మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్…

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టాణానికి చెందిన జూలూరి మనీష్ గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అనుబంధ సంఘం యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు నీయామక పత్రం సోమవారం అందజేసినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. గౌడ కులస్తుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మనీష్ గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. ఈ పదవిలో మనీష్ గౌడ్ రెండేళ్లు కొనసాగుతాడన్నారు.తనను యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన అనంతుల రమేష్ గౌడ్, తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, ఎరుకొండ కర్ణాకర్ గౌడ్ లకు మనీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: కార్మిక సంఘాలు

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు

నర్సంపేట, నేటిధాత్రి:

కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టం జరిగే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాలైన బిఆర్టియు,ఏఐటియుసి, ఐఎఫ్టియు, మాస్ లైన్ ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కమిటీ కార్యదర్శి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సింగరకొండ మాధవ శంకర్ లకు సమ్మె నోటీసులు అందజేశారు.ఈసందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు,హమలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ.ఏ ఐ టి యు సి సివిల్ సప్లై రాష్ట్ర నాయకులు గుంపెల్లి మునీశ్వర్,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బడా కార్పోరేట్ శక్తులు దోపిడీ చేసుకోవడానికి కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయని సాకుతో కేంద్ర ప్రభుత్వంతో మికకత్ ఆయ్యి కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదని ఆరోపించారు.కార్మిక వర్గం ఒకటై ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెరమండ్ల రవి, రాములు, జనార్ధన్, ప్రసాద్, మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సీఐ శ్రీనివాస్‌ను సన్మానించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

సీఐ శ్రీనివాస్ ను సన్మానించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ సీఐగా ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇస్పెక్టర్ శ్రీనివాస్ ను జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా స్వంచంద సంస్థలు ఉంటూ ఎన్నో రంగాల్లో నిస్వార్థసేవలు అందించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్ గౌడ్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ , ఏఎస్ఆర్ సంస్థ నిర్వాకుడు ఎర్రబోయిన రాజశేఖర్, విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సొరంగం,ఎస్సి,ఎస్టీ కన్వీనర్ బోయిన వెంకటస్వామి,వేంకటాచారి,మొగిలిచర్ల రాము సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపాలిటీ భాజపాకు ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం: సీతారాం నాయక్

ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.

రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఏమిచ్చింది.

మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్

కుంభకోణాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు

జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చినవే.. ఇప్పటివరకు నర్సంపేటను పాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమి అభివృద్ధి చేశాయి. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపా ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ముందస్తు సన్నగ్ద సమావేశాలు నిర్వహించేందుకుగాను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో మరోసారి పట్టణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.నర్సంపేట పరిదిలో ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసేవి చాలా ఉన్నాయి.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీతారాం నాయక్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్,భారాస పార్టీలు అభివృద్ధి చేస్తాయని ఇప్పటికీ నర్సంపేట మోసపోయింది.మరల మోసపోవద్దు అని పేర్కొన్నారు.ప్రస్తుతం నర్సంపేటలో జరిగిన అభివృద్ధి నేను చేసిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో..చేసిన అభివృద్దే కనబడుతున్నది అని మాజీ ఎంపీ తెలిపారు.ప్రధాని మోడీ ప్రపంచ నాయకునిగా ఆచరిస్తున్నారు.అదే తరహాలో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇస్తే రాబోయే ఎమ్మెల్యే కూడా భాజపాదే అని భాజపా రాష్ట్ర నేత సీతారాం నాయక్ తెలిపారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు,మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్ కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ

2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దశ దిశలను మార్చారు.అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.జరుగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గెలుపు జెండాలను ఎగురవేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని డివిజన్ లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎంపికలు ఉంటాయన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసినన్నారు.డెబ్బై ఏండ్ల కాంగ్రెస్,
పదేండ్ల బిఆర్ఎస్ పార్టీలు ఒకే కుటుంబ పార్టీలు..అవి నిత్యం కుంభకోణాలను నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు.
గతంలో గిలిచిన 9 ఎంపిలు,9 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోయే మున్సిపాలిటీలో ఎన్నికలో అధిక మున్సిపాలిటీలను గెలిపించుకోవడమే లక్ష్యం.దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోష్యం చెప్పారు.కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు మాట్లాడుతూ నర్సంపేటలో చేసే ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అని పేర్కొన్నారు.
సొమ్మోకరిది సోకోకరిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి,నర్సంపేట ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో
30 డివిజన్లలో పోటీ చేస్తున్నాం.
ప్రజా బలం ఉన్న నాయకున్ని ఎన్నికల బరిలో దింపుతామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోడీ నర్సంపేట 3000 ఇండ్లు పంపితే ఒక్క డబుల్ బెడ్రూo కూడా ఇవ్వలేదన్నారు.ఆరు గ్యారెంటీలు,420 హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిసి రోడ్ల పేరుతో కాంట్రాక్టర్ అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి భాజపా నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నర్సంపేటకు శ్రీరామ రక్షా అవుతుందని రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంజాల శ్రీ రాం,కుంభం కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బానోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి,పొనుగోటి రవీంద్రచారి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత మహిళ నాయకురాలు మార్త సంధ్యారాణి,బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు,రాజ్ కుమార్, మస్ శివ,థౌటం నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన పెండెం రామానంద్…

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణానికి చెందిన వడ్లకొండ సాంబయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందాడు.కాగా అందుకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పథకం కింద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం ఆ వార్డు ఇంచార్జ్ కొంకిస అరుణ గౌడ్ చేతుల మీదుగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్, మాజీ వార్డు సభ్యులు కొయ్యడి సంపత్ గౌడ్,గండి గిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

నూతన తాసిల్దార్ ను సన్మానించిన సర్పంచ్ నాగేందర్ పటేల్…

నూతన తాసిల్దార్ ను సన్మానించిన సర్పంచ్ నాగేందర్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల తహసీల్దార్ గా సి. భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బోరేగౌ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ నాయకులు శనివారం తహసీల్దార్ ను కలిసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. రైతుల, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తహసీల్దార్ ను కోరారు. పాలనకు పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నవాబ్ సంగమేశ్వర్, నాయకులుబ్పల్గొన్నారు.

నర్సంపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో అయ్యప్పలకు సన్మానం…

నర్సంపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో అయ్యప్పలకు సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఆర్టీసీ బస్సులో శబరిమళ వెళ్లి వచ్చిన అయ్యప్ప స్వాములకు నర్సంపేట డిపో ఉద్యోగులు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి 7 రోజుల పాటు శబరిమళ యాత్ర ముగించుకుని నర్సంపేట చేరుకున్న అయ్యప్ప మాలదరులు శానబోయిన నరేష్ గురుస్వామి అయ్యప్ప బృందాన్ని నర్సంపేట డిపో ఉద్యోగులు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ సూచనతో స్వాగతం పలికి పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులో దైవదర్శనాల కోసం చేసుకుని శబరిమళ వెళ్లిరావడం సంతోషకరంగా ఉందన్నారు. శబరిమళ వెళ్లే అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకోవాలని కోరారు. అనంతరం డ్రైవర్లు అశోక్ రెడ్డి, మహేందర్, భక్తులు రవీందర్, మాధవ్, యుజిస్టర్ లను సన్మానం చేసారు.ఈ కార్యక్రమం లో డిపో ఉద్యోగులు రాజు, శ్రీధర్,రాంబాబులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version