స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము…

స్వశక్తి నారి అభియాన్ వైద్య శిబిరము

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లాలో ఆరోగ్య మహిళ ఆరోగ్యవంతమైన కుటుంబము స్వశక్తి నారి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మందమర్రిలో ప్రత్యేక వైద్య శిబిరమును డాక్టర్ సుధాకర్ నాయక్ ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేసినారు ఈ వైద్య శిబిరంలో 172 మంది నమోదు చేసుకున్నారు ఈ శిబిరంలో డాక్టర్ అతుల్ ఫిజీషియన్ డాక్టర్ శిల్ప కంటి వైద్య నిపుణులు డాక్టర్ మానస స్త్రీ వైద్య నిపుణులు ఎమ్మెల్యే సీలు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది

ఈ ప్రత్యేక వైద్య శిబిరములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత ఆధ్వర్యంలో చేస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య నిపుణుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చేపట్టడం రోగుల వివరములను ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా పరీక్షలు చేయించడం మందులను చికిత్సలు అందించడము రిఫరల్ కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది ముఖ్యంగా ఈ ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమము అసంక్రమణ వ్యాధులు బిపి డయాబెటిస్ క్యాన్సర్ల నిర్ధారణ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు కీటక జనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి పరబలకుండా చర్యలు చేపట్టడం అవగాహన కలిగించడం జరిగినది ముఖ్యంగా పిల్లలకు టీ తాగిపించడం సరైన సమయంలో సరైన వయసులో ఇవ్వడం టీవీ ద్వారా రోగులను గుర్తించి వారికి పోషకాహార కిట్టులు అందజేయడం జరుగుతుందని అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మానస సిబ్బంది శ్రీ సత్తయ్య సి హెచ్ ఓ బుట్ట వెంకటేశ్వర్ జిల్లా మాస్ మియాధికారి పాల్గొన్నారు

హనుమకొండలో ఆరోగ్య కేంద్రాల పరిశీలన…

హనుమకొండ జిల్లా పట్టణ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

 

 

 

 

హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య ఈరోజు పట్టణ పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు.
లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో టీబీ చికిత్స పొందుతున్నవారికీ దాతల సహకారంతో పోషకాహార కిట్ల ను అందించడం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్యనీ స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరికీ చికిత్స కాలంలో ఆరు నెలల వరకు పోషకార కిట్ లను అందించడానికి ముందుకు వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి మేరీ కరుణను ఆయన అభినందించారు. ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు , రెడ్ క్రాస్,మనూస్ స్వచ్ఛంద సంస్థలు పోషకాహారకిట్లు అందిస్తున్నాయని, అలాగే తనతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది కూడా ముందుకు రావడం అభినందించ తగ్గదని ఆయన అన్నారు. డాక్టర్ హిమబిందు (1)వంగర వైద్యాధికారి డాక్టర్ ముతిర్ రెహమాన్ ( 2 ), నేరేడుపల్లి పల్లె దవఖాన వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ (4 ) , హెల్త్ సూపర్వైజర్ పి విప్లవ కుమార్ ( 5) వెంకటేశ్వర్లు(1) పోషకాహార కిట్లను అందిస్తున్నారని అన్నారు.
లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించి చికిత్స నిమిత్తం వచ్చిన వారితో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు అలాగే వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు..కాలనీ లో పాత సామాను దుకానం లో నీరు నిలువ ఉన్న వస్తువు లను తొలగించాలని కోరారు. కొన్ని గృహాలను సందర్శించి వివరాలు ఇతర ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
శాయంపేట పట్టణ ఆరోగ్యకేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్శించారు. ఇప్పటివరకు 27 మందిని పరీక్షించినట్లు అందులో ఐదుగురికి రక్తపరీక్షలు సేకరించినామని అలాగే ఒకరిని మరిన్ని పరీక్షల నిమిత్తం రెపర్ చేసినట్లు గుర్తించడం జరిగింది.
ఇందులో అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ డి మదన్ మోహన్ రావు జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు డాక్టర్ హైదర్ డాక్టర్ మౌనిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు ,ఆశాలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version