భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానే
మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరైనారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుది అలాగే పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలు నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులోని భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేశారు కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ జిల్లాలను తగ్గిస్తామని అంటున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అసత్య ఆరోపణలు చేస్తున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూపెట్టాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం సిసి రోడ్ల నిర్మాణం స్మశాన వాటికల నిర్మాణం సైడ్ డ్రైనేజీలు కోర్టు భవనం మిషన్ భగీరథ నీరును పట్టణ ప్రజలకు అందివ్వడం జరిగింది వారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు అలాగే మహిళలకు 2500 ప్రతినెల ఇస్తా అని హామీ ఇచ్చారు ఆ హామీని కూడా అమలు చేయలేదు కల్యాణ లక్ష్మి ధార మహిళలకు తులం బంగారం ఇస్తా అని పగడ్బాలు పలికారు కానీ ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. వానకాల సీజన్ స్టార్ట్ అయింది అంటే రైతులకు ఎరువులు యూరియా అందక రైతులు చెప్పులను ఎరువుల దుకాణాల ముందు లైన్ లో పెడుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకు నిదర్శనం రైతులు చెప్పులు లైన్లో పెట్టడమే. దీనికి నిదర్శనం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏనాడూరియా కోసం ఎరువుల కోసం ఇబ్బంది పడలేదు అలాంటి పరిపాలన అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని వారు అన్నారు
రైతులు కష్టాలు పడుతున్నారని ఆలోచించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు రైతు బీమా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అలాగే రైతులకు ఏకారాన పదివేల రూపాయలు రైతుబంధు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని వారు అన్నారు సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు ఇవ్వలేదు కార్మికులకు పేరు మార్పిడి సమస్యతో అనేక బాధలు పడుతున్నారు అయినా వారి సమస్యలను పట్టించుకోవడం లేదు సింగరేణిలో ఉన్న నిధులను పార్టీ అవసరాల కోసం వాడుకుంటున్న సీఎం మన కాంగ్రెస్ పార్టీ సీఎం కావున వారికి తగిన గుణపాఠం ప్రజలు ఓటు ద్వారా చెప్పాలి అని వారు అన్నారు భూపాలపల్లిలో నిరంతరం బొగ్గు లారీలు ఇసుక లారీలతో అనేకమంది వాహనదారులు యాక్సిడెంట్లు ప్రాణాలు దానితో మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి నాకు చెప్పడంతో వెంటనే ఆ రోజులలో భూపాల పెళ్లికి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం సాంక్షన్ జీవో తీసుకురావడం జరిగింది కానీ దానిని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు భూములు సేకరించి పనులు చేపట్టడం లేదు వారు మున్సిపాలిటీ అభివృద్ధి ఎలా చేస్తారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గండ్ర గౌతంరెడ్డి టీజీపీకే నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
