40 కోట్ల కార్మికులకు నూతన కార్మిక చట్టాల లాభం

నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల కార్మికులకు ఆదర్శవంతమైనవి

బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల మంది కార్మికులకు ఆదర్శవంతం, చారిత్రాత్మకమైన చట్టాలు అని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడించారు.బుధవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాజకీయ ప్రేరేపిత సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.భారత ప్రభుత్వం 49 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా సవరించడం కార్మిక హక్కుల, సంస్థల సంరక్షణ,పరిశ్రమల ప్రగతి,దేశ అభివృద్ధి, నిర్మాణాత్మకమైన పారదర్శకత కలిగిన ఆదర్శవంతమైన చారిత్రాత్మకమైన చట్టాలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ స్వాగతిస్తున్నామని తెలిపారు.వలస పాలన కాలంలోని పాత చట్టాలను మార్పు చేసిన చట్టాలను పూర్తిగా ఆధునిక,పారదర్శక, ఏకీకృత,కార్మిక-కేంద్ర వ్యవస్థను తీసుకువస్తున్నాయని తెలిపారు.14 జాతీయ కార్మిక సంస్థల వేదిక కన్సెంట్ ఈ సంస్కరణలను వికసిత భారత్ 2047 లక్ష్యానికి దారితీసే చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తోందని వివరించారు.అసంఘటిత, వలస,గిగ్, ప్లాట్‌ఫారమ్,అనధికా రంగాల దాదాపు 40 కోట్ల మంది కార్మికులు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని చెప్పారు.ఇఎస్ఐసి తరహా ఆరోగ్య సేవలు,పింఛన్-లింక్డ్ ప్రయోజనాలు,ప్రసూతి రక్షణ, వికలాంగుల సహాయం, సంక్షేమ పథకాల పోర్టబిలిటీ వంటి సేవలు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి.ప్రతి కార్మికుడికి ఫార్మల్ అపాయింట్ లెటర్ తప్పనిసరి కావడం,అలాగే జాతీయ కనీస వేతనం కంటే తక్కువ వేతనం దేశంలో ఎక్కడ అమలు చేయకూడదనే నిబంధన వల్ల అనౌపచారిక ఒప్పందాలు,అన్యాయ కత్తిరింపులు,సేవా రికార్డు లేమి వంటి దోపిడీలు తగ్గిపోతాయని తెలిపారు.డిజిటల్ వేతన వ్యవస్థలు పారదర్శకత బాధ్యతను పెంచుతాయని చెప్పారు.కార్మిక భద్రత, వ్యవసాయక ఆరోగ్యం,భద్రత కమిటీలు,సాంకేతికత ఆధారిత తనిఖీలు,మహిళల కార్మికుల భద్రత వంటి అంశాలపై కోడ్లు తీసుకొచ్చిన మెరుగుదలలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవని పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,యాజమాన్య సంస్థలు,కార్మిక సంఘాలు, నిపుణులతో జరిగిన విస్తృత సంప్రదింపుల ఫలితమని అన్నారు.కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కార్మిక సంఘాలు కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి,ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, బోయిన మల్లేష్,జిల్లా తిరుపతి,రాజా రామ్ కిరణ్, శ్రీధర్,రామకృష్ణ,బాపు, మొగిలి,తిరుపతి,శేఖర్, సురేష్,మహేందర్ పాల్గొన్నారు.

అప్పాని శ్రీనివాస్ కొత్త కార్మిక కోడ్లకు మద్దతు

తప్పుడు ఆరోపణలు చేస్తున్న కార్మిక సంఘాలు

అప్పాని శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో, భూపాలపల్లి ఏరియా ఉపా ధ్యక్షులు వెలబోయిన రజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ సి ఎంకెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అప్పాని శ్రీనివాస్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు కార్మిక చట్టాల కోడ్లు కార్మికులందరికీ అనుకూలంగా ఉండడంతో బి ఎం ఎస్ కార్మిక సంఘం వాటిని పూర్తిగా సాగదీస్తుంది భారత దేశంలో అసంఘటిత, వలస, గిగ్, ప్లాట్‌ఫారమ్ అనధికార రంగాలు దాదాపు 40 కోట్ల మంది కార్మికులకు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం. ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని గ్రహించాలి.
వేజ్ కోడ్ కనీస వేతన హక్కు
సకాలంలో, పారదర్శకంగా జీతం చెల్లింపు సమాన పనికి సమాన వేతనం
బోనస్, అలవెన్సులపై స్పష్టమైన నియమాలు డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్ / స్ట్రింగర్ / ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం.
ఏమి మారింది? పాత్రికేయ నిర్వచనం విస్తృతమైంది
ఇప్పటివరకు “వర్కింగ్ జర్నలిస్ట్” అనే పదం ప్రధానంగా
ఇప్పుడు ఆ నిర్వచనం విస్తరించి మూడు పెద్ద రంగాలనూ జతచేసుకుంది:
డిజిటల్ / ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్
టీవీ న్యూస్ & ఎలక్ట్రానిక్ మీడియా
రేడియో / ఎఫ్‌ఎం / కమ్యూనిటీ రేడియో పాత్రికేయులు
ఫలితంగా డిజిటల్-ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై వార్తా కంటెంట్ తయారుచేసే అతిపెద్ద వర్గం ఇక అధికారికంగా కార్మిక రక్షణ పరిధిలోకి వచ్చేసింది. ముందస్తు లేఖలు
ధర్నాలు-నిరసనలు
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో చర్చలు
పార్లమెంటరీ కమిటీలకు సూచనలు కొత్త కోడ్ డ్రాఫ్ట్‌లపై అభ్యంతరాలు
ఈ అన్ని కృషే ఈ మార్పుకు పునాది వేశాయి. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వెలబోయిన సుజెందర్ బ్రాంచి ఉపాధ్యక్షులు. పాండ్రాల మల్లేష్ పని రమేష్ కొత్తూరు మల్లేష్ రఘుపతి రెడ్డి అన్నం శ్రీనివాస్. తాండ్ర మొగిలి. దాసరి ఓదెలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి…

ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లందర్నీ పర్మినెంట్ చేసి,కనీస వేతనం నెలకు26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాదులో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి యాసారపు వెంకన్న పిలుపునిచ్చారు. శనివారం గుండాల మండల కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజాల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు.రెక్కలు తప్ప ఆస్తులు లేని ఈ కార్మికులకు కనీస వేతనాలు కూడ అమలు చేయడం లేదని విమర్శించారు.మురికిలో మునిగి వీధులను శుభ్రం చేస్తున్న సపాయి కార్మికులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వకపోవడం చాలా విచారకరమని అన్నారు.పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మిక సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 7న హైదరాబాదులో నిర్వహించే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నాగేష్,తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింత నరసయ్య కార్మికులు పాల్గొన్నారు.

ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వాలి…

ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వాలి

పీహెచ్సీ ముందు సిఐటీయు ధర్నా

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తమకు పారితోషకం వద్దని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతూ పిహెచ్సి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక డాక్టర్ సుధీర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. తమకు ప్రతి నెల వేతనం సక్రమంగా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ 20 తారీకు గడుస్తున్నప్పటికీ వేతనం ఇవ్వలేదని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట దాటి వేసిందని అందుకనే ఈనెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, 30 న హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు వజ్జ సుశీల తెలిపారు. జబ్బ ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నదని కనీస వేతనం అమలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూనేమ్ సరోజ, ఊకె విజయలక్ష్మి, లక్ష్మీనరసమ్మ కల్తీ వసంత ,వినోద, ఈశ్వరి ఈసం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version