సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు.
◆ ఈ నెల 23న జహీరాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిమ్స్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం ప్రారంభం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లో ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పట్టణంలోని అలోల్ పాస్ చౌరస్తా వద్ద హెలిప్మాద్, బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు పనులు చకచకా కొనసాగుతున్నాయి.
సీఎం ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, ఝరాసంగం మండలంలోని కేంద్రీయ విద్యా లయం వద్ద ఏర్పాట్లను సంగారెడ్డి ఎస్సీ పరితోష్పంకజ్ పరిశీలించి పలు సూచనలు. చేశారు. 05వ జాతీయ రహదారి నుంచి బరీ పూర్ వరకు 5లోమీటర్ల మేర నిర్మించిన నిమ్స్ రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. జహీరాబాద్ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు రోడ్లకు మరమ్మతులు చేసి వంతెనలకు రంగులు వేశారు.