ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

నర్సంపేట బ్రాంచ్ జోనల్ లో ప్రథమ స్థానంలో నిలుపాలి

బ్రాంచ్ మేనేజర్ గోపి కిషోర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బ్రాంచ్ మేనేజర్ గోపికిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యాలయ సిబ్బంది,అధికారులు,ఏజెంట్లు, యూనియన్ల ప్రతినిధులతో నిర్వహించిన గణతంత్ర వేడుకలను బ్రాంచ్ మేనేజర్ గోపికిషోర్ జాతీయ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బి.ఎం మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అగ్రస్థానంలో నిలుస్తున్నదని పేర్కొన్నారు.అత్యుత్తమ పాలసీలు,ప్రిమియంలో జోనల్ స్థాయి లెవెల్ లో అగ్రస్థాయిలో నిలిచి నర్సంపేట బ్రాంచ్ గౌరవాన్ని కాపాడాలని ఈ సందర్బంగా మేనేజర్ కోరారు.అనంతరం గంటత దినోత్సవ వేడుకల కాంపిటీషన్లో అర్హులైన ఏజెంట్లను మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ వీ.వీ.వీ సాయి, ఉన్నతాధికారులు లక్ష్మా నాయక్, శ్యాంసింగ్, రాములు నాయక్,సతీష్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఐశ్వర్య,రమేష్,వినోద్,ఎల్ఐసి ఏఓఐ బ్రాంచ్ అధ్యక్షుడు పొనుగోటి సుధాకర్ రావు,liafi వరంగల్ డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్,బ్రాంచ్ అధ్యక్షుడు
రాక రాజలింగం గౌడ్,ఎల్ఐసి ఏఓఐ బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్,ఎల్ఐసి ఏఓఐ జోనల్ నాయకుడు మొద్దు రమేష్,సీనియర్ నాయకుడు వల్లాల శ్రీహరి గౌడ్, మోహన్ రెడ్డి,వీరారెడ్డి,రవి కుమార్,సాంబరాతి శ్రీనివాస్,రాంబాబు,రమణాచారి,రాజేశ్వర్ రావు,ఎల్ఐసి ఏఓఐ మీడియా కార్యదర్శి కందుల శ్రీనివాస్ గౌడ్,బానోతు చందు నాయక్,అమ్రు,బిక్షపతి,పవన్ కుమార్,శ్రీధర్ రాజు,చంద్రమౌళి,సోమయ్య,బాల్య,రామయ్య తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు…

జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు.

నర్సంపేట,నేటిధాత్రి:

ఎల్ఐసి ప్రీమియం లో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన జీఎస్టీని గత 8 సంవత్సరాలుగా ఎల్ఐసిఏఓఐ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేసిన నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసిఏఓఐ ఆర్గనైజేషన్ బ్రాంచ్ అధ్యక్షుడు పోనుగొటి సుధాకర్ రావు అధ్యక్షతన ఏజెంట్లు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్ఐసిఏఓఐ వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పడిదం కట్టస్వామి మాట్లాడుతూ 2017 నుండి జిఎస్టి పట్ల కేంద్ర ప్రభుత్వంపై
ఎల్ఐసిఏఓఐ వివిధ రకాల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని రద్దు చేసిందని పేర్కొన్నారు. పాలసీదారుల లబ్దికోసం అలాగే ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమం కోసం ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.రాష్ట్ర నాయకులు మొద్దు రమేష్,వైనాల శంకరయ్య ,సాంబరాతి శ్రీనివాస్, బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మర్థ గణేష్ ,కార్యదర్శి సుభానుద్దిన్, కోశాధికారి కందికొండ రవికుమార్, చంద్రమౌళి ,డివిజన్ నాయకులు బూర రమేష్ ,శ్రీధర్ రాజు ,అనంత గిరి స్వామి,ప్రచార కార్యదర్శి కుసుంబ రఘుపతి,ముఖ్య సలహాదారు కొమురయ్య ,పురాణి రాంబాబు,సార సాంబశివుడు,కొనకటి స్వామి,అల్లె రాజు,నాంపెల్లి.రాంబాబు,టెంకురాల రాజేశ్వర్ రావు, బాబురావు,వీరస్వామి,భానోతు చందు తదితరులు పాల్గొన్నారు.

ఎల్ఐసి ఏజెంట్లహక్కులు,పాలసీదారుల సంరక్షణ ఏఓఐతోనే..

ఎల్ఐసి ఏజెంట్లహక్కులు,పాలసీదారుల సంరక్షణ ఏఓఐతోనే..

ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య

ఎల్ఐసి ఏఓఐ నర్సంపేట బ్రాంచ్ నూతన కమిటీ సమావేశం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో జరుగుతున్న వివిధ మార్పుల నేపథ్యంలో ఏజెంట్ల హక్కులు,పాలసీదారుల సంరక్షణ ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ తోటే సాదించుకుంటున్నామని ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య తెలిపారు.నర్సంపేట ఎల్ఐసి బ్రాంచ్ ఎల్ఐసి ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) అధ్యక్షుడు పొనుగోటి సుధాకర్ రావు అధ్యక్షతన నర్సంపేట బ్రాంచ్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగింది.ముఖ్య అతిధులుగా
ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య,వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కమటం స్వామి,డివిజన్ కార్యదర్శి పడిదం కట్టస్వామి హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో పోర్టబుల్ విధానం (క్లా బ్యాక్) ను ముందుకు తెచ్చే యోచనలో ఐఆర్డిఏ ఉన్నది. దీనివలన ఏజెంట్ల ప్రయోజనాలకు తీవ్రమైన ముప్పురానున్నదని తెలియజేశారు.ఈ నేపథ్యంలో అవసరమైతే బ్రాంచీలలో
నిరవధిక నిరాహార దీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో 100 శాతం ఎఫ్డీఐ బిల్లును ఆమోదం చేస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.దీంతో ఎల్ఐసి సంస్థ పై ఇతర ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం జరగనున్నదని రాంనర్సయ్య పేర్కొన్నారు.ఎల్ఐసి ఏఓఐతోనే హక్కులు సాదించుకుంటున్న నేపథ్యంలో ఎల్ఐసి ఏఓఐ సభ్యత్వం పెంచుకొని ఎల్ఐసి కార్పొరేషన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేసిన ఫలితంగా ఎల్ఐసి ప్రీమియంలో జీఎస్టీని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 22 న అధికారకంగా సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సుభానుద్ధిన్,కోశాధికారి రవికుమార్,డివిజన్ మాజీ కోశాధికారి, రాష్ట్ర ఈసీ మెంబర్ మొద్దు రమేష్,నర్సంపేట మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పెండ్లి రవి, క్లియా అధ్యక్షుడు రాజబోయిన చంద్రమౌళి రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్,శంకరయ్య ,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు,ఎల్ఐసి ఏఓఐ సభ్యులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న ఎల్ఐసి ఏజెంట్లు

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న ఎల్ఐసి ఏజెంట్లు

నర్సంపేట,నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ సంఘాలుసి బ్రాంచ్ ఏజెంట్లు బ్రాంచ్ అధ్యక్షుడు పెండ్లి రవి అధ్యక్షతన సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నారు., కార్మికవర్గాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా సిఐటియు అనుబంధ సంస్థ ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నర్సంపేట ఎల్ఐఈ ధర్నాలో ఎల్ఐసి ఏఓఐ వరంగల్ డివిజన్ కోశాధికారి మొద్దు రమేష్ గారు మరియు నర్సంపేట బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొనుగోటి సుధాకర్ రావు,గౌరవ అధ్యక్షులు ర్.చoద్రమౌళి,మర్ద గణేష్, నాయకులు కుసుంబ రఘుపతి, కుక్కల వేణు, నెల్లుట్ల అశోక్, నాంపల్లి రాంబాబు, పురాని రాంబాబు, శ్రీధర్ రాజు, సిఐటియు నాయకులు బిక్షపతి,రవీందర్,మల్లేష్,సతీష్, విక్రం, సారంగపాణి,వివేక్,మధుసూదన్,నరేందర్,తదితర ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version