వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గణపతి పూజలో ఎమ్మెల్యే…

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గణపతి పూజలో ఎమ్మెల్యే
వనపర్తి నేటిదాత్రి .

 

 

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్య యూవజన సంగం అద్యరములో ఏర్పాటు చేసిన గణపతి పూజలో శుక్రవారం రాత్రి పాల్గొన్నారు పూజలో
మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాము వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్, జిల్లా అధ్యక్షులు పూరి బాల్ రాజు శెట్టి మహిళ సంగం అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్,కాంగ్రెస్ పార్టీ నేత రాజు కుమార్ శెట్టి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్, కొండ కిషోర్, కొండ మహేష్,భక్త్తులు పాల్గొన్నారు

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T125952.524.wav?_=1

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రానికి
చెందిన దేసు ప్రదీప్ వారి సతీమణి అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు ఈరోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల పరమశించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే వెంట జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ మండల నాయకులు నేరెళ్ల రాజు యువజన నాయకులు కార్తీక్ కార్యకర్తలు ఉన్నారు

భూపాలపల్లిలో రైతులకు యూరియా సరఫరా సమస్య..

రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల.. మండల కేంద్రంలో రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా యూరియా దొరకలేదు అని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టింది వచ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు మళ్లీ లారీ వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదో అని రైతుల నిరాశ చెందుతున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ సరిపడా యూరియా అందించడంలో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు రేపే యూరియా పంపిణీ చేయాలని అన్నారు చిట్టీలు తీసుకున్న రైతులందరికీ యూరియాసరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తావున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఆకునూరి జగన్ పాల్గొన్నారు

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా దొమ్మటి శ్రీను రక్తదానం..

ఎమ్మెల్యే జన్మదిన సందర్బంగా రక్తదానం చేసిన దొమ్మటి శ్రీను

పరకాల నేటిధాత్రి
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన సందర్బంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శ్రీనివాస్ తనవంతుగా రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ దావాఖానా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, ఆర్ఎంఓ బాలకృష్ణ,గ్రామ అధ్యక్షులు మామూనూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,దొమ్మటి మల్లయ్య,బయ్యా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

#రెండేళ్లలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పనులు..

#58 డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

#57 వ డివిజన్ గోకుల నగర్ ప్రాంతంలో కమిషనర్ తో కలిసి పరిశీలన …

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ ఈ రోజు 58 వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు.గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలకు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు,నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఏబీసీ లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.వర్షాలలో సైతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు.
నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ మేరకు 57 వ డివిజన్ గోకుల్ నగర్ ప్రాంతంలో నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ తో కలసి ప్రాంతాలను పరిశీలించారు.వరద ప్రవాహానికి అడ్డుగా ఉండే ప్రాంతాలకు గుర్తించి పరిష్కార మార్గాలను చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు..

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు

రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎంఎల్ఏ నాయిని రాజేంద్ర రెడ్డి మట్టి గణపతులను పంపిణీ..

మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

#మట్టి వినాయకులని పూజించాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు…

#క్యాంపు కార్యాలయం వేదికగా నగరవాసులకు మట్టి గణపతులను పంపిణీ…

హన్మకొండ, నేటిధాత్రి:

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగరంలోని భక్తులకు,ప్రజలకు స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
పంపిణీ అనంతరం వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు పర్యావరణ హితంగా ఉండాలని కోరుతూ నగరంలో 30000 విగ్రహాలకు అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు సరఫరా అందిస్తున్నదని వెల్లడించారు.మా వంతుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.ఈ మట్టి గణపతుల పూజతో పాటుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు.
ఇప్పటికే అధికారులకు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చామని నవరాత్రి వేడుకలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని,నగరంలో ఏర్పాటు చేసిన మండలాలలో పర్యవేక్షణను చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పాల్గొన్నారు.

టేకుమట్లలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T143337.125-1.wav?_=2

 

టేకుమట్లలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి

సబ్ పోస్ట్ ఆఫీస్ లేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమట్ల మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని దాంతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుతాయని కొన్ని తపాలా సేవల కోసం ఇతర మండలాలకు వెళ్లే పరిస్థితి ఉండదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు టేకుమట్ల మండల కేంద్రంలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉందని దానివలన వినియోగదారులు కొన్ని సేవలు మాత్రమే పొందుతున్నారని ఇతర కొన్ని తపాలా సేవల కోసం పనుల కోసం చిట్యాల మండల కేంద్రంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు వికలాంగులు చిట్యాలకు వెళ్లి తపాలా సేవలు పొందు టకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని అలాగే దూర కూడా వెళ్ళవలసి వస్తుందని అంటున్న ప్రజలు వరంగల్ పార్లమెంటు సభ్యులు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత జిల్లా తపాలా శాఖ అధికారు లు స్పందించి టేకుమట్ల మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని టేకుమట్ల మండల ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు

పోచమ్మతల్లికి వెండి తొడుగులు విరాళం.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T122529.944.wav?_=3

పోచమ్మతల్లికి వెండి తొడుగులు విరాళం.

వరంగల్, నేటిధాత్రి.

 

 

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య-లక్ష్మి దంపతులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష-శ్రీమాన్ దంపతులు, తమ అమ్మమ్మ వాళ్ళ గ్రామం అయిన హంటర్ రోడ్డు శాయంపేటలో, బస్వరాజు సారయ్య కుటుంబం తరపున హంటర్ రోడ్డు, శాయంపేటలో స్వయంభువుగా వెలసిన శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహానికి 5 కిలోల 250 గ్రాముల వెండితో తయారు చేసిన తొడుగులను బహుకరించారు. ఈ తొడుగులను రేపు, అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 7 గంటలకు గ్రామస్థుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి అలంకరించనున్నారు. ఈ సందర్భంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో అందరు ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పోచమ్మ తల్లి వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కుటుంబ సభ్యులు భక్తులందరికీ విజ్ఞప్తి చేశారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T113539.188.wav?_=4

 

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వేషన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు మాజి జెడ్పీటీసీ పండరినాథ్ మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ప్రభు పటేల్ డాక్టర్ నాగరాజ్ నర్సింలు
తదితరులు.

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T130130.548.wav?_=5

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలో రైతు వేదిక ఆఫీస్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొనగా
చర్ల మండలంలోని ప్రజలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన అర్హులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో చర్ల ఎండిఓ ఈదయ్య ఎంపివో వలీ హజ్రత్ సివిల్ సప్లయ్ డిటి రాజులు ఏపిఎం లక్ష్మి దుర్గ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి గుండెపూడి భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంకరాజు ఇందల రమేష్ బాబు పొట్రూ బ్రహ్మానంద రెడ్డి ఈర్ప వసంత్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవిబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు

పరకాల సుందరికరణ చేసి అభివృద్ధి చేస్తా

పరకాల సుందరికరణ చేసి అభివృద్ధి చేస్తా

పట్టణంలోని పలు వార్డులలో ప్రర్యటించిన ఎమ్మెల్యే

వరద ముంపు నుంచి కాపాడేందుకు నివేదిక రూపొందించాం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

శనివారం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా 19వ వార్డు పరిధిలోని పాత సిఎంఎస్ గోదాం వద్ద,14 వ వార్డు పరిధిలోని పాత మసీద్ వాడ, గండ్ర వాడలో జరుగుతున్న డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి పరిశీలించి,పలు సూచనలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా అంచలవారిగా నగరాన్ని తలపించేలా సుందరీ కరణ చేసి అభివృద్ధి చేస్తానని అందుకు ప్రజల సహకారం అవసరమని,కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని,ఒక ప్రణాళిక ప్రకారం మున్సిపాలిలో శానిటేషన్ వ్యవస్థ,డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నామని వర్షాలకు వచ్చే వరదకు అనుకూలంగా ప్రధానంగా నూతన డ్రైనేజీ పనులను ప్రారంభించామన్నారు.సుమారు 24 కోట్లతో పరకాల పట్టణ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని,అభివృద్ధి పనులలో పట్టణ ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగచ్చు గాని,భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.అమృత్ పథకం కింద మంచినీటి వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.పట్టణం వరద ముంపు నుంచి కాపాడేందుకు తీసుకోవల్సిన చర్యలతో నివేదిక రూపొందించామన్నారు.గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలన పట్టణ అభివృద్ధి వెనుకబడింది అని,తమ స్వలాభం కోసమే గత ప్రభుత్వ పాలకులు ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అన్నారు.

అంతకుముందు 18వ వార్డులో ఇందిరమ్మఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.14 వ వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయం మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొలిగూరి రాజేశ్వరరావు,కమిషనర్ కే.సుష్మ,ఏఈ రంజిత్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్,మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

20, 21 వార్డులల్లో ఎమ్మెల్యే జీఎస్సార్ పర్యటన…

20, 21 వార్డులల్లో ఎమ్మెల్యే జీఎస్సార్ పర్యటన

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T142416.352-1.wav?_=6

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20, 21 వార్డులు హనుమాన్ నగర్, శాంతినగర్ తదితర వార్డులల్లో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే జీఎస్సార్ పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారి సమస్యలతో కూడిన దరఖాస్తులను ఎమ్మెల్యే కు ఇవ్వగా, వారి సమస్యలను వింటూ కాలనీల్లో కలియతిరిగారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ
ప్రథమ కర్తవ్యం అని ఎమ్మెల్యే అన్నారు. కాలనీలల్లో ముఖ్యంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా, కాలనీలో నెలకొన్న విద్యుత్‌, పారిశుధ్య సమస్యలను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఓసీ – 2 తో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి పలువురి ఇళ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వారికి వెంటనే పరిష్కార మార్గం చూపాలని సింగరేణి జీఎం, ప్రాజెక్టు ఆఫీసర్ కు ఎమ్మెల్యే సూచించారు.
నాగుల పంచమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
మహిళలు అత్యంత పవిత్రంగా కొలిచే నాగుల పంచమి ఈరోజు. ఈ పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నాగదేవ‌త ఆలయాలు, పుట్టల వద్ద మహిళలు పాలుపోయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, భూపాలపల్లి లోని హనుమాన్ ఆలయం లో ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగదేవత విగ్రహానికి పాలు పోశారు. ఆ నాగేంద్రుడి దివ్యమైన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అప్పం కిషన్ తిక్క ప్రవీణ్ దాట్ల శ్రీను ముంజల రవీందర్ కురిమిళ్ళ శ్రీనివాస్ పద్మ తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు

కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగ గ్రామంలో సోమవారం రోజున బుడగ జంగాలకు 10 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన భూపాల పెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోరే ప్రభుత్వమని అందులో భాగంగా బుడగ జంగాలకు పది లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయడం జరిగిందని బుడగజంగాలకు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు, అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని తొందరగా ఇందిరమ్మ లబ్ధిదారులు ఇండ్లను పూర్తి చేసుకోవాలని పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి టేకుమట్ల మాజీ జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో జయ శ్రీ, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల రాజిరెడ్డి బుచ్చిరెడ్డి జయపాల్ రెడ్డి జంపయ్య ఎంపీడీవో పాల్గొన్నారు

పవిత్ర హజ్ పూర్తి చేసుకున్న షేక్ ఫరీద్ ను సన్మానించిన..

పవిత్ర హజ్ పూర్తి చేసుకున్న షేక్ ఫరీద్ ను సన్మానించిన ఎమ్మెల్యే

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T112534.271.wav?_=7

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ – సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు మరియు రైల్వే మాజీ సభ్యుడు అడ్వైజరీ బోర్డు షేక్ ఫరీద్ ఈ సంవత్సరం పవిత్ర హజ్ చేసిన తర్వాత అసెంబ్లీ సభ్యుడు జహీరాబాద్ మాణిక్ రావును జహీరాబాద్ పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా, అసెంబ్లీ సభ్యుడు జహీరాబాద్ మాణిక్ రావు షేక్ ఫరీద్‌ను శాలువా కప్పి పూలమాలలతో సన్మానించి పవిత్ర హజ్ చేసినందుకు అభినందించారు. ఈ సందర్భంగా ఇతరులు కూడా హాజరయ్యారు.

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన..

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ,నేటి దాత్రి ;

భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని మాజీ ఉపసర్పంచ్ కోడెల రాజయ్య కుటుంబాన్ని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం రోజున పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
నేడు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసినారు,
వారి వెంట మండల అధ్యక్షులు అల్లం రవీందర్. వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ చిట్యాల యూత్ అధ్యక్షుడు తవటంనవీన్ టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ పెరుమాండ్ల రవీందర్ పసుపుల శీను కోడేలరాజమల్లు సదానందం రవి రాంబాబు నరేందర్ తాటిపల్లి శీను రజినికాంత్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన…

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే

మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో :27/07/2025 న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం మొగుళ్ళపల్లి లక్ష్మి సాయి గార్డెన్స్ నందు మండల ముఖ్య నాయకులతో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు మరియు కార్యకర్తల సమీకరణ పై సమీక్షా నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే..

ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ …

ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి… ఎమ్మెల్యే మురళి నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన,ఎస్సీ బాలుర హాస్టల్ ను మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీటిని, టాయిలెట్, తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్,బండారు దయాకర్, జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంతి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

కాంతి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్…

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేయండి… ఎమ్మెల్యే మురళి నాయక్…

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంతి హాస్పిటల్ ని గురువారం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన మహబూబాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్, డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి,

సుదూర ప్రాంతాల నుంచి వైద్య నిమిత్తం వచ్చే నిరుపేద వారికి అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని, సామాజిక సేవ సాటి మనిషికి సహాయం చేసే అత్యంత గౌరవప్రదమైన వైద్య వృత్తిలో మరింత అభివృద్ధి చెందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ హాస్పటల్ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్,బండారు దయాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ ,జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

హర్షం వ్యక్తం చేసిన మారుమూల ప్రాంత ప్రజలు

నేటి ధాత్రి చర్ల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం మారుమూల ప్రాంతమైన చర్లలో నూతనంగా ఏర్పాటైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది నేటి నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి గతంలో ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం ప్రజలు అరవై కిలోమీటర్ల దూరం వెళ్లి భద్రాచలం ఆసుపత్రికి వెళ్లేవారు ఇప్పుడు చర్ల లో ట్యూబెక్టమీ సేవలు అందుబాటులోకి రావడంతో చర్ల పరిసర ప్రాంతాల్లోని మహిళలకు చాలా మేలు చేసినట్టయింది
నాడు చర్ల లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరు కి తరలించగా చర్ల గ్రామానికి చెందిన ప్రజలు పర్యటనకి వచ్చిన అప్పటి కలెక్టర్ అనుదీప్ ని కలిసి చర్ల మండల కేంద్రంలో హాస్పటల్ ఉండవలసిన ఆవశ్యత గురించి తెలిపారు వెంటనే కలెక్టర్ ఈ ప్రాంతంలో సిహెచ్ సి హాస్పిటల్ ఏర్పరిచారు నేడు ఈ హాస్పిటల్ కు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు భద్రాచలం ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ చర్ల సిహెచ్సి సి హాస్పటల్ డాక్టర్స్ సిబ్బంది చర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version