పవన్ ఇంటికి చంద్రబాబు.. అసలు విషయమిదే..

 పవన్ ఇంటికి చంద్రబాబు.. అసలు విషయమిదే..

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వైరల్ ఫీవర్‌ (Viral fever)తో ఇబ్బంది పడుతున్న పవన్‌ను పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి, తన శాఖలపై సమీక్షలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌‌కు వైద్యం అందించారు. వైద్యులకు చూయించిన జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చూయించుకున్నట్లు సమాచారం. ఇంకా జ్వరంతోనే ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ని పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సాయి కృష్ణ సూచించారు ఇటీవల కురు స్తున్న భారీ వర్షాలతో ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు లేకుండా చూసు కోవాలని నీరు నిలిచిన ప్రాంతా ల్లో ఈగలు దోమలు చెరి అనారోగ్యాల పాలవుతారని కచ్చి తంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు ప్రస్తుతానికి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్ దగ్గు జలుబు స్కిన్ ఇన్ఫెక్షన్లు విరోచనాలు వాంతులు రక్త కణాలు తగ్గడం లాంటి సమస్యలతో హాస్పిటల్ కు రోగులు వస్తున్నట్లు తెలి పారు ప్రజలు సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు

బాబోయ్‌ ఫీవర్‌.. చెన్నైలో పెరుగుతున్న జ్వరాల వ్యాప్తి…

బాబోయ్‌ ఫీవర్‌.. చెన్నైలో పెరుగుతున్న జ్వరాల వ్యాప్తి

చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాల్లో కొద్దిరోజులుగా జ్వరాలు ప్రబలు తున్నాయి. జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారు అధికమవుతున్నారు. రాజధాని నగరం చెన్నైలో మాత్రమే జ్వరంతో బాధపడుతూ సుమారు 1,000 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

: చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌(Chennai, Chengalpattu, Kanchipuram, Tiruvallur) జిల్లాల్లో కొద్దిరోజులుగా జ్వరాలు ప్రబలు తున్నాయి. జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారు అధికమవుతున్నారు. రాజధాని నగరం చెన్నైలో మాత్రమే జ్వరంతో బాధపడుతూ సుమారు 1,000 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా తదితర జ్వరాల వ్యాప్తి అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో కొద్దిరోజులుగా సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు వర్షం, పగటి వేళల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటూ వాతావరణం తరచూ మారుతుండడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.

ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు, చలి జ్వరాలకు చికిత్సలు పొందినా వెంటనే నయం కావడం లేదు. కొంతమందికి రెండు వారాలకు పైగా ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి ఉంటున్నాయి. వాతావరణం మార్పులతో వ్యాప్తి చెందుతున్న ఈ జ్వరాల బారిన వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు అధికంగా బాధపడుతున్నారు. ఈ విషయమై వైద్య నిపుణులు మాట్లాడుతూ… నగరంలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్‌ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని, ప్రస్తుతం 70 శాతానికి పైగా ‘ఇన్‌ఫ్లుయింజా’ జ్వరం వ్యాప్తి ఉందన్నారు.

అలాగే, డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. అడపాదడపా వర్షాలు కురిస్తే మంచినీటిలో వృద్ధి చెందే ‘ఎడిస్‌’ దోమల పెరుగుదల అధికమయ్యే అవకాశముందన్నారు. ప్రజలు తమ ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఆకు కూరలు, పండ్లు, వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, మాస్క్‌ ధరించడం వంటి చర్యల ద్వారా వైరల్‌ జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్…

వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

 

 

డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.

 సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జర్వంతో చనిపోయిన మహేష్ (35), శ్రవణ్ కుమార్ (15) అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిమ్మాపూర్ గ్రామంలో 40 నుండి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక.. గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని.. తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version