రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి..

రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి

సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులుపలుస శంకర్ గౌడ్ పిలుపు

వనపర్తి నేటిదాత్రి

.జిల్లాప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో రక్తదాన శిబిరం లో బండారు శ్రీనివాస్ రక్తాన్ని దానము చేశారు ఈ కార్యక్రమం లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడాతూ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని శ్రీనివాస్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు అరుణకుమారి సీనియర్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ నర్సింగ్ సూపర్ ఇంటెండెంట్ అవెంజలిన్ రత్తనిది ఉద్యోగులు సంతోష్ మరియు లక్ష్మీ గారు పద్మ
సులోచన
.పాల్గొన్నారని శంకర్ గౌడ్ ఒకప్రకటన లో తెలిపారు

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్యమే మహాభాగ్యమని తల్లి శిశు ఆరోగ్య టీకాలు పారిశుభ్రత పై దృష్టి అవసరమని ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచన ఇచ్చారు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుబాటులో సేవలు తెచ్చిందని వ్యాధి నివారణకు అవగాహన కీలకమని ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఏ వ్యాధి కైనా గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు మాట్లాడారు
ఈ కార్యక్రమంలో డాక్టర్స్ హాస్పిటల్ స్టాప్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం…

నర్సంపేట మహిళ కారాగారంలో వైద్య శిబిరం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టంలోని మహిళా ప్రత్యేక కారాగారంలో ఉచిత వైద్య శిబిరం సబ్ జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి ఆధ్వర్యంలో చేపట్టారు.కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న,రిమాండ్ మహిళ ఖైదీలకు,జైలు సిబ్బందికి వైద్య పరీక్షలు, నిర్వహించారు.అలాగే రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి మాట్లాడుతూ కారాగారంలో ఉన్న వివిధ రకాల గల ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బీపీ,షుగర్,ఇతర రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.స్రవంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ భావన,ల్యాబ్ టెక్నీషన్ నవీన్,సూపర్వైజర్ పుండరీబాయి,హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య,జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.

మహిళ కారాగారంలో వైద్య శిబిరం..

మహిళ కారాగారంలో వైద్య శిబిరం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టంలోని మహిళా ప్రత్యేక కారాగారంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం ఆ సబ్ జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి ఆధ్వర్యంలో చేపట్టారు.కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న,రిమాండ్ మహిళ ఖైదీలకు,జైలు సిబ్బందికి వైద్య పరీక్షలు, నిర్వహించారు.

అలాగే రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కె.స్రవంతి మాట్లాడుతూ కారాగారంలో ఉన్న వివిధ రకాల గల ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బీపీ,షుగర్,ఇతర రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.స్రవంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ భావన,ల్యాబ్ టెక్నీషన్ నవీన్,సూపర్వైజర్ పుండరీబాయి,హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య,జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.

నెక్కొండ మండలంలో వైద్య శిబిరం…

నెక్కొండ మండలంలో వైద్య శిబిరం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల వైద్యాధికారి డా. సుమన్ ఆధ్వర్యంలో గొల్లపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 115 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేపట్టగా, 11 మందికి రక్త నమూనా పరీక్షలు నిర్వహించారు.
అదేవిధంగా గ్రామంలో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించి, ‘ఫ్రైడే డ్రై డే’ పాటించేలా ప్రజలను అప్రమత్తం చేశారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులు అయిన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి సమస్యలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యుడు డా. రాహుల్, హెల్త్ అసిస్టెంట్లు రవిచంద్ర రెడ్డి, నాగలక్ష్మి, ఆశ కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్ష,కళ్ల జోళ్లు పంపిణీ…

పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్ష,కళ్ల జోళ్లు పంపిణీ

నడికూడ,నేటిధాత్రి:

 

వరికోల్ అభివృద్ధి ప్రదాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మండలంలోని వరికోల్ గ్రామంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికోసం పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 28 తారీకు ఆదివారం రోజున
మెగా మెడికల్ క్యాంప్ ఉచిత కంటి చికిత్స పరీక్షలు, కళ్ళజోల్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామమంతా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పోచంపల్లి ఫౌండేషన్ సభ్యులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొని కంటిచూపు పరీక్షలు విజయవంతం చేసుకోవాల్సిందిగా ర్యాలీ నిర్వహించారు.

హజ్రత్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ దర్గా 767వ జాతర

దర్గా హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ 767 ఉత్సవాలు ఘనంగా జరిగాయి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండల్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహీర్ దక్కన్ 767 దర్గా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. దర్గాకు గంధం, స్వీట్లు, పండ్లు, చెద్ధర్ కప్పి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించారు. పీర్ల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, దువాలు నిర్వహించగా, సమస్త ప్రజల శాంతి, అభ్యుదయానికి ప్రార్థనలు చేశారు.
జాతర సందర్భంగా దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అన్నదాన కార్యక్రమం, నీరు, వైద్య శిబిరం వంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై చేరి ఈ పుణ్యోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.
భక్తి, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ జాతర శోభాయమానంగా సాగింది. ✨
ఈ కార్యక్రమంలో దర్గా వారసులు గఫ్ఫర్ బై,, మొహమ్మద్ వజీర్ అలీ ,,మహమ్మద్ ఇమ్రాన్,, అబ్దుల్ సత్తార్ నిజాయితీ మహమూద్ రహీం పెద్దగుళ్ల నారాయణ మాదినం శివప్రసాద్ కొండాపురం నరసింహులు మాజీ సర్పంచ్ బీ వీరేశం ప్యార్ల దశరథ్ తదితరులు పాల్గొన్నారు

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు…

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోనే దత్తక్షేత్రాలలో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి ఈ నెల 4న దత్తజయంతి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దత్తజయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పర్యవేక్షణలో ఈనెల 2, 3, 4 తేదీల్లో 21 యజ్ఞగుండాలతో దత్తయజ్ఞాలు, శ్రీచండీ హోమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు అవధూతగిరి మహారాజ్, సిద్దేశ్వరనందగిరి

పేర్కొన్నారు. యజ్ఞాల కోసం ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తుల తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం పచ్చటి పందిళ్లు, తాగునీరు, భోజన వసతి, భక్తులకు దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ మందిరం, జ్యోతిర్లింగాల మండపం, ఆత్రేయ మహర్షి, అనసూయ, గోమందిరం, రేణుకామాత మందిరాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు. వైద్యాధికారి డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

కొల్లూరులో ఉచిత కంటి పరీక్షల శిబిరం:

కొల్లూరులో ఉచిత కంటి పరీక్షల శిబిరం:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సుమిత్ర ఐ కేర్ హాస్పిటల్ జహీరాబాద్ వారి అధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం కొల్లూరు గ్రామ పంచాయితీ ఆవరణలో ఏర్పటు చెయ్యడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ సీహెచ్ రాజ్ కుమార్, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు దిగంబర్,మలగరి బాలప్ప, మొగుడంపల్లి విష్ణు,డప్పూర్ రాములు,కుమ్మరి దశరథ్, మరియు హాస్పిటల్ సిబ్బంది,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,వృద్ధులు పాల్గొన్నారు…ఇట్టి కార్యక్రమములో కంటి సమస్యలు ఉన్నవారికి కంటి పరీక్షలు చేసారు.

జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం..

జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 

మహాదేవపూర్, నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్.పిఓ డి.రమేష్ ఆధ్వర్యంలో 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తోబేగ్లూర్ గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ఎన్ఎస్ఎస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖులందరూ విద్యార్థి దశలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి పౌరులుగా మంచి విద్యా వేతలుగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఎస్ ఎస్ఎస్పీఓ ఏడు రోజులు ఈ గ్రామంలో హరితహారం మెడికల్ క్యాంపు స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రత ఫ్రైడే సర్వే ఓటర్స్ డే ర్యాలీ పలు రకాలైనటువంటి సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఈ ఏడు రోజుల శిబిరంనీ ఉద్దేశిస్తూ వాలంటరీస్ కి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటిరోజులో భాగంగా మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్య కోపరేటివ్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ రాణి బాయి మహాదేవపూర్ ఎంఈఓ ప్రకాష్ కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం రెడ్డి మాజీ ఎంపిటిసి పద్మ ఓదెలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు సమ్మయ్య కర్ణ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది

హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం….

హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం

మొబైల్ ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి:

 

ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గ్రామ స్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి హెచ్ ఐవి ఎయిడ్స్, టిబి, సిఫిలిస్, హెచ్ బీ ఎస్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ట వివక్ష చూపవద్దని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని, వ్యాధిగ్ర స్తులకు అందించే చికిత్స గురించి తెలియజేశారు. హెచ్ఐవి వస్తే ఏఆర్ టి ద్వారా మందులు వాడి నిజజీవితాన్ని గడపవచ్చు. ప్రతి గర్భవతి దగ్గర ఉన్న ఐసీటీసీ సెంటర్ కు వెళ్లి హెచ్ఐవి పరీక్ష చేయించు కోవాలి.ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినందన్ రెడ్డి, ఏఎన్ ఎం సునీత, కుమార స్వామి, సిఎల్ డబ్ల్యూ స్వప్న, వీరన్న, మైలారం వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

పాత బాకీలు తీర్చడంతోనే..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T134821.930.wav?_=1

 

పాత బాకీలు తీర్చడంతోనే..
సమయం సరిపోతుంది.
• గత ప్రభుత్వం అప్పుల కుప్ప తెచ్చిపెట్టింది.
• ఇచ్చిన మాట తప్పిన గత ప్రభుత్వం!

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత ప్రభుత్వం చేసిన పాత బాకీలు తీర్చడంతోనే సమయం సరిపోతుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం లీల గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. గత ప్రభుత్వ హయాంలో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి మరెన్నో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మోసపూరిత మాటలపై అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తోనే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాయకులు కొమ్మాట బాబు, నజీరుద్దీన్, మారుతి, లక్ష్మా గౌడ్ తదితరులు ఉన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

 

డాక్టర్ జి.సంజీవరావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

కరకగూడెం:మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,మారుతి నర్సింగ్ కాలేజ్,లయన్స్ క్లబ్ భద్రాచలం సహకారంతో సికింద్రాబాద్ వారిచే పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ జి.సంజీవరావు పాల్గొని 250 మందిని కంటి పరీక్షలు చేయగా అందులో 60 మందికి శాస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు.అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్భంగా డా,, సంజీవరావు మాట్లాడుతూ… ఏజెన్సీలోని మారుమూల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప నిర్ణయమని,ప్రజల నుండి మంచి విశేష స్పందన ఉందన్నారు.ఏజెన్సీ ప్రాంతంలోని పేదవారికి ఈ సంస్థ వారు మరెన్నో సేవలందించాలని వారు కోరారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను,సంయుక్త సంస్థ వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు డా,,ఎస్ఎల్ కాంతారావు,రాజిరెడ్డి,ఆదినారాయణ,సూర్యనారయణ,గ్రామస్తులు:గొగ్గల నారాయణ,ఈసం సమ్మయ్య,ఈసం సత్యం,కొమరం లక్ష్మీనర్సు,జోగ దూలయ్య,రామక్రిష్ణ,మారుతి కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు ప్రాంతంలో నరువి హాస్పిటల్ సేవలు….

చిత్తూరు ప్రాంతంలో నరువి హాస్పిటల్ సేవలు

హార్ట్ అండ్ న్యూరాలజీ స్పెషలిస్ట్స్ మెడికల్ క్యాంప్

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్

 

 

చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నరువి హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పించబడింది. దీని కోసం వైద్య శిబిరం ఈరోజు ప్రారంభించబడింది. చిత్తూరు ప్రీతం హాస్పిటల్ మరియు వెల్లూరు
నరువి హాస్పిటల్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి.
చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు నరాల సంబంధిత రోగులు చికిత్స కోసం వెల్లూరు నరువి ఆసుపత్రికి వచ్చే సమయం మరియు ఖర్చును తగ్గించడానికి, నరువి హాస్పిటల్ వైద్య నిపుణులు చిత్తూరులో నేరుగా చికిత్స అందించగలిగేలా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
వేలూరు నరువి హాస్పిటల్ చిత్తూరు ప్రీతం హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరం నేటి నుండి చిత్తూరు ప్రీతం హాస్పిటల్‌లో ప్రారంభమైంది. ఈ శిబిరం నెలకు రెండుసార్లు నిరంతరం ఈ ఆసుపత్రిలో జరుగుతుంది.
ప్రీతమ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్, నర్వి హాస్పిటల్ కార్డియాక్ సర్జన్లు డాక్టర్ వినాయక్ శుక్లా,డాక్టర్ రే జార్జ్ మరియు నరంబిల్ సర్జన్ డాక్టర్ లోకే రోగులను పరీక్షించి చికిత్స చేస్తారు. వేలూరు
లోని నరువి హాస్పిటల్‌లో శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం ప్రీతమ్ హాస్పిటల్‌లో జరిగింది. నరువి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరవణన్ రామన్,డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ రే జార్జ్,డాక్టర్ లోకేష్ మరియు ప్రీతమ్ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము…

స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లాలో ఆరోగ్య మహిళ ఆరోగ్యవంతమైన కుటుంబము స్వశక్తి నారి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మందమర్రిలో ప్రత్యేక వైద్య శిబిరమును డాక్టర్ సుధాకర్ నాయక్ ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేసినారు ఈ వైద్య శిబిరంలో 172 మంది నమోదు చేసుకున్నారు ఈ శిబిరంలో డాక్టర్ అతుల్ ఫిజీషియన్ డాక్టర్ శిల్ప కంటి వైద్య నిపుణులు డాక్టర్ మానస స్త్రీ వైద్య నిపుణులు ఎమ్మెల్యే సీలు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది

ఈ ప్రత్యేక వైద్య శిబిరములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత ఆధ్వర్యంలో చేస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య నిపుణుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చేపట్టడం రోగుల వివరములను ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా పరీక్షలు చేయించడం మందులను చికిత్సలు అందించడము రిఫరల్ కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది ముఖ్యంగా ఈ ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమము అసంక్రమణ వ్యాధులు బిపి డయాబెటిస్ క్యాన్సర్ల నిర్ధారణ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు కీటక జనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి పరబలకుండా చర్యలు చేపట్టడం అవగాహన కలిగించడం జరిగినది ముఖ్యంగా పిల్లలకు టీ తాగిపించడం సరైన సమయంలో సరైన వయసులో ఇవ్వడం టీవీ ద్వారా రోగులను గుర్తించి వారికి పోషకాహార కిట్టులు అందజేయడం జరుగుతుందని అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మానస సిబ్బంది శ్రీ సత్తయ్య సి హెచ్ ఓ బుట్ట వెంకటేశ్వర్ జిల్లా మాస్ మియాధికారి పాల్గొన్నారు

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల వైద్య శిబిరం…

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షల నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది విద్యార్థినులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు, టాబ్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి.హెచ్. రఘు, మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, రోహిణి, నిహారిక, పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరి ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-80-1.wav?_=2

కబడ్డీ,రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు

నర్సంపేట,నేటిధాత్రి:

జాతీయ క్రీడా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా కలెక్టర్,క్రీడాశాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారిని టీవీఏల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియం లో సోమవారం కబడ్డీ రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్జిఎఫ్ఐ సెక్రెటరీ సోనబోయిన సారంగపాణి,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, నర్సంపేట జోన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండి నర్సయ్య గౌడ్,సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు నర్సంపేట మండల కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లూరి స్వామి గౌడ్,డాక్టర్ సాదిక్, కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

లక్ష్మారెడ్డి పల్లిలో ఉచిత వైద్య శిబిరం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42-2.wav?_=3

లక్ష్మారెడ్డి పల్లిలో వైద్య శిబిరం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో గురువారం చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి శ్రీదేవి ఆదేశాల మేరకు లక్ష్మి రెడ్డి పల్లి సబ్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా గ్రామస్థులకు బీపీ, షుగర్, థైరాయిడ్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ,రక్త పరీక్షలు నిర్వహించి మందులు అంద చేశారు.
ఈ శిబిరంలో సూపర్వైజర్ కృష్ణవేణి,విజయలక్ష్మి,ఏఎన్ఎం పార్వతి,ఆశా వర్కర్లు జెమున,విమల,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-3-5.wav?_=4

సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి..

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుంది…

మందమర్రి జిఎం దేవేందర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి సంస్థలో పనిచేసే అధికారుల, కార్మికుల, వారి కుటుంబ సభ్యుల, రిటైర్డ్ కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సాధించిందని కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికుల సౌకర్యార్ధం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు జిఎం తెలిపారు. అనంతరం జిఎం దేవేందర్ మాట్లాడారు.

Singareni Focus on Workers’ Health

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పై దృష్టి సారిస్తూనే కార్మికుల ఆరోగ్యం పై సైతం యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, కార్మికుల ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల నుండి కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్, గ్యాస్ట్రో వైద్య నిపుణులను రామకృష్ణాపూర్ ఆస్పత్రికి ప్రత్యేకంగా రప్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షలలో సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక వైద్యం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఫిట్ సెక్రటరీలు నాగేంద్ర బట్టు, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తంగళ్ళ పల్లి.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T153006.739.wav?_=5

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తంగళ్ళ పల్లి.
ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

తంగళ్ళపల్లి మండల లో. ఇందిరమ్మ కాలనీ యందు. తేదీ 14 .8. 25 రోజున. ఇందిరమ్మ. పరిపాలనలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా. కాలానుగుణంగా. వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత . పరి శుభ్రతపై. అవగాహన మంది ప్రజలకు. . 150 మందికి స్కానింగ్ లు.ప్రతి ఒక్కరికి స్కానింగ్. చేసి 25. మందికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు అందరికీ మందు ల.పంపిణీ చేయడం జరిగింది. ఇంటింటికి డ్రై. డే. నిర్వహించడం జరిగిందని. అలాగే.. లార్వాన్ స్ప్రే చేయడం జరిగినది. నీటి నీ.లువలను. గుర్తించి ఆయిల్ బాల్స్. ను. వేయడం జరిగిందని . కూలర్లు మరియు డబ్బాలను. పరిశీలించి నీటిని పడవేయడం జరిగిందని ఇట్టి వైద్య శిబిరంలో. డాక్టర్ దీప్తి. హెల్త్. సూపర్వైజర్ .కే ప్రమీల. ఏఎన్ఎం ప్రమీల. జ్యోతి. సతీష్ కుమార్. ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ కార్యదర్శి. అనూష. పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version