ఆశాస్త్రీయంగా వార్డుల విభజన..

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన
అధికార పార్టీకి లాభం చేకూర్చే విధంగా అధికారుల పనితీరు
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్దన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన ఆశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిన గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని చెప్పి అటువంటి ఏమి చేపట్టకుండా మళ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్న అటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా వార్డుల విభజన చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.

 

గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని సైతం ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించకుండా మరియు ఒకే వ్యక్తికి ఒకే వార్డులో రెండు ఓట్లు ఉన్నా కూడా వాటిని కూడా సవరణలు చేయకుండా లిస్టులు విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకొని వార్డులను శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. మడత రాజేష్. గోరు కంటి అనిల్ పాల్గొన్నారు.

గిరిజన సహకార సంస్థలో అవినీతి అక్రమాల పర్వం..

గిరిజన సహకార సంస్థలో అవినీతి అక్రమాల పర్వం

* పట్టపగలే గోదాముల ముందు అమ్మకాల దందా
* పట్టించుకుని సంబంధిత ఉన్నతాధికారు

మహాదేవపూర్ జూలై 28 (నేటి ధాత్రి)
గిరిజనులను ప్రైవేటు వ్యాపారుల దోపిడి నుండి రక్షించాలని, గిరిజనులతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు వస్తుసేవలను అందించాలనే బృహత్తర లక్ష్యంతో ఏర్పడిన గిరిజన సహకార సంస్థ అవినీతికి అక్రమాలకు నిలయంగా మారింది. సంక్షేమ హాస్టళ్లకు సరుకులు సప్లై చేస్తామని జిసిసి చెప్పడంతోటే ప్రైవేటు టెండర్లు రద్దుచేసి జిసిసికి కాంట్రాక్టును కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. జిసీసీ నుండి వచ్చిన సరుకులను మహాదేవపూర్ లో జిసిసి గోదాం అధికారులు పట్ట పగలే గోదాముల ముందు సరుకులను ఏదేచ్చగా అమ్ముతూ మరి కొంత సరుకులను హోల్ సేల్ దుకాణా దారులకు ఇష్టం వచ్చినట్లు కమిషన్ రూపం లో అమ్ముతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ఇదేం పనులు చేస్తున్నారు అని కొందరు వ్యక్తులు అడుగగా ఎవ్వరు ఏమి చెయ్యలేరు అని, ఎవ్వరికి చెప్తావో చెప్పుకో అని నేనొక్కడినే ఈ సొమ్ము తింటలేనని అందరి అధికారులకు ముట్టచెప్పుడే అని మాట్లాడటం విశేషం. గోదాముల దగ్గరనే సరుకులు మాయం కావడంతో హచ్చర్య పోతున్న మండల ప్రజలు హాస్టళ్లకు చేరక విద్యార్థులు ఏం తింటున్నారో ఏమి పెడుతున్నారో తెలియడం లేదని వాపోతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైన ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ, సామాన్య ప్రజల సొమ్మును కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

హెచ్‌సీఏ అక్రమాలు.. రంగంలోకి ఈడీ

హెచ్‌సీఏ అక్రమాలు.. రంగంలోకి ఈడీ

గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ.800 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. కోట్ల రూపాయలు ఉన్న హెచ్‌సీఏ అకౌంట్‌ను కూడా సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వచ్చాయి.

హైదరాబాద్, జులై 18: హెచ్‌సీఏ అక్రమాలపై (HCA Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) దృష్టి సారించింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్టేడియం టెండర్ల నుంచి మొదలుకుని టికెట్ల విక్రయం దాకా అన్నింటిలో గోల్‌మాల్‌ జరిగినట్లు బయటపడింది. గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ.800 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. కోట్ల రూపాయలు ఉన్న హెచ్‌సీఏ అకౌంట్‌ను కూడా సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వచ్చాయి. 2022లో జస్టిస్ లావ్ నాగేశ్వర్ రావ్ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్లలలో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారణ అయ్యింది. ఈ వ్యవహారంపై గతంలోనే హెచ్‌సీఏ సభ్యులను ఈడీ విచారించింది.

తాజాగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావ్ కూడా ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. హెచ్‌సీఏలోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరికి ఎంత ఇచ్చారో అన్న విషయాలన్నింటినీ ఈడీ తేల్చనుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా టెండర్ల విషయంలోనూ సొంత వాళ్లకే ప్రయోజనాలు చేకూరేలా జగన్‌ వ్యవహరించినట్లు తేలింది. ఫుడ్ క్యాటరింగ్, స్టేడియం లో స్టాల్స్, టికెట్స్ కేటాయింపులోనూ తన వారికే కట్టబెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు హెచ్‌సీఏలో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడీ గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో హెచ్‌సీఏ సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడీ గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఈ క్రమంలో 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు బయటపడింది. క్రికెట్ బాల్స్ టెండర్ల, జిమ్ సామాను టెండర్లు, స్టేడియం కుర్చీలు టెండర్‌లు తమకు కేటాయించినందుకు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు బయటపడింది. మాజీ హెచ్‌సీఏ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ భార్య పేరు మీద జేబీ జ్యువెలర్స్‌ ఖాతాలోకి లంచం డబ్బుల జమ అయినట్లు ఈడీ గుర్తించింది.

కాగా.. హెచ్‌సీఏ అక్రమాల కేసులో జగన్ మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ రాజేందర్ ‌యాదవ్,‌ ఆయన భార్య శ్రీచక్ర క్రికెట్‌క్లబ్‌ అధ్యక్షురాలు కవితను ఈ నెల 9న సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వారిని ఆరో రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించడంతో సీఐడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అలాగే హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై సీఐడీ ఎఫ్ఐఆర్, నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా నిన్న (గురువారం) ఈసీఐఆర్‌ను ఈడీ నమోదు చేసింది.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మహిళలు
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

ఇల్లందకుంట మండలంలోని సిరిసెడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయి అంటూ కాంగ్రెస్ లీడర్లు పైసలకు అమ్ముకుంటున్నారంటూ అర్హులను వదిలిపెట్టి అనరులకు మరియు కాంగ్రెస్ నాయకుల దగ్గర వాళ్లకు కేటాయించారని రోడ్డుపై బయటాయించి ధర్నాకు దిగారు కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు

అక్రమాలకు అందా ఏజెన్సీ సర్కార్ భూముల సంతర్పణ.

 

ఏజెన్సీ లో భుదాందా
అక్రమాలకు అందా ఏజెన్సీ

సర్కార్ భూముల సంతర్పణ

నూగుర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ) మార్చి 4 ములుగు జిల్లా వెంకటాపురం మండలం

ఆదివాసి సంక్షేమ పరిషతమంగళవారం నాడు వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు హాజరై మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70,పీసా చట్టాలకు వ్యతిరేకంగా వెంకటాపురం (Z) సర్వేనెం 4/1,4/2,68,69 ప్రభుత్వ భూములను కబ్జా చేసి క్రయాయిక్రయాలు చేస్తూ భూదందా కి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.ఏజన్సీ చట్టాలను, కఠినంగా అమలు చేయాల్సిన ప్రభుత్వ రెవిన్యూ ఆఫీసర్లు నాటి సర్కార్ పెద్దలు కుమ్మక్కై ప్రభుత్వ భూములను కబ్జా చేసి భూదందాకు తెరలేప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా బహుళ అంతస్తులు నిర్మిస్తుంటే వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ,రెవెన్యూ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంకటాపురం (Z) సర్వే నెంబర్లలో సమగ్ర విచారణ జరిపి కబ్జాకు పాల్పడిన గిరిజనేతరులపై ఎల్.టి.ఆర్ కేసులు నమోదు చేసి ఆ ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూములేని నిరుపేద ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, బొగ్గుల రాజ్ కుమార్, సంపత్, పూనెం అర్జున్, నవదీప్ తదితరులు

 పాల్గొన్నారు.

 

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version