వాయిదా పడిన జహీరాబాద్ పురపాలక చైర్మన్..

వాయిదా పడిన జహీరాబాద్ పురపాలక చైర్మన్..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ల పదవి కోసం నిర్వహించనున్న ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ నెల 17న తిరిగి చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు అవడంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం..?

కాంగ్రెస్ ఖాతాలో చైర్మన్,వైస్ చైర్మన్ పీఠాలు.

కాంగ్రెస్ ఖాతాలో చైర్మన్,వైస్ చైర్మన్ పీఠాలు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

బెల్లంపల్లి లో చైర్మన్,వైస్ చైర్మన్ పిఠము దక్కించుకున్న కాంగ్రెసు పార్టీ.
బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. మున్సిపాలిటీ 34 వర్డ్స్ ఉండగా 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా పీఠం దక్కించుకున్నారు.అలాగే 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేపట్టారు.
బెల్లంపల్లి లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇండిపెండెంట్ 4 బిజెపి 1 కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఫోరం 19 స్థానాలతో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులతో గెలుపొందింది.
ఓట్ల లెక్కింపు రోజే గెలుపొందిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంపు తరలించింది. క్యాంపును మహారాష్ట్రకు తరలించగా మూడు రోజులు అనంతరం ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 14 సీట్లు తో క్యాంపుకు వెళ్లిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బుజ్జగింపుల్లో విప్లమై ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
మొత్తం మీద బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్గా దావా స్వాతి వైస్ చైర్మన్గా రగం శెట్టి సత్యనారాయణ ప్రమాణస్వీకారం నిర్వహించారు.
ఈ ప్రమాణస్వీకారాలను సబ్ కలెక్టర్ మనోజ్ , ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

జహీరాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారం: భారీ బందోబస్తు…

జహీరాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారం: భారీ బందోబస్తు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంలో కూర్చొనే సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ వంటి వసతులు కల్పించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. టిఆర్ఎస్ బిజెపి కౌన్సిలర్లు హాజరు కాగా కాంగ్రెస్ ఎంఐఎం ఇండిపెండెంట్ హాజరు కాలేనందువల్ల
కాని కోరం లేనందున -చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి అనగా 17-02-2026. నాటికి వాయిదా వేయనైనది .

జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్…

జగిత్యాలలో వీడిన చిక్కుముడి.. కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్

 

ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.

జగిత్యాల, ఫిబ్రవరి 16: తాజా.. మాజీ ఎమ్మెల్యేల మధ్య అధిపత్య పోరు నెలకొన్న వేళ.. జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది. దాంతో మున్సిపల్ చైర్మన్‌గా ఆయన వర్గానికి చెందిన సమిండ్ల వాణిని ఎంపిక చేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవి మాజీమంత్రి జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. దీంతో వైస్ చైర్మన్ పదవికి పర్వీన్‌ను ఎన్నుకున్నారు.
మరోవైపు జెడ్పీ, మార్కెట్ కమిటీ పదవును జీవన్‌రెడ్డి వర్గానికి కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తాము సైతం కష్ట పడ్డామంటూ జీవన్‌రెడ్డితోపాటు ఆయన వర్గం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించారు. దీంతో ఇరువర్గాలు ప్రస్తుతానికి శాంతించినట్లు ఒక చర్చ సాగుతోంది.

కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్..

కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.దాంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. హఫీజ్, కాసర్ల గోదావరిలో ఒకరికి ఈ వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

◆-: ఆల్ఫాబెట్స్ ఆధారంగా కౌన్సిల్ సభ్యులకు బల్లాల ఏర్పాటు

◆-: చైర్మెన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జైత్రం నాయక్, డీఎస్పీ సైదా నాయక్ లు తెలిపారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట కౌన్సిల్ సభ్యులందరికీ ప్రమాణం చేయించిన అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నిక కేంద్రం పరిసరాల్లో అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐలు శివలింగం, హనుమంతు, ఎస్సై వినయ్ కుమార్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు…

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో 163 బీఎన్ ఎస్ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉండగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. డీజేలు, మైకులు, బాణాసంచా వంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version