విలీన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం…

విలీన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం*

నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలో విలీనమైన నాగుర్లపల్లి, పర్శునాయక్ తండా 16వ వార్డును మున్సిపల్ యంత్రాంగంతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్‌తో కలిసి గ్రామంలోని డంపింగ్ యార్డ్, బతుకమ్మ ఆడుట స్థలం, పల్లె దవాఖాన, మట్టి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు.విలీన గ్రామ ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు.

ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం, పారిశుధ్యంపై ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.పార్టీలకతీతంగా ఎలాంటి బేషజాలం లేకుండా 16వ వార్డు అభివృద్ధి కోసం అవసరమైన నిధులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మంజూరు చేయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్యులు మేఘ్య నాయక్, శంకర్ నాయక్, క్రాంతి కుమార్, కొర్ర రాహుల్, కొర్ర రాజన్న తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజీ పనుల మొదలుపెట్టిన చైర్ పర్సన్…

డ్రైనేజీ పనుల మొదలుపెట్టిన చైర్ పర్సన్

యాదగిరిగుట్ట నేటి దాత్రి:

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మరియు 7వ వార్డు కౌన్సిలర్ మెల్లిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ 8వ వార్డు కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ ఎరుకల హేమేందర్ సుడుగు శ్రీనివాస్ రెడ్డి బుజ్జ సాంబేష్ బ్రహ్మచారి మరియు తదితరులు పాల్గొన్నారు*

నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ.

నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ.

బాలానగర్ /నేటి ధాత్రి.

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మన్నెగూడెం తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని జోగ్య నాయక్ తాండలో అంగన్వాడీ ఉపాధి ఎన్.ఆర్.జి.సి పథకం ద్వారా నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ జటావత్ రాజు నాయక్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య సదుపాయాల మెరుగుదలకు ఈ నిర్మాణ పనులు ఉపయోగపడనున్నాయని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయన్నారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేనావత్ హీర్యా నాయక్, ఎన్.ఆర్.జి.సి నాగేశ్వరి, 6వ వార్డు సభ్యులు అంజి వెంకటేష్, 7వ వార్డు సభ్యులు నేనావత్ హరిసింగ్, మాజీ సర్పంచ్ మోతి, మాజీ డిప్యూటీ సర్పంచ్ సోమ్లా నాయక్, నేనావత్ రాములు నాయక్, కాంట్రాక్టర్ రాజు, నర్సింహ, రవి, జగ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version