జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గ ము) జహీరాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొహమ్మద్ యునుస్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ ఛైర్మన్ మరియు నాయకులు.ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనం అన్నారు. మీ మార్గదర్శకత్వంలో జహీరాబాద్ పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, మౌలిక వసతులను మెరుగుపర్చుతూ, ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ పథకాలతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు. విజయవంతంగా , పారదర్శకతతో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము.మీ భవిష్యత్తు కార్యాచరణను మరింత నిబద్దతో ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో బేసి జేఏసీ జహీరాబాద్ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ. అధ్యక్షుడు కొండపురం నర్సిములు,ఉపాధ్యక్షులు శంకర్ సాగర్ ,మైనారిటీ యూత్ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్, భుడగజంగం యువ నాయకులు మాదినం శివ ప్రసాద్, వడ్డెర సంఘం యువ నాయకులు శేఖర్, జయ విజ్ఞాన భారతి సొసైటీ డైరెక్టర్లు బాలక్రిష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు…

నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

జహీరాబాద్ నియోజకవర్గ అల్లాడి వీరేశం బట్టల దుకాణ యజమాని.అమెరికా పర్యటన ముగించుకొని జహీరాబాద్ కు వచ్చిన సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నరసింహులు గారికి కలిసిన సందర్భంగా జహీరాబాద్ నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్ గారికి ఎస్ వి షాపింగ్ మాల్ లో ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్
మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధిని మనమందరం కలిసి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలలో ప్రాధాన్యత భేదాలు వర్గ విభేదాలు ఎప్పటికీ ఉండరాదని ఆయన హితవుపలికారు. ఎన్నికల పోటీల్లో మాత్రమే పోటీ ఉండాలి గెలిచిన అనంతరం అందరూ ఐకమత్యంతో సమన్వయంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావలసి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

ఎట్టకేలకు జహీరాబాద్…మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం…

ఎట్టకేలకు జహీరాబాద్…మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

◆-: మున్సిపల్ ఛైర్మన్ గా మహమ్మద్ యూనుస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరిష..

◆-: కాంగ్రెస్ ఖాతాలోకి జహీరాబాద్, కోహీర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు..

◆-: రెండు మున్సిపాలిటీలల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఎట్టకేలకు జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠకు తెరపడింది. కోరమ్ లేక సోమవారం నాడు వాయిదా పడిన ఈ ఎన్నిక చివరకు మ్యాజిక్ ఫిగర్ రాజకీ యాలతో ముగిసి మంగళ వారం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వివరాలలోకి వెళితే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సి పాలిటీలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 స్థానాలు గెలుచుకోగా, జహీరాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ లు ఈ మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా నమోదు కావడంతో మొత్తం 39 మంది సభ్యులు కాగా, చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20 సభ్యుల మద్దతు దక్కించుకోవడం కీలకంగా మారింది. సోమవారం నాడు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరమ్ లేక ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలతో కలిసి ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిపి 19 మందితో బిఆర్ఎస్ మద్దతు కూడగట్టగా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఇద్దరు, ముగ్గురు స్వతంత్రులను తమవైపు తిప్పుకుని ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరుకోగా, ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 15 వ వార్డు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్ మహమ్మద్ యూనుస్ చైర్మన్ గా, 16 వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికైన కొత్త కాపు శిరీష వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు..a

చైర్ పర్సన్, వైస్ చైర్ లను శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు…

చైర్ పర్సన్, వైస్ చైర్ లను శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలలో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగి చివరకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, సురేష్ కుమార్ షట్కార్, మాజీ మంత్రివర్యులు, డాక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి, ఉద్దండ రాజకీయ దురందరులు ఒకే వేదిక పైకి వచ్చి జహీరాబాద్ మునిసిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిఆర్ఎస్ పార్టీని అద పాతాళానికి అణగదొక్కి మరోసారి జహీరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని నిరూపించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు నేడు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఫ్ చైర్పర్సన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి గౌరవనీయులు అందరికీ ఆమోదయోగ్యులైనటువంటి మహమ్మద్ యూనుస్ గారిని చైర్పర్సన్ గా, శిరీష రెడ్డి గారిని వైఫ్ చైర్పర్సన్ గా ఎన్నుకొని జహీరాబాద్ పట్టణ బాధ్యతలన్నింటిని తమరి భుజస్కందాల పైన పెట్టడం జరిగింది. ఈ ఐదు సంవత్సరాలు పట్టణ అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తారని ఆశిస్తూ జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బాగా రెడ్డి గారి హయాంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మహమ్మద్ ఫరీదోద్దీన్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన మాట వాస్తవం అని తెలియజేస్తూ ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మహమ్మద్ యూనుస్ గారికి, వైస్ చైర్ పర్సన్ శిరీష రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు,

జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, ఛైర్మన్గా యూనుస్ ఏకగ్రీవం…

జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం, ఛైర్మన్గా యూనుస్ ఏకగ్రీవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ చైర్మన్ గా మహ్మద్ యూనూస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరీషారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికకు సంబంధించి నిర్ణీత సమ యానికి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్తో సహా 20 మంది కాంగ్రెస్ సభ్యులు మున్సిపల్ కార్యా లయానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సహా 19మంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేరుకున్నారు. కోరం సభ్యు లందరూ హాజరైన అనంతరం ప్రత్యే కాఅధికారి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. చైర్మన్ గా యునస్, వైస్ చైర్మన్ గా శిరీషారెడ్డి ఎన్నికవగా వారికి అభి నందనలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version