నామినేషన్ కేంద్రాల పరిశీలన…

నామినేషన్ కేంద్రాల పరిశీలన

బాలానగర్/నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, తిరుమలగిరి నామినేషన్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ ధారావత్ జానకి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలపై సిబ్బందితో కలిసి ఆరా తీశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్ గౌడ్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా ఇంజనీర్స్ డే…

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా ఇంజనీర్స్ డే

ఇంజనీర్ లను సన్మానించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని మండలంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ నోముల శ్రీలత హౌసింగ్ ఏఈ పోకల ఆకాంక్షలను మండల పరిషత్ అబివృద్ది అధికారి పెద్ది ఆంజనేయులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా యంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అంటే కేవలం చదువు మాత్రమే కాదని దేశ అభివృద్ధికి ఒక దిశ అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో ఆఫీసులో ఎలక్షన్ డ్రాప్టింగ్ లిస్ట్ ప్రచురణ.

ఎంపీడీవో ఆఫీసులో ఎలక్షన్ డ్రాప్టింగ్ లిస్ట్ ప్రచురణ.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శనివారం రోజున ఎంపీడీవో జయ శ్రీ ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ ఎంపిటిసి జెడ్పిటిసి ఎలక్ట్రోల్ లిస్ట్ మరియు పోలింగ్ స్టేషన్స్ వివరాలను ప్రచురించడం జరిగింది దీనికి సంబంధించి ఏవైనా అపోహలు సందేహాలు ఉంటే శనివారం నుండి ఈనెల 8వ తేదీ వరకు వినతులను స్వీకరించడం జరుగుతుందని. అదే రోజు కార్యాలయంలో మండల రాజకీయ పార్టీ ప్రతినిధులతో 11:30 కి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని సమస్త పంచాయతి కార్యదర్శులు,ఉపాధి హామీ సిబ్బందితో జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ,ఎంపీఓ ఆధ్వర్యంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు,పారిశుద్ధ్య కార్మికులకు,ఈజీఎస్ సిబ్బందికి కొన్ని ముఖ్య నిర్ణయాలను,సూచనలను తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.వివరాలలోకి వెళితే అన్ని గ్రామ పంచాయతీలలో ఈత చెట్ల ప్లాంటేషన్,కెనాల్ ప్లాంటేషన్,బండ్ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని,ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని,అన్ని రకాల రోడ్ల ప్రక్కన అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటాలని,కంక మొక్కల ప్లాంటేషన్,ఆర్ఓఆర్ బండ్ ప్లాంటేషన్,ఫారెస్ట్ ల్యాండ్ లలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో,ప్రభుత్వ భవనములలో మంచి పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటించాలనీ,వన మహోత్సవం రిజిష్టరులో నమోదు చేసి ఉంచుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీలలో అవసరమున్న చోట కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించాలని,డ్రైన్ చివరన సోక్ పిట్స్ నిర్మించి పూర్తి చేయాలని తెలిపారు.ఐహెచ్ హెచ్ఐ పూర్తి చేయాలని,కొత్త పనులు అన్ని గ్రౌండ్ చేయాలని,ఇందిరమ్మ ఇళ్లకు ఐహెచ్ హెచ్ఐ తనిఖీ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని పంచాయతి కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.సైడ్ డ్రైన్ లలో డీసిల్టింగ్ క్లీన్ గా చేపించాలని,వాటర్ పేమెంట్ తప్పకుండా చేయాలని,ప్రతీ మంగళ వారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు.ఎంపీడబ్ల్యు వర్కర్లచే 8 గంటలు పని చేయించాలనీ,వారు ఏ ఇంటినుండి ఎక్కడికి పనిచేసినది రికార్డుల్లో నమోదు చేయాలని,2025-25 డిసిబి రిజిష్టర్లు ప్రింట్ తీసుకోవాలని,మాన్యువల్ గా రిజిష్టర్ వ్రాసి చూపించాలన్నారు.అన్ని బిల్లులు గ్రామ పంచాయతీ వారిగా ఇవ్వాలని,ఆడిట్ రిపోర్ట్ లు తయారు చేసి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,పంచాయతీ కార్యదర్శులు,ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version