న్యాల్ కల్ మండల అభివృద్ధికి ఎంపి పెద్దపీట….

న్యాల్ కల్ మండల అభివృద్ధికి ఎంపి పెద్దపీట….

◆-: రూ:50 లక్షలను మంజూరు చేసిన షెట్కార్

◆-: మంత్రి చొరవతో న్యాల్ కల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి రూ;15 లక్షలు

◆-: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ న్యాల్ కల్ మండల అభ్యున్నతికి మరో మారు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, మండలానికి తాజాగా రూ:50 లక్షలను మంజూరు చేయడం జరిగిందని, న్యాల్ కల్ లోని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ కృషితో రూ:15 లక్షలు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలు తెలిపారు. 2025 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరైన నిధులతో.. మండలంలోని ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాట్లు, బోరు బావులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు త్వరలోనే పనులను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. మండల పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. మండలానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రూ:65 లక్షలను మంజూరు చేయడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, మండల సహకార సంఘాల తాజా మాజీ చైర్మన్లు సిద్ది లింగయ్య స్వామి, జగన్నాథ్ రెడ్డి, మండలంలోని పలువురు తాజా సర్పంచులు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

డ్రైనేజీ సమస్య పరిష్కరం మురికి కాలువ నిర్మాణం…

డ్రైనేజీ సమస్య పరిష్కరం మురికి కాలువ నిర్మాణం

◆-: నేతాజీ నగర్ కాలనిలో సమూలమైన అభివృద్ధి : కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ గౌస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: ఫయాజ్ నగర్ వార్డు అభివృద్ధి కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సహకారంతో వార్డును సమూలంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే రోజుల్లో ఇంచార్జ్ సహకారంతో పట్టణంలోనే ఆదర్శంగా కాలనీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామాని ఫయాజ్ నగర్ కాలనీ 21 వ వార్డు అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ అన్నారు. ఆదివారం నాడు పట్టణంలోని నేతాజీ నగర్ కాలనిలో డ్రైనేజీ సమస్య పరిష్కరం కోసం కాంగ్రెస్ వార్డు అధ్యక్షుడు గౌస్ కలనివాసులతో కలిసి టెంకాయ కొట్టి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాలనీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే డా చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ధి పనులు చేసి కాలనిలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ నబి, మొహమ్మద్ ఆర్షద్, మొహమ్మద్ ఇర్ఫాన్, మొహమ్మద్ గౌస్, అజిం, యూసుఫ్, మహేతబ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version