అతిధి అధ్యాపక నియమాకానికి దరఖాస్తుల ఆహ్వాన తేదీ పొడగింపు
8వ తేదీన దరఖాస్తులు స్వీకరణ,9వ తేదీన ఇంటర్యూ నిర్వహణ
పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025,26 విద్యా సంవత్సరానికి గాను ఆతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ తెలిపారు.విద్యాశాఖా కమీషనర్ ఆదేశాల మేరకు బోటనీ విభాగంలో 1,మరియు మాథెమాటిక్స్ విభాగంలో 1కి గాను ఆతిధి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని,సంబందిత సబ్జెక్టులో 55శాతం మార్కులు (ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు 50శాతం మార్కులు)కలిగి ఉంటే ధరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.పిహెచ్డి,నెట్,సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది తెలిపారు.దరఖాస్తులు ఈ నెల 08వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని,ఇంటర్వ్యూలు 09వ తేదీ ఉదయం నిర్వహించడం జరుగుతుందని అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని తెలిపారు.సమాచారం కోసం 9951535357 గల నెంబర్ ను సంప్రదించాలని కోరారు.