జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు…

జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు.

నర్సంపేట,నేటిధాత్రి:

ఎల్ఐసి ప్రీమియం లో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన జీఎస్టీని గత 8 సంవత్సరాలుగా ఎల్ఐసిఏఓఐ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేసిన నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసిఏఓఐ ఆర్గనైజేషన్ బ్రాంచ్ అధ్యక్షుడు పోనుగొటి సుధాకర్ రావు అధ్యక్షతన ఏజెంట్లు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్ఐసిఏఓఐ వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పడిదం కట్టస్వామి మాట్లాడుతూ 2017 నుండి జిఎస్టి పట్ల కేంద్ర ప్రభుత్వంపై
ఎల్ఐసిఏఓఐ వివిధ రకాల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని రద్దు చేసిందని పేర్కొన్నారు. పాలసీదారుల లబ్దికోసం అలాగే ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమం కోసం ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.రాష్ట్ర నాయకులు మొద్దు రమేష్,వైనాల శంకరయ్య ,సాంబరాతి శ్రీనివాస్, బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మర్థ గణేష్ ,కార్యదర్శి సుభానుద్దిన్, కోశాధికారి కందికొండ రవికుమార్, చంద్రమౌళి ,డివిజన్ నాయకులు బూర రమేష్ ,శ్రీధర్ రాజు ,అనంత గిరి స్వామి,ప్రచార కార్యదర్శి కుసుంబ రఘుపతి,ముఖ్య సలహాదారు కొమురయ్య ,పురాణి రాంబాబు,సార సాంబశివుడు,కొనకటి స్వామి,అల్లె రాజు,నాంపెల్లి.రాంబాబు,టెంకురాల రాజేశ్వర్ రావు, బాబురావు,వీరస్వామి,భానోతు చందు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version