చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు..

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ లను మంగళవారం తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలుపొంది, ఇటీవలె చైర్మన్ గా బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌడ సంఘం నేతలు వారికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ చైర్మన్ గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. కష్టపడి పని చేసే వాళ్లకు పదవులు దక్కడం అభినందనీయమన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూనే, గౌడ సంఘం సమస్యలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. భూపాలపల్లిలో గౌడ సంఘం కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం తో పాటు, గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి నర్సింగం గౌడ్, గౌరవ అధ్యక్షులు ఏరుకొండ సంపత్ కుమార్ గౌడ్, జిల్లా నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్, కంకటి రాజవీరు గౌడ్, తడుక సుధాకర్ గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర రమేష్ గౌడ్, బుర్ర లక్ష్మణ్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, నాగపురి సమ్మయ్య గౌడ్, గైని ఎల్లగౌడ్, సదానందం గౌడ్, జగన్ గౌడ్, రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గండి చిరంజీవి గౌడ్, కె.వి అశోక్ గౌడ్, చిర్రా అశోక్ గౌడ్, గట్టు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మూలన పడిన కరోనా కాలపు యంత్రాలు…

మూలన పడిన కరోనా కాలపు యంత్రాలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

కరోనా మహమ్మారి రోజుల్లో ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, విద్యాసంస్థలు ఇలా ఎక్కడ చూసినా చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాటు చేసిన సానిటైజర్ డిస్పెన్సర్ యంత్రాలు ఇప్పుడు మూలన మట్టి పేరుకుపోయేలా పడి ఉన్నాయి.
ఆ రోజుల్లో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. చేతులు శుభ్రం చేసుకోవడం అనేది రోజువారీ అలవాటుగా మారింది. కాలితో నొక్కితే ద్రవ సానిటైజర్ వచ్చే ఆ యంత్రాలు అప్పట్లో ఆరోగ్య భద్రతకు చిహ్నంగా నిలిచాయి.
కానీ ఇప్పుడు కరోనా మాయం కావడంతో, ఆ పరికరాలు ఎవరి దృష్టికీ చిక్కకుండా మూలల్లో మిగిలిపోయాయి. చాలా చోట్ల అవి తుప్పుపట్టిపోయి, విరిగి, పనికిరానివిగా మారాయి. కొంతమంది ప్రజలు ఇవి తిరిగి ఉపయోగపడేలా ప్రజా మరుగుదొడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
పరిశుభ్రత అనే అలవాటు కేవలం మహమ్మారి సమయంలోనే కాదు, ప్రతి రోజూ ఉండాలనే ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఈ యంత్రాలు మన సామాజిక నిర్లక్ష్యానికి నిదర్శనాలుగా మారాయి

ఎల్లమ్మ తల్లి ఆలయం ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ…

ఎల్లమ్మ తల్లి ఆలయం ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ తల్లి
ఆలయంలో కొత్త ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.గ్రామస్తులు ఆలయం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి స్వచ్చందంగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ “ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామానికి శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. ఈ ముఖద్వారం నిర్మాణం ద్వారా ఆలయానికి మరింత గౌరవం పెరుగుతుంది” అన్నారు. యువత కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని భక్తి భావంతో పూజలు నిర్వహించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version