37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని 37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సిరిసిల్ల టౌన్ మే 22 (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37 వ వార్డులో ని ఈ రోజున ఉదయం 10-30 సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సహాయ నిధి (CMRF)నుండి స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సహాయ సహకారంతో 37.వ పరిధిలో గల లబ్దిదారులైన బూర్ల ప్రతాప్ 24000/- రూపాయలు దాసరి కళావతి విఠల్ 6500/-
రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ లను వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగినది.ఈ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు కి తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు మరియు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు..

వార్డులో సమస్యలు పరిష్కరించాలి .

వార్డులో సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి :

 

 

వార్డులో డ్రైనేజీలు క్రమ క్రమంగా తీయక దుర్వాసన వస్తుందని,ఇంటింటికి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించాలని,నల్లాల ద్వారా ఇంటింటికి క్రమం. తప్పకుండా నీళ్లు అందే విధంగా చూడాలని,వీధిలైట్లు వెలుగని చోట వెలిగేలా చూడాలని,ఎండకాలం దృష్ట్యా బోరింగులు రిపేరు ఉన్న దగ్గర ఎప్పటికప్పుడు రిపేర్లు చేపించాలని,వీధులన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని, దోమల మందు ఫాగింగ్ చేపించాలని,డ్రైనేజీల వెంట బ్లీచింగ్ చల్లించాలని మున్సిపాలిటీలోని ఒకటో వార్డు ప్రజల సౌకర్యార్థం వార్డును పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

ప్రతి వార్డు నుండి కదలి రావాలి కదం తొక్కుతూ.

ప్రతి వార్డు నుండి కదలి రావాలి కదం తొక్కుతూ.

శనిగరం శ్రీనివాస్ ఎస్సీ సెల్ పరకాల పట్టణ అధ్యక్షుడు

పరకాల నేటిధాత్రి

చరిత్రలో నిలిచేలా రజతోత్సవం గ్రామగ్రామాన పండుగ వాతావరణం
ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు, పట్టణాలు
దేశంలోనే అతిపెద్దగా సభగా రికార్డు సృష్టించే అవకాశం ఈ సభను విజయవంతం చేయాలి,ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభకు సుమారు 1,300 ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయని పరకాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శనిగరం శ్రీనివాస్ తెలిపారు.పరకాల పట్టణంలో వారు మాట్లాడుతూ ఈ సభకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలను తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో పట్టణం లోనీ 18వ వార్డు లో స్థానిక భారాస నాయకులతో కలసి సభ వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు ఈ సభ నభూతో నభవిష్యత్ అనే విధంగా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సభ కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, ఇది ఒక విశాల సంకల్పానికి సాంకేతమని, ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు దారి చూపే దిశగా ప్రజల నడిపించే ప్రయత్నం చేసే సభ అని పేర్కోన్నారు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు సోమవారం 18వ వార్డులో ప్రజలకు సభ గురించి చైతన్యం కల్పించారు.ఏ గ్రామంలో చూసినా ఏప్రిల్‌ 27న ఎల్కతుర్తిలో జరిగే తెలంగాణ ఇంటి పార్టీ రజతోత్సవ వేడుకల గురించే చర్చ జరుగుతున్నదని రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎల్కతుర్తి సభ రికార్డు సృష్టిస్తుందని శనిగరం శ్రీనివాస్ పేర్కొన్నారు.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

 

 

శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యకరమంలో భాగంగా మున్సిపాలిటీలో ని 14వ వార్డులో మాజీ కౌన్సిలర్ మర్క ఉమాదేవి రఘుపతి ఆధ్వర్యంలో మాజీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అమీనా,కొక్కిరాల స్వాతి,విజయ్,అశోక్,ఎండి నజియ,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version