మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం…

మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం

◆-: ఖాదర్ నగర్ వాగులో పేరుకుపోయిన చెత్త తొలగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఫయాజ్ నగర్ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను సమూలంగా పరిష్కరించి కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించెందుకు కృషి చేస్తామని 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం అన్నారు. శుక్రవారం నాడు పట్టణంలోని ఫయాజ్ నగర్ వార్డులో భాగమైన ఖాదర్ నగర్ కాలనిలో గల వాగులో పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో మురికి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో కౌన్సిలర్ ప్రతినిధి మొహమ్మద్ అక్రం జేసిబి యంత్రం సహాయంతో చెత్తను తొలగింపజేసి వాగులో నీటిని సజావుగా వెళ్లేందుకు చెత్తను తీసివేయించారు. ఈ సందర్భంగా అక్రం మాట్లాడుతూ వార్డు ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన చెత్త బుట్టలో వేసి తడి మరియు పొడి చెత్తను వేరువేరుగా వేసి ట్రాక్టర్ లో వేయాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version