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు టి ఎస్ ఘన సన్మానం…

ఉత్తమ ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు టి ఎస్ ఘన సన్మానం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం ను పురస్కరించుకొని కాసిపేట్ మండలం నుండి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు జాడి ప్రవీణ్ ( రాష్ట్ర స్థాయి) టి జి ఎం ఎస్ కాశీపేట్,డి. పుష్పలత జడ్ పి ఎచ్ ఎస్ ముత్యం పల్లి,గంగిపల్లి రాజేశం జడ్.పి.హెచ్.ఎస్. ధర్మారావు పేట్ ను పి.ఆర్ టి.యు. కాశీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో మండల శాఖ అధ్యక్షులు గంప శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎంపిక చేయబడిన ముగ్గురు ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం కృషి చేయడమే కాకుండా, విధార్థులను శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించే విధంగా చేస్తూ ఇన్స్పైర్,సైన్స్ ప్రదర్శన లకు తీసుకువెళ్తూ, పాఠశాల కు విశేషం గా కృషి చేసినవారే కావడం వల్ల మండలం లోని ఉపాధ్యాయులు హార్షం వక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వీరికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమం లో ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఖలీల్,రాష్ట్ర బాధ్యులు నాగ మల్లేష్, మండల శాఖ అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version