ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం

ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం.

మందమర్రి నేటి ధాత్రి :

 

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
గొల్లెం మల్లేష్ నూతన గృహప్రవేశం ఫంక్షన్లో లో మిగిలిన
ఆహారాన్ని పడేయద్దని ముఖ్య ఉద్దేశంతో.
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం ఇవ్వడం జరిగింది….

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్పందించి ఆ మిగిలిన ఆహారాన్ని మందమర్రి బస్టాండ్ దగ్గర నివసిస్తున్న పేదవారికి మరియు మందమర్రి రైల్వే స్టేషన్ ఏరియా లో ఆ ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం అధ్యక్షుడు నది పాట రాజ్ కుమార్ మాట్లాడుతూ.
అలాగే ఏక్కడ ఏ ఆహార పదార్థాలు మిగిలిన మాకు సమాచారం ఇస్తే మేమే వచ్చి తీసుకుపోయి పేదలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చరణ్, జవీద్ ,దిలీప్ తదితరులు పాల్గొన్నారు..

అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి..

మాజీ మైనారిటీ అధక్షులు అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి

ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మండల అధ్యక్షులు కట్కూరు దేవేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన మైనారిటీ యువకుల గ్రీన్ టైగెర్స్ క్రికెట్ టీంనకు మాజీ మైనారిటీ అధ్యక్షుడు ఎండి అలీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షలు కట్కూరి దేవేందర్ రెడ్డి అతిధులుగా హాజరై జెర్సీలు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం సభ్యులతో పరిచయ కార్యక్రమం చేసుకొని క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి ఆడి ఆటను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగారాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,ఉడుత సంపత్,దొమ్మటి దాసు,డాక్టర్ రోహిత్,వెంకటేష్ రాకేష్ లు పాల్గిన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version