పున్నెల్‌లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారం…

పున్నెల్‌లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారం

సుధీర్ గౌడ్ అభ్యర్థిత్వానికి గ్రామంలో జోష్

నేటిధాత్రి ఐనవోలు:

 

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పున్నెల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కత్తి సుధీర్ గౌడ్ తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శుక్రవారం హాజరయ్యారు.

గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే నాగరాజు మహిళలు సంప్రదాయ కోలాటాలతో ఘన స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థి కత్తి సుధీర్ గౌడ్ తో కలిసి ఇంటి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ,
పున్నెల్ అభివృద్ధికి సమర్థుడైన యువ నాయకుడు సుధీర్ గౌడ్ అవసరం. గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే తీరు సుధీర్‌లో ఉంది. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను విజయం సాధించాలని” ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రచారంలో సుధీర్ గౌడ్ యొక్క గ్రామాభివృద్ధి విధానాలు, నీటి సదుపాయాలు, కాల్వల సమస్యల పరిష్కారం, రోడ్ల అభివృద్ధి, యువతకు అవకాశాల కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరించారు.గ్రామస్తులు సుధీర్ గౌడ్ కు విస్తృత స్థాయిలో స్పందించడం ప్రచారానికి ఊపు తెచ్చింది.

ఘనంగా గణపతి నిమజ్జనం…

ఘనంగా గణపతి నిమజ్జనం

మరిపెడ నేటిధాత్రి

 

 

భక్తులతో నవరాత్రులలో ఘనంగా పూజలందుకున్న గణనాధుడి నిమజ్జనం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం తోపాటు ఊరూరా గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో కోలాహలంగా నిర్వహించారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ ప్లాజా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది.మహిళల కోలాటాలు,డప్పు చప్పుల్లతో భక్తులు బారీగా హాజరై పట్టణ వీధుల్లో ర్యాలీగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఆర్ సత్తి రెడ్డి మాట్లాడుతూ గణపతి నీ భక్తి శ్రద్దలతో పూజించి కోరిన కోర్కెలు తీర్చాలని, అందరూ ఆరోగ్యంగా, సుభిక్షముగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామనన్నరు,మాకుల చెరువు దగ్గర నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు,అంతకుముందు గణేషుడి లడ్డు వేలంపాట నిర్వహించగా 61 వేల రూపాయలకు కరుణాకర్ రెడ్డి ఝాన్సీ దంపతులు,51 వేల రూపాయలకు రావుల సుమంత్ రెడ్డి లావణ్య దంపతులు, దక్కించుకున్నారు. లక్కీ డ్రా ద్వారా గందసిరి సునీత రమేష్ గౌడ్ దంపతులు దక్కించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్లాజ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆర్ సత్తి రెడ్డి, నీరంజన్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి,దోమల సత్య శ్రీనివాస్, ఉడుగుల శ్రీను,కృష్ణ,భద్రీ,సాగర్,కార్తీక్,ఉపేందర్,సురేష్,సోమిరెడ్డి, రామ చంద్రయ్య,రేపల యాదయ్య, ఉపేందర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version