ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు…

ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఆశీస్సులు అందించి అభినందనలు తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించిచారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సర్పంచ్‌ కొంగంటి తిరుపతి,ఉపసర్పంచ్‌ కంఠాత్మకూర్ కుమారస్వామి, వార్డుసభ్యులు బుస్సా భాగ్య,గూడూరు నాగరాజు,తడుక రగుపతి,బాయి సంధ్య,కుమ్మరి మౌనిక,బుస్స తిరుపతి,ఆకుల వనిత,ఎడ్ల కిరణ్,గూడూరు జాన్సీ రాణి.
ఈ కార్యక్రమం లో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం మహేందర్, కార్యదర్శి బొమ్మకంటి విజేందర్, గూడూరు మధుకర్,బాయి సుమన్,సీనియర్ నాయకులు కంఠాత్మకూర్ కొమురయ్య, కొత్తూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

కంఠాత్మకూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా సర్పంచ్ కొంగంటి తిరుపతి..

కంఠాత్మకూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా సర్పంచ్ కొంగంటి తిరుపతి

 

నడికూడ,నేటిధాత్రి:

 

గ్రామ అభివృద్దే పరమావధిగా భావించి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా
కంఠాత్మకూర్ గ్రామ ప్రజలు అధికార పార్టీకి ఓటు వేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశారు అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొంగంటి తిరుపతి ని గెలిపించి గ్రామాభివృద్ధికి పట్టం కట్టారు
గ్రామ అభివృద్దే లక్ష్యంగా-గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా అభివృద్ధి అనేది అధికార పార్టీతోనే సాధ్యం
గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తా గ్రామమే నా దేవాలయం గ్రామ ప్రజలే నా దేవుళ్ళు నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామములో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పోలైన 2173 ఓట్లలో గ్రామ ప్రజలు ఓటర్ మహాశేయులు నా పై ఎంతో నమ్మకంతో నాకు 1075 ఓట్లు వేసి 429 ఓట్ల అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి నాకు అఖండ విజయాన్ని అందించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని కంఠాత్మకూర్ గ్రామ నూతన సర్పంచ్ కోంగంటి తిరుపతి అన్నారు. నాకు అఖండ విజయాన్ని అందించిన నా గ్రామ ప్రజలకు ఓటరు మహాశేయులకు పేరుపేరునా కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలుపుతూ,గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

కంఠాత్మకూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొంగంటి తిరుపతి,ఉప సర్పంచ్ కంఠాత్మకూర్ కుమారస్వామి లను గ్రామస్తులు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో పనిచేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో పారదర్శక పాలన, అభివృద్ధి పనుల్లో వేగం తీసుకురావాలని ఆకాంక్షించారు.సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వృధా చేయకుండా వృధా చేయకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.మౌలిక సదుపాయాలు,రోడ్లు, తాగునీరు,పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వ బడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్మానించిన వారు మంత్రపురి రఘుపతి, సదానందం,మేకల చిన్న రవి, రామ్ శంకర్,రాజు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version