కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి…

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు.
మా(కాంగ్రెస్) పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పిన అనిరుధ్ రెడ్డి.. ‘మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన.. నిరంకుశత్వ పాలన. మీది రౌడీయిజం పాలన. అది చూడలేకనే ప్రజలు మిమ్మల్ని.. మీ పార్టీని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.తాను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నానని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని, ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలని అనిరుధ్ రెడ్డి.. కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

పీసీబీ నివేదికలో వాస్తవాలు లేకుంటే అన్నంత పని చేస్తా…

పీసీబీ నివేదికలో వాస్తవాలు లేకుంటే అన్నంత పని చేస్తా

అధికారుల నివేదిక కోసం ఎదురు చూస్తా.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

అరబిందో ఫార్మా కంపెనీలో కలుషిత జలాల విషయంగా తనిఖీలు చేసిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తానని, వారి నివేదిక చూసిన తర్వాత అరబిందో వ్యవహారంపై ఏం చేయాలో నిర్ణయిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారుల తనిఖీల నేపథ్యంలో శనివారం అరబిందో ను తగులబెట్టాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి తనిఖీలు జరిగాయని వాటివల్ల ఒరిగిందేమీ లేదని, ఇప్పుడు కూడా అధికారులు ఇచ్చే నివేదికలో వాస్తవాలు లేకపోతే తాను అన్నంత పని చేస్తానని హెచ్చరించారు.పోలేపల్లి ఫార్మా సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీలోని కలుషిత జలాలను సమీపంలోని ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి మళ్లిస్తుండటంతో ఆ చెరువులోని చేపలు చనిపోతున్నాయని, ఈ నీటి కారణంగా రైతుల పొలాల్లో పంటలు కూడా దెబ్బతింటున్నాయని గతంలో అధికారులతో పాటు అసెంబ్లీలోనూ ఫిర్యాదు చేసిన అనిరుధ్ రెడ్డి శుక్రవారం అరబిందో నుంచి కలుషిత జలాలను మళ్లీ చెరువులోకి మళ్లించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పీసీబీ అధికారులకు శనివారం ఒక్క రోజు టైమ్ ఇస్తున్నానని, ఈ ఒక్క రోజులో వారు చర్యలు తీసుకోని పక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు తాను నేరుగా అరబిందో వద్దకు వెళ్లి గతంలో ప్రకటించిన విధంగానే అరబిందోను తగులబెడతానని అల్టిమేటం జారీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో అనిరుధ్ రెడ్డి హెచ్చరించిన మేరకు పీసీబీ అధికారులు శనివారం హుటాహుటిన సెజ్ కు వచ్చి అరబిందో ఫార్మాలో తనిఖీలు నిర్వహించడంతో పాటుగా కలుషిత జలాలను మళ్లించిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. తాము తనిఖీలలో గుర్తించిన అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని చెప్పారు. శనివారం మీడియాకు పంపిన ప్రకటనలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. తాను కోరిన విధంగా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవడంలో భాగంగా తనిఖీలు చేసిన కారణంగా ఆదివారం తాను అరబిందోను తగులబెడతానన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని, తనిఖీల అనంతరం పీసీబీ అధికారులు ఇస్తామన్న నివేదిక కోసం ఎదురుచూస్తామని చెప్పారు. ఈ నివేదికను చూసిన తర్వాత అరబిందో విషయంగా ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. గతంలోనూ తాను పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేయడం, వారు ఇలాంటి అరబిందోలో నిర్వహించడం జరిగిందని గుర్తు చేసారు. శుక్రవారం అరబిందో నుంచి కలుషిత జలాలు చెరువులోకి మళ్లించిన వీడియోలను కూడా తాను మీడియాకు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అరబిందో నుంచి కలుషిత జలాలను ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి మల్లిస్తున్న మాట వాస్తవమని, దీని వల్ల రైతులు నష్టపోతున్నది కూడా నిజమేనని, అయితే ఈ వాస్తవాలు పీసీబీ అధికారుల నివేదికలో కనబడకపోతే తాను అన్నంత పని చేస్తానని మరోసారి హెచ్చరించారు. పీసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా తమ నివేదికను ఇవ్వాలని అనిరుధ్ రెడ్డి కోరారు. కాగా శనివారం అరబిందోలో తనికీలు నిర్వహించిన పీసీబీ అధికారుల్లో జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఏఇ, జీఎం ఇండస్ట్రీస్ తదితర అధికారులు ఉన్నారు.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

గత ఏడాది కంటే రూ.472 కోట్లు అధికంగా బ్యాంకుల బడ్జెట్.

ఇందులో పంట రుణాలకు రూ. 1140 కోట్లు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2148 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం రుణాలలో రూ.1140 కోట్లను పంట రుణాలకు కేటాయించగా.. మిగిలిన రూ.1008 కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలకు ఇస్తారని వివరించారు. నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలంలో కంటే ఈ ఏడాది ఖరీఫ్ లో పంటల సాగు పెరిగిందని, దాని ప్రకారంగా యూరియా వాడకం కూడా పెరిగిందని చెప్పారు.
వర్షాలు బాగా కురిసి, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసిన నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలను సరళీకృత విధానంలో అందించాలని అధికారులను కోరామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన రైతులకు రూ. 1290 కోట్లను పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వివిధ కారణాలతో ఈ లక్ష్యంలో రూ. 867 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసారని చెప్పారు. అయితే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలను సరళీకృత విధానంలో అందించాలని, పంట రుణాలతో పాటుగా వ్యవసాయ సంబంధిత రంగాలకు, వ్యవసాయ యాంత్రీకరణకు మరింత అధికంగా రుణాలను ఇవ్వాలని కోరామని అన్నారు. గత ఏడాదిలో పంట రుణాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.1676 కోట్ల రుపాయల బడ్జెట్ ను కేటాయించగా ఈ ఏడాది దానికంటే రూ.472 కోట్లు అధికంగా రూ.2148 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వెల్లడించారు. ఈ మొత్తం బడ్జెట్లో జడ్చర్ల మండలానికి రూ.1024 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.283 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.361 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.190 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.186 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.102 కోట్లు చొప్పున బ్యాంకుల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. అలాగే ఈ ఏడాది పంట రుణాల కోసం నియోజకవర్గం మొత్తానికి రూ.1140 కోట్లను కేటాయించగా వీటిలో జడ్చర్ల మండలానికి రూ.482 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.166 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.235 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.104 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.108 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.43 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు విపులీకరించారు.

పెరిగిన పంటల సాగు..యూరియా వాడకం:

జడ్చర్ల నియోజక వర్గంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల సాగు గణణీయంగా పెరిగిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో 24,773 ఎకరాల విస్తీర్ణం లో మొక్క జొన్న పంట సాగు చేయటం జరిగిందని, అయితే ఈ సంవత్సరం 41,160 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయటం జరిగిందని చెప్పారు. అదే విధంగా గత సంవత్సరం వరి పంట 61,708 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 68,069 ఎకరాలలో నాట్లు వేయటం జరిగిందన్నారు. మొక్కజొన్న, వరి పంటల్లో యూరియా వాడకం అదికంగా ఉండటంతో నియోజకవర్గంలో యూరియాకు డిమాండ్ పెరిగిందని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోయిందని, అయితే ప్రస్తుతం 14 వ తేదీ నాటికే 9,134 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగలిగామని వివరించారు. నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో కేటాయించేలా అధికారులతో సమన్వయం చేసుకొని, జిల్లాకు యూరియా రేక్ వచ్చినప్పుడల్లా జడ్చర్లకు ఎక్కువ యూరియాను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version