బుల్లోజు పార్ధు కుటుంబాన్ని పరామర్శించిన వార్డ్ కౌన్సిలర్లు..

బుల్లోజు పార్ధు కుటుంబాన్ని పరామర్శించిన వార్డ్ కౌన్సిలర్లు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ
కేసముద్రం విలేజ్ లో మరణించిన బొల్లోజు ప్రార్థన చారి పార్థివ దేహానికి నివాళి అర్పించిన 8 వ మరియు 9వ వార్డు కౌన్సిలర్స్ వేముల భారతి శ్రీనివాస్ రెడ్డి,కనుకుల సుభద్ర రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.వారితో పాటు అరెందుల శ్రీనివాస్, తుంపిల్ల వెంకన్న,నిమ్మల రామకృష్ణ ,కమటం సురేందర్, యాకంబ్రం, సముద్రాల మహేష్, దోసపాటి అచ్యుత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి…

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి

అభివృద్ధి చేసేవారిని కౌన్సిలర్లు గా ఎన్నుకోవాలి

తెలుగుదేశం పార్టీ నేత గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో వివేకానం చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొల్లాపూర్ రోడ్డు మహబూబ్ నగర్ రోడ్డు లో ఇరుకు రోడ్లతో ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని పెండింగులో ఉన్నా వనపర్తి లో రోడ్ల వెడల్పు విస్తరణ పనులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీనేత శంకర్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మేగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఒక ప్రకటన లో కోరారు వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా కొందరు ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలొ రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేశారని అన్నారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని శంకర్ తెలిపారు వనపర్తి పట్టణ ప్రజలు పాలకులను గమనిస్తూన్నారని గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ అశ్వని దామోదర్ ను వనపర్తి పట్టణ ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్లు గా వార్డులను అభివృద్ధి ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారని ఎన్ను కోవాలని ప్రజలను కోరారు వనపర్తి పట్టణ ప్రజలు ఆలోచనలు చేసుకొని ఓట్లు వేసి మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల గా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు

జోషి గోపాల్ శర్మకు ఘన సన్మానం

జోషి గోపాల్ శర్మ జన్మదినం సందర్భంగా ఘనంగా సన్మానం

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో జోషి గోపాల్ శర్మ 58 జన్మదినం సందర్భంగా ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ వాకిటి శ్రీదర్ తిరుమల్ కాగితాల లక్ష్మినారాయణ నాయుడు సామాజిక వేత డాక్టర్ పోచ రవీందర్ రెడ్డి డాక్టర్ చంద్రో దయ కొండ రాము పాపిశెట్టి శ్రీనివాసులు ఆర్ఎంపీ డాక్టర్ డానియల్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు గోపాల్ శర్మ వారిని ఆశీర్వదించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version