కేటీఆర్ సభకు ర్యాలీగా బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా నేడు ప్రచారం చివరి రోజు కావడంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరైన నేపథ్యంలో 18వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ర్యాలీతో కార్నర్ మీటింగ్ కు కార్యకర్తలతో వెళ్లడం జరిగింది
