చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

 

చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణం లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ల్ హాల్ లో ఆర్కే హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో పల్లె పల్లె కి వైద్య కార్యక్రమం లో భాగంగా చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 123వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు వైద్య శిబిరం నిర్వహించినందుకు చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ తోటి సామాజిక కార్యక్రమాలు చేయాలి. మా తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే  ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న చావా ఫౌండేషన్ కి మా ఫౌండేషన్ తరపున మా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక స్నేహితుడు లాగా ,వ్యక్తిగా సహాయం చేస్తా పదవి అనేది శాశ్వతం కాదు, కానీ మన వ్యక్తిత్వం సేవ చెయ్యాలని గుణం పుట్టిన నాటి నుండి మరణించే వరకు ఉంటుంది కానీ పదవి ఉండదు అన్నారు.

చెరువు నిండితేనే… పంటలు పండేది…

చెరువు నిండితేనే… పంటలు పండేది

చూస్తే వానలే.. చెరువు పూర్తిగా నిండలే

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కేంద్రంలోని దేవుని చెరువు నిండితేనే పంటలు పండు తాయి దేవుని చెరువు క్రింద ఉన్న పంట పొలాల దుస్థితి చెరువు వర్షం నీటి ఆధారంగా నిండుతుంది కానీ ప్రస్తుత చెరువు సగం మాత్రమే నిండింది. చెరువు నిండక పోతే భవిష్యత్తులో పంటల పరిస్థితి ఏమిటన్న బెంగ! దీంతో పంట పొలాలకు నీరు సరఫరా చేసేందుకు చాలా ఇబ్బందిక రంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వాతా వరణ మార్పుల ద్వారా వర్షం పడితే నిండిన సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ దేవుని చెరువుకు వర్షపు నీరు చెరువు లోకి రాక నిడటం లేదు.

 

వర్షా లు కురవడంతో మండలం లోని చాలా చెరువులు మత్తడి పోస్తున్నాయి కానీ దేవుని చెరువుకు ఆధారం లేక నిడటంలేదు. చెరువుకు వచ్చే వరద రాక ఎస్సారెస్పీలో నీరు పడి వృధాగా పోతున్న వర్షపు నీరు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని చెరువు మత్తడి పోసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పాలకులు ఆ వైపుకు దృష్టి సాధించడం లేదు. దీంతో పొలాల రైతులు నీటి కొరత ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

అధికారులు స్పందించాలి

శాయంపేట మండల రైతు ముసికే అశోక్

మండలంలోని దేవుని చెరువు కింద పంట పొలాలు సుమా రుగా 600 ఎకరాలు సాగుతు న్నాయి. చెరువుకు ఏటా నీటి రావడం కోసం తిప్పలు పడు తున్నాం. వర్షపు నీరు చెరువు లోకి రాకుండా ఎస్సారెస్పీ కాలువలో పడి వృధాగా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టించుకోని పని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version