కోళ్ల పాము నిప్పు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలి.

కోళ్ల పాము నిప్పు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవారం గ్రామం లో కోళ్ల పామ్ షెడ్డు కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు అని ఆ గ్రామానికి చెందిన గొల్ల శ్రీశైలం తెలిపారు. శుక్రవారం అయన మాట్లాడుతూ ఈ నెల 11 న రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కోళ్ల పామ్ కు నిప్పు పెట్టారు అని అట్టి వ్యక్తుల ను గుర్తించి వారి పై చర్యలు తీసుకువాలి అని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. షెడ్డు లో సుమారు 2 లక్షల వరకు సమగ్రీ ఉన్నట్లు తెలిపారు. అవి మొత్తం పాడై పోయినవి అని తెలిపారు.

నవత ఆటో యూనియన్ చలివేంద్రం ఏర్పాటు.

నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముఖ్య అతిథిలుగా హాజరైన ఎస్ఐ మహేందర్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి నేటి ధాత్రి:

 

 

#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని అంబేద్కర్ కూడలిలో నెక్కొండ నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నెక్కొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు సురేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చలివేంద్రం ను ప్రారంభించారు ఈ సందర్భంగా టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులకు త్రాగునీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, గంధం సుధాకర్, నవత ఆటో యూనియన్ సభ్యులు శ్రీరంగం శ్రీనివాస్, పొదిల సురేష్, వాగ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version