నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు వర్తింపు

యాక్సిడెంట్ డెత్ ఎక్స్గ్రేగే షియా రూ.5 లక్షల నుంచి రూ10 లక్షలకు

సహజ మరణానికి రూ 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం

ఐఎన్ టి యు సి శాయం పేట మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్

శాయంపేట నేటిధాత్రి:

 

 

నిర్మాణ రంగ కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంపు వలన రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు ఉపయోగ ఉంటుందని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తెలిపారు.మండల అధ్యక్షుడు మాట్లాడుతూ యాక్సిడెంటల్‌ చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ ఆరు లక్షల నుంచి రూ పది లక్షలకు, సహజ మరణానికి రూ లక్ష ముప్పై వేల నుంచి రూ రెండు లక్షలకు ప్రభుత్వం పెంచింది అన్నారు. దీనివలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణ యించిందని అన్నారు.ఇందు లో భాగంగా యాక్సిడెంటల్‌ డెత్‌ ఎక్స్‌గ్రేషియాను రూ పది లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ రెండు లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ నిర్ణయించిందని అన్నా రు . వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుం బాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించ నుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాల ని గత సర్కార్‌ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మ న్లు, టన్నెల్‌వర్కర్స్‌,బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్‌ వర్కర్లు, రాళ్లు కొట్టేవా ళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్‌ డ్రైనేజీ వర్కర్స్‌, మిక్సర్‌ డ్రైవ ర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్‌ వర్కర్స్ తదితర యాభై నాలు గు రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో అరవై ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగి న వారందరికీ ఈ బీమా వర్తిం చనుంది అన్నారు. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ ముప్పై వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ ముప్పై వేలు, ప్రమాదవశాత్తు గాయ పడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ నాలుగు లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ ఐదు లక్షలు అనగా భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంట ల్‌ డెత్‌, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై కార్మికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌ ఎక్స్‌గ్రేషియా ను పెంచడం ఆనందంగా ఉందన్నారు.రిజిస్ట్రేషన్‌ కు అర్హతలివే తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు కింద సభ్యులుగా పద్దెనిమిది ఏండ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు అన్నారు. వీరు ఏడాదిలో కనీసం తొంబై రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి అన్నారు.రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, వయస్సు నిర్ధారణ కు రుజువుగా స్కూల్‌ సర్టిఫికే ట్‌ లేదా డాక్టర్‌ సర్టిఫికెట్‌ను సమర్పించి మెంబర్‌ షిప్‌
సంబంధిత అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు అందజేసి లేబర్‌ కార్డును పొందొచ్చు అన్నారు . లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యూవల్‌ చేసుకో వాలి అన్నారు. ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచడం పట్ల ఐఎన్ టి యు సి మం డల అధ్యక్షు డు మారపల్లి రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.

బిల్డింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

బిల్డింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి- టేకుమల సమ్మయ్య

కరీంనగర్, నేటిధాత్రి:

జిల్లాలోని బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్యవర్గం తీర్మానం చేయడం జరిగినది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లాకౌన్సిల్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్లో కొమురయ్య అధ్యక్షతన జరిగినది. ఈసమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించేటువంటి పథకాలు పూర్తిగా రోజురోజుకు మారుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం 282 జీవోను తీసుకువచ్చి ఎనిమిది పని దినాలను తగ్గిస్తూ పది గంటల పని విధానాన్ని పెంచడం జరిగినదని ఆరోపించారు. ఈజీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగినది దీనివల్ల పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు పూర్తిగా హరించే విధంగా ఉన్నాయని వీటిని వెంటనే రద్దు చేయాలని విమర్శిస్తూ బిల్డింగ్ కార్మికుల కొరకు శ్రామిక పెరుతో ఇప్పటికే అనేక మైనటువంటి శిక్షణ తరగతులు పెట్టి సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వం ఏఒక్క కార్మికునికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన రానున్న రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించడం జరిగినది. ఈసమావేశంలో భవన నిర్మాణ సంఘం జిల్లాగౌరవ అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, కన్నం సదానందం కార్యదర్శులు కసిబోజుల సంతోష్ చారి, రేగుల కుమార్, కోశాధికారి గోదారి లక్ష్మణ్, మోసం తిరుపతి, బొట్ల ముండయ్య, బొజ్జ సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version