19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం…

19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం

ప్రజలకు అందుబాటులో ఉంటా-అభ్యర్థి ఏకు బాబు (బొబ్బిలి)

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని మున్సిపాలిటీ 19వ వార్డ్ టిఆర్ఎస్ అభ్యర్థి ఏకు బొబ్బిలి(బాబు) ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈ ప్రచారంలో ఇన్చార్జిలు బొట్ల శ్రీను,దోమల శ్రీనివాస్ వార్డు అధ్యక్షులు ఏకు కార్తీక్ లు మాట్లాడుతూ 27 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థ ఎలక్షన్ లో ప్రచార నిర్వహించే నైతిక హక్కు లేదని అంకెల గారడి తో ప్రజలను మోసం చేస్తున్నారని మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జలాలుద్దీన్,సాదిక్,బండి శ్రావణి,బొచ్చు రాజు,ఏకు ప్రవీణ్,ఏకు శివతేజ,కొమ్ముల మహేష్,ఒంటేరు రాకేష్,ఏకు వంశీ మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version