బీజేపీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు.

బీజేపీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

 

 

 

జూబ్లీహిల్స్‌(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు.

– మోదీ నైతిక విలువలతో పాలన అందిస్తున్నారు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

 

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు. బుధవారం శ్రీరామ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇంకా ఏమీ అనుకోలేదన్నారు.

 

కేటీఆర్‌ అందించిన స్ర్కిప్ట్‌నే మీరూ చదువుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అంటున్నారన్న విలేకరుల ప్రశ్నకు.. సీఎం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ కళాశాల ఆడిటోరియంలో బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్‌ విధించిన ఎమర్జెన్సీ’ అంశంపై నిర్వహించిన మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

 

 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్‌ రూపకల్పన చేసిన మహోన్నత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తూ నైతిక విలువలతో కూడిన పాలనను నరేంద్రమోదీ అందిస్తున్నారని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా చెరబట్టారనే విషయాలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

 

ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు, నేతలు డాక్టర్‌ ఎం.గౌతమ్‌రావు, లంకల దీపక్‌రెడ్డి, మహిళా మోర్చా నేతలు శిల్పారెడ్డి, రాజు నేత, తులసి, సమత తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థి రామచందర్రావు కలిసిన బూరుగు సురేష్.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థి రామచందర్రావు కలిసిన బూరుగు సురేష్

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్

చేర్యాల నేటిదాత్రి

 

 

 

 

 

బిజెపి రాష్ట్రాల అధ్యక్షులు నియామకంపై లేక విడుదల చేసింది అధిష్టానం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరు సూచించింది హైదరాబాద్ వారి నివాసం దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ శాలువాతో సత్కరించి తన అభిమానం చాటుకున్నారు సీనియర్ నాయకుడు అయిన రామచంద్ర రావు అధిష్టానం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు రానున్న రోజులలో తెలంగాణలో అధికారం తేవడానికి మేమంతా కలిసి కాషాయపు జెండా ఎగురవేసి సత్తా చాటుతామని అన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో
బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

కోట్లాది రూపాయల ధన
ప్రవాహంతోనే బిజెపి గెలుపు

కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలిచిన నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని, కేసులకు భయపడే కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపి కోట్లాది రూపాయలను వెదజల్లి ధన ప్రవాహంతోనే గెలిచిందని విమర్శించారు. గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే బిజెపితో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని, లోపల నుంచి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువద్దనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ బిజెపి ఒకటయ్యాయని పేర్కొన్నారు. కేసుల నుంచి బయటపడందుకే కేసీఆర్ కొత్త నాటకం ఆడారని, చేసిన పాపం ఊరికే పోదని చెప్పారు. నరేంద్ర మోడీ ఎక్కడ తమ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తాడని భయంతోనే కెసిఆర్ బిజెపికి సపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపించారు. ఆ పార్టీ రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నదని, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులకు పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వారికి ఏం న్యాయం చేశారు బిజెపి నేతలు ఆత్మవంచన చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పిట్టకథలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నారు తప్ప గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోయారని మండిపడ్డారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వం పదకోండు ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వెల్లడించాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే యాభై ఐదువేల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులకు అండగా ఉంటున్నదని, నిరుద్యోగుల పక్షపాతిగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అండగా నిలిచిన నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతో కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని జోరుగా ప్రచారం

వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి

వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం రోజున పోతిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో పంజాల సతీష్ మాజీ సర్పంచ్ పానుగంటి మధుకర్ ,దుర్గం బిక్షపతి, చేపూరి రాజు, రాపర్తి కొండల్, రాపర్తి శ్రీనివాస్ ,రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు

జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నీ గెలిపించండి.

బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి.

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది, ఇట్టి కార్యక్రమం లో మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి మాట్లాడుతూ
కరీంనగర్, మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని కోరడం జరిగింది. మరియు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపియగలరని కోరారు, ఈ గెలుపు తో రానున్న స్థానిక సంస్థలలో బీజేపీ పార్టీ విజయం కాయమని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం లో అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు
ఇట్టి కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం నాయకురాలు భోగ శ్రావణి, మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version