మహా న్యూస్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలి

మహా న్యూస్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలి

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంద శ్యామ్ సుందర్ ఆరోపణ

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శ

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ అవమానకర ప్రసారాలు నిర్వహిస్తున్న మహా న్యూస్ తెలుగు టీవీ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంద శ్యామ్ సుందర్ ఆరోపించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ మరియు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.గత మూడు రోజులుగా “డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి కొడుకులు మంచి వాళ్లా, చెడ్డ వాళ్లా” అనే విధంగా స్క్రోలింగ్లు, ప్రసారాలు నిర్వహిస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమాలు మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయని ఆరోపించారు.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరిన నేపథ్యంలో రాజకీయ కక్షతో ఆయనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంద శ్యామ్ సుందర్ అన్నారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన నాయకుడైన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మహా న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు ఎండీ వంశీ కృష్ణపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, అవమానకర ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్ ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఒంటరు చక్రి, పుష్పత్తులయ, మరపెళ్లి మనోజ్, శనిగరం శ్రీనివాస్, జన్ను హరికృష్ణ, తేళ్లూరి సురేష్, దుడేలా సిద్దు, కొగిలా కిరణ్, మోట్ల మౌనిక, రాజేశ్వరి, అంబాల చింటూ, గుర్రం సుశ్రుథ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు “సీక్రెట్ ఫ్రెండ్‌షిప్” అంటూ నడిచిన గుసగుసలకు…

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు “సీక్రెట్ ఫ్రెండ్‌షిప్” అంటూ నడిచిన గుసగుసలకు…
ఒక్క కేసు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
అవును…

బండి భగీరథ్ పోక్సో కేసు ఇప్పుడు కేవలం లీగల్ కాంట్రవర్సీ కాదు…
తెలంగాణ రాజకీయాల “పవర్ మ్యాప్”నే మార్చేసిన టర్నింగ్ పాయింట్‌గా మారింది.

ఇప్పటివరకు “కాంగ్రెస్‌ను ఆపాలంటే… భవిష్యత్తులో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎక్కడో ఒక సైలెంట్ అండర్‌స్టాండింగ్ కుదురిందన్న ప్రచారం సారింగి.

ఎందుకంటే…
కేసీఆర్, కేటీఆర్‌ బీజేపీపై దాడి చేసినా…
ఫోకస్ ఎక్కువగా రాష్ట్ర నేతలపైనే ఉండేది.
ఢిల్లీ లీడర్‌షిప్‌పై పూర్తి స్థాయి వార్ మాత్రం కనిపించేది కాదు.
అక్కడే రాజకీయ కారిడార్లలో ఒక థియరీ వైరల్ అయింది.
“బయటకు ఫైట్… లోపల సెటిల్‌మెంట్…” అని.

కానీ…
బండి భగీరథ్ కేసు తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది.
ఈసారి బీఆర్ఎస్ కేవలం స్పందించలేదు…
పూర్తి స్థాయి పొలిటికల్ అటాక్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.
కేటీఆర్ నేరుగా బండి సంజయ్ మంత్రి పదవినే టార్గెట్ చేయడం…
గులాబీ కేడర్ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ నిరసనలకు దిగడం…
బీజేపీకి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది.
“ఇక్కడ పొత్తుల పాలిటిక్స్ కాదు… పవర్ వార్ మొదలైంది” అని.
ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్గెస్ట్ షిఫ్ట్‌గా మారింది.
ఎందుకంటే…
ఇప్పటివరకు బీజేపీ బీఆర్ఎస్‌పై చూపించిన మెత్తటి వైఖరి…
ఇక కనిపించకపోవచ్చనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ విక్టరీ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న కమలం…
ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
అందుకే ఇప్పుడు బీజేపీ లెక్క ఒక్కటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
“కాంగ్రెస్‌ను ఓడించాలంటే ముందు బీఆర్ఎస్‌ను వీక్ చేయాలి.”
ఎందుకంటే…
గ్రామ స్థాయిలో ఇంకా బలమైన కేడర్…
ఎమోషనల్ కనెక్ట్…
స్థిరమైన ఓటు బ్యాంక్…
ఇవన్నీ ఇప్పటికీ గులాబీ పార్టీ దగ్గరే ఉన్నాయి.
అందుకే ఇప్పుడు అసలు టార్గెట్ కాంగ్రెస్ కాదు…
బీఆర్ఎస్ అవుతుందనే చర్చ బలపడుతోంది.
మరోవైపు కాంగ్రెస్ కూడా సైలెంట్‌గా తన గేమ్ ఆడుతోంది.
బీఆర్ఎస్ నుంచి కేడర్‌ను…
స్థానిక నాయకత్వాన్ని…
గ్రౌండ్ ఓటును తనవైపు తిప్పుకునే ఆపరేషన్ వేగవంతం చేసింది.
అంటే ఇప్పుడు గులాబీ పార్టీపై డబుల్ అటాక్ స్టార్ట్ అయినట్టే.
ఒకవైపు కాంగ్రెస్ “పొలిటికల్ షిఫ్ట్” ప్లాన్ చేస్తుంటే…
మరోవైపు బీజేపీ “లీగల్ అండ్ స్ట్రాటజిక్ ప్రెషర్” పెంచే దిశగా అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య సైలెంట్ అవగాహన ఉందనే ప్రచారం…
ఇప్పుడు పూర్తిగా కూలిపోయింది.
అంటే ఇకపై తెలంగాణలో…
“ఫ్రెండ్లీ ఫైట్” కాదు…
ప్యూర్ పొలిటికల్ బ్యాటిల్ చూడబోతున్నామన్న మాట.
దీంతో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు దాదాపు ఖాయమైపోయింది.
కాంగ్రెస్… బీజేపీ… బీఆర్ఎస్…
మూడు పార్టీలు కూడా ఇప్పుడు “సర్వైవల్ మోడ్”లోకి వెళ్తున్నాయి.
కానీ అసలు ప్రశ్న ఒక్కటే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎవరు క్యాష్ చేసుకుంటారు..?
బీజేపీ-బీఆర్ఎస్ ఒకరినొకరు దెబ్బతీసుకుంటే లాభం కాంగ్రెస్‌కేనా..?
లేక… ఈ హై వోల్టేజ్ వార్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు పుడతాయా..?
ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ధర్నా

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ధర్నా

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆయన కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, పరిసర మండలాల అధ్యక్షులు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజ వెంకట రాజన్న మాజీ జెడ్పిటిసి కోడి అత్తయ్య, మాజీ ఎంపీపీ మానస పడగల రాజు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

అదే సమయంలో మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణి గోపి ఆధ్వర్యంలో కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతసేపు వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇరువర్గాలతో మాట్లాడి వారిని శాంతింపజేసి పరిస్థితిని సర్దుమణిగేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలు అత్యంత సున్నితమైనవని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు.అలాగే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలు, ప్రజా విశ్వాసం కాపాడే నాయకత్వం అవసరమని, ప్రజల్లో ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు.

నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి: టీజేఎస్

*మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితున్ని అరెస్టు చేయాలి:

సీనియర్ అడ్వకేట్ టిజెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్

నర్సంపేట, నేటిధాత్రి:

మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శనివారం నర్సంపేటలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, దేశభక్తి, దైవభక్తి, మహిళలపై గౌరవం గురించి బహిరంగ సభలు, ప్రెస్ మీట్‌లలో గొప్పగా చెప్పుకునే బీజేపీ నాయకులకు బండి సాయి భగీరథ దుర్మార్గం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని మైనర్ బాలికలను వేధించే క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గౌరవం ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన చేతిలో అధికారం ఉన్నంతవరకు బాధిత బాలికకు న్యాయం జరగదని అన్నారు. బాధితురాలు అత్యాచారానికి గురైన రోజు మైనర్ కాబట్టి ఇది సెక్షన్ 65(2) బీఎన్ఎస్, సెక్షన్ 6 పోక్సో చట్టం కింద నేరం అవుతుందని స్పష్టం చేశారు.బాధితురాలి ప్రస్తుత వయస్సు కాకుండా నేరం జరిగిన రోజు వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారు. ఈ కేసులో కోర్టు, రాష్ట్ర పోలీసుల తీరు సరిగా లేదని విమర్శించారు. సాధారణ ప్రజలపై ఇలాంటి కేసులు ఉంటే ఎన్‌కౌంటర్ పేరుతో హత్యలు చేసే ప్రభుత్వం బండి సాయి భగీరథ కేసులో మాత్రం అరెస్టు చేయడం లేదని ఆరోపించారు.బండి సంజయ్ కుమార్‌కు మహిళలపై గౌరవం ఉంటే తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఈప్రెస్ మీట్‌లో టీజేఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంతి..

కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంతి బండి సంజయ్ కుమార్ ను నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోవాలా

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం, నేటిధాత్రి

శుక్రవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ కెసిఆర్ కేటీఆర్ మెప్పు కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌసిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోవాలా లేక మరోసారి మాట్లాడకుండా బాడితే పూజ చెయ్యాలో పాడి కౌశిక్ రెడ్డి కి మద్దతుగా మాట్లాడుతున్నా అగ్గిపెట్టె హరీష్ రావు చెప్పుతే బాగుంటదని అన్నారు అదేవిదంగా బి ఆర్ ఎస్ నాయకుడు ఎమ్మెల్యే కావడానికి బిడ్డను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి గెలిసిన నాటి నుండి నేటి వరకు గొడవ పెట్టుకొని పార్టీ కానీ రోజు కానీ ఉన్నదా అన్నారు ఏదైనా సమావేశం పెట్టిన పాడి కౌశిక్ రెడ్డి గొడవలు సృటించి కెసిఆర్ కేటీఆర్ మెప్పుకోసం ఎవ్వరితో పడితే వారితో గొడవలు పెడితే అందరు ఊరుకోరు అనేది బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాడి కౌసిక్ రెడ్డి లాంటి చిల్లర రాజకీయ నాయకులకు చెప్పవలసిన భాద్యత కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావే భాద్యత అవించాలని అన్నారు అదేవిదంగా కెసిఆర్ కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు నేరెళ్ల సంఘటన కానీ సిరిసిల్ల పెద్దపల్లి అడ్వా్కేట్ దంపతులను హత్యలు చేసిన చరిత్ర బి ఆర్ ఎస్ ప్రభుత్వం కదా అన్నారు అధికారం లో ఉండగా భూ కబ్జాలు ప్రతి పక్ష పార్టీ లు లేకుండా అక్రమ కేసులు పెట్టిన తెరాస నాయకులు నేడు పాడి కౌసిక్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల ను ఇతర పార్టీ నాయకుల పై మాట్లాడించి ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని కెసిఆర్ కేటీఆర్ లాంటి నాయకులు చూస్తున్నారని అన్నారు అదేవిదంగా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు ప్రజల సమస్యలను పక్కకు నెట్టి క్రిస్టియన్ ముస్లిం ఓట్ల కోసం బీజేపీ పార్టీ నాయకులపై చిల్లర మాటలు మాట్లాడుతూనే హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరామ చంద్రుని పైకూడా రాజకీయాలు చేసుకుంటూ హిందువులను కించపరుస్తున్నారని అన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేధావులు హిందూ బందువులారా ఒక్కసారి అలోచించి అర్ధం చేసుకొని క్రిస్టియన్ ముస్లిం ఓట్ల కోసం హిందూ దేవుళ్లను కించపరస్తూన్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ కాంగ్రెస్ ను భూష్టాపీతం చేద్దాం మన ఆస్తిత్వాన్ని మనం కాపాడు కోవలసిన భాద్యత హిందూ బంధువుల అందరిపై ఉన్నదాని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత అన్నారు

బీసీ మహిళా మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ

బీసీ మహిళా మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్లపల్లి నేటి దాత్రి

బీసీ మహిళా మంత్రిగా..అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి..కోట్లాది రూపాయల నిధులతో దేవాలయాలను అభివృద్ధి చేస్తూ..రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించేలా కృషి చేస్తున్న మహిళా ఫైర్ బ్రాండ్..బీసీల ముద్దుబిడ్డ..ఓరుగల్లు రుద్రమదేవిగా పేరు ప్రఖ్యాతలు గడించిన మంత్రి కొండా సురేఖమ్మ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించి, బీసీలపై విషం కక్కుతుందని, హిందువులంటే కేవలం బ్రాహ్మణులే కాదని, బీసీలు కూడా ఉన్నారని బీజేపీ గ్రహించాలని, బీసీ మహిళా మంత్రి కొండా సురేఖమ్మ తెలంగాణలో దేవాలయాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే..బీజేపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం వరంగల్ లో జరిగిన రైతు మేళాలో మంత్రి కొండా సురేఖమ్మ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ పార్టీ మీటింగులు పెట్టి జైశ్రీరామ్ అనడం తప్ప..రాష్ట్రంలోని దేవాలయాలకు గానీ, రాష్ట్ర అభివృద్ధికి గానీ ఒక్క పైసా నిధులు కేటాయించకపోవడం, రాష్ట్ర ఆలయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ..ఇతర రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తూ..వివక్ష చూపుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తే..ఆ మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించడమంటే..బీసీలపై బీజేపీకి ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ..బీసీలను బలహీన పరచడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బ్రాహ్మణ భావజాలం కలిగిన కమలనాధులు బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగాల పరంగా ఎదగకుండా కుట్రలు చేస్తుందని, జన గణనలో బీసీ కుల గణన చేపట్టకుండా, జనాభా దామాషా ప్రకారం చట్ట సభలలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుందని, ఈ కుట్రలను బీసీ సమాజం చూస్తూ సహించబోదని, బీసీ సమాజమంతా ఏకమై బీజేపీని కాలగర్భంలో కలపడం ఖాయమని మహేందర్ గౌడ్ స్పష్టం చేశారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత బాధాకరం..

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత బాధాకరం

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి

పరకాల,నేటిధాత్రి

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ రామున్ని,జై శ్రీరామ్ నినాదాన్ని ఎగతాళి చేయడం తెలంగాణ ప్రజల భావోద్వేగాలను అవమానించడమేనన్నారు.ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం ఒక ప్రజాప్రతినిధికి తగదని దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు.మంత్రి కొండా సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని,రామ భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ధర్మాన్ని అవమానిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరుపతి అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఖండన

 

Congress Leaders Strongly Condemn Remarks on Uttam Kumar Reddy

 

కోదాడ: రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పిల్లుట్ల రఘు చేసిన వ్యాఖ్యలను కోదాడ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

గుడిబండ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామిరెడ్డి, ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్ బోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారని, హుజూర్నగర్ మరియు కోదాడ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.

2160 ఇళ్ల నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధిని చూడలేని వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించిన నాయకులు, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

కేసీఆర్ తోనే ఢీ!

కేసీఆర్ తోనే ఢీ!

 

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన క‌విత.. నిన్న మొన్న‌టి కేటీఆర్, హ‌రీష్‌రావుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ తండ్రి, బీఆర్ ఎస్ పార్టీ అదినేత కేసీఆర్‌ను మాత్రం ప‌క్క‌న పెట్టారు. ఆయ‌న జోలికి పెద్ద‌గా వెళ్ల‌లేదు. వెళ్లినా.. ప‌రోక్షంగా మాత్ర‌మే స్పందించారు. కానీ.. పార్టీ ఆవిర్భావానికి స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో క‌విత త‌న పంథాను పూర్తిగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్‌ను ఏమీ అన‌కుండా.. తాను ఎన్ని రాజ‌కీయాలు చేసినా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని భావించారో లేక‌.. కేసీఆర్ వంటిబ‌ల‌మైన నాయ‌కుడితో త‌ల‌ప‌డితే త‌ప్ప‌.. త‌న ప్ర‌త్యేక‌ రాజ‌కీయాలు దారిలో ప‌డ‌వ‌ని అనుకున్నారో కానీ.. ఏకంగా ఇప్పుడు కేసీఆర్ సెంట్రిక్‌గానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

జ‌గిత్యాల‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ను కార్నార్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను క‌విత త‌ప్పుబ‌ట్టారు. బీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు ఓడించార‌ని అన‌డంపై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌లను త‌ప్పుబ‌డుతున్న కేసీఆర్‌.. వాస్త‌వాల‌ను ఇప్ప‌టికీ తెలుసుకోవ‌డం లేదేన్నారు. అధికారంలో ఉండ‌గా.. ప్ర‌జ‌ల మ‌ద్య‌కు ఎప్పుడైనా వ‌చ్చారా? అని ఆమె నిల‌దీశారు. అంతేకాదు.. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌పై ఏనాడైనా స‌మీక్ష‌లు చేశారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నార‌ని ఎద్దేవా చేయ‌డం ద్వారా.. కేసీఆర్‌కు చుర‌క‌లు అంటించారు.

అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు ఛాన్స్‌లేద‌ని.. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌ర‌ని చెప్ప‌డం ద్వారా నేరుగా కేసీఆర్ అస్తిత్వాన్ని దెబ్బ‌తీసేలా క‌విత ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వానికి తెలంగాణ ఉద్య‌మాన్ని.. మ‌హిళ‌ల‌ను.. కేసీఆర్ ప్ర‌స్తావించారు. ఈ విష‌యాల‌నే క‌విత టార్గెట్ చేసుకోవ‌డం ద్వారా.. త‌న తండ్రితోనూ తాను త‌ల‌ప‌డ‌గ‌ల‌న‌ని.. స్ప‌ష్టం చేశారు. మొత్తంగా.. మంగ‌ళ‌వారం నాటి మీడియా స‌మావేశంలో ఇత‌ర అంశాలు ఎలా ఉన్నా.. కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా.. త‌న రాజ‌కీయ అడుగులు ఎలాగైనా ప‌డ‌తాయ‌న్న సందేశాన్ని క‌విత స్ప‌ష్టం చేశారు.

రైతు పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోము

రైతు పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోము

– ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా గౌరవంగా ఆహ్వానించాము
– వీలైతే రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి
– మీడియా సమావేశంలో ఖండించిన ఏఎంసీ చైర్మన్ స్వరూప, రైతులు, కాంగ్రెస్ నేతలు

సిరిసిల్ల ప్రతినిధి(నేటి ధాత్రి):

 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాలలో తాము ఎలాంటి ప్రోటోకాల్ ని ఉల్లంఘించలేదని, కావాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ ను వెంట పెట్టుకుని వచ్చి దూర్భాషలాడుతూ, దౌర్జన్యాలకు దిగి, రచ్చ చేశారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప ఆరోపించారు. రైతులు డైరెక్టర్లతో కలిసి శుక్రవారం సిరిసిల్ల క్లబ్ లో వెల్ముల స్వరూప మీడియా సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆమె భర్త జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల చర్యలను తీవ్రంగా ఖండించారు. పెద్దూరు, ముష్టి పెళ్లి, చంద్రంపేట, రగుడు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా నిర్ణీత సమయాన్ని కంటే గంటన్నర ఆలస్యంగా సుమారు 100 మంది మార్బలంతో మద్యం సేవించి వచ్చి ప్రోటోకాల్ ఉల్లంఘించారని తాము రానిదే ఎలా ప్రారంభిస్తారని దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారని అన్నారు. వేసవి ఎండలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారని అయినప్పటికీ మెప్మా అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ కోసం వేచి చూశారని, ఆలస్యంగా వచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ కు టెంకాయ ఇచ్చి కొట్టమని ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకున్నారని తెలిపారు. అయినప్పటికీ చైర్పర్సన్ భర్త బీఆర్ఎస్ నాయకుడు విచక్షణ రహితంగా బూతులు మాట్లాడారని, తమ మాటలు వినిపించుకోకుండా వ్యవహరించారన్నారు. ఏఎంసీ చైర్మన్ ను కూడా టెంకాయ కొట్టనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ కార్యక్రమాలలో చైర్మన్ భర్తకు ఏమి సంబంధం ఉందని, ఇలా రైతులు మహిళలు ఉండగా దౌర్జన్యానికి దిగారన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ కూడా రైతుపై దౌర్జన్యానికి దిగాడని, బూతు పురాణం ప్రారంభించాడని ఆరోపించారు. ఒకవైపు వర్షాలు పడి కల్లాల వద్ద ధాన్యం తడిసి రైతులు నష్టపోయి ఏడుస్తుంటే వారి పట్ల సహాయక చర్యలు చేపట్టకుండా రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. విలీన గ్రామాల ప్రజలు వీరి చర్యలను గమనించాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ తనకు తల్లి లాంటి స్థానంలో ఉన్నారని తాను ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా గౌరవంగా ఆహ్వానించినప్పటికీ ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. తాము చదువుకున్న వారం కనుక విచక్షణతో వ్యవహరించామని, పార్టీ కౌన్సిలర్ పై చేయి కూడా ఎత్తారని ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను 10 సంవత్సరాల పాటు మద్యం తాగిస్తూ పోషించారని, కానీ తమకు కూడా కార్యకర్తలు ఉన్నారని, 10 మంది కార్యకర్తలు ఉన్నా వారు విచక్షన కార్యకర్తలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిన తాము అడ్డుకోలేదని, రైతుల పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోబమని, రైతుల జోలికి వస్తే బాగుండదని స్వరూప హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎలుక తిరుపతి, దుబాల వెంకటేశం, మార్గం లక్ష్మణ్, బూర దశరథం, పిస్క మదు, ఆడెపు జగన్, ఖాజా, కోడం అరుణ, మెరుగు శేఖర్, .స్వర్గం రాజు, కూరపాటి శ్రీశైలం, పరశురాములు, నక్క నరసయ్య, శైలజ, శ్రీనివాస్ రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..ఒంటేరు చక్రి

తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..ఒంటేరు చక్రి

హన్మకొండ, నేటిధాత్రి:

https://youtu.be/mcDL0nNP5s0?si=v0NCLlrD99MLD5Tk

తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ ఇటీవల తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ ల విభజన లాగ జరిగిందని అవివేకం తో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ పోరాటాల ద్వారా ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనం అని దేశానికి ఒక స్పూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన అలాంటి ఒక గొప్ప పోరాటాల స్ఫూర్తిని చిన్నతం చేస్తూ మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.పోరాట,ఉద్యమ స్పూర్తి లేని బీజేపీ నాయకులకు ఏం తెలుసు తెలంగాణా ప్రజల మనోభావాలు,బేషరతు గా తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాల్సిందే అని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.

కవిత మైండ్ గేమ్!ఫస్ట్ టార్గెట్ రెడీ!

కవిత మైండ్ గేమ్!ఫస్ట్ టార్గెట్ రెడీ!

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు కారు పార్టీకి కవచంలా ఉన్న ఆమె.. ఇప్పుడు అదే కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు.

బీఆర్ఎస్ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు. అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాను కొత్త పార్టీని పెడుతున్నానని ప్రకటించిన కవిత… తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్సేనని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తనను కలిశారని ఆమె చెప్పారు. అయితే తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని తాను ఇప్పుడప్పుడే వెల్లడించబోనని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ మాజీలు తనను కలుస్తూనే ఉన్నారని ఆమె తెలిపారు. తాను పార్టీని ప్రకటించగానే… తనను కలిసిన బీఆర్ఎస్ నేతలంతా తన పార్టీలోకే వస్తారని కూడా ఆమె తెలిపారు.

ఇక తన సోదరుడు, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి కూడా ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేస్తానని ఇటీవలే కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన కవిత… అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం లేకపోయేసరికి ప్రజలు గుర్తుకు వచ్చారని, ఈ క్రమంలో ఆయన ప్రజలను కలుసుకునేందుకు పాదయాత్ర అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు.

ఇక రాజకీయాల్లో తన తొలి ప్రత్యర్ధి బీఆర్ఎస్సేనని చెప్పిన వైనానికి గల కారణాలను కూడా కవిత తనదైన శైలిలో వివరించే యత్నం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కారణంగానే తాను తన తొలి రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను ఎంచుకున్నానని తెలిపారు. ఈ విషయంలో తనలో ఎలాంటి మార్పు రాబోదని ఆమె వెల్లడించారు. ఈ నెల 25న తన పార్టీ పేరుతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తానని కవిత గత నెలలోనే ప్రకటించారు. మరి కవిత పార్టీ ప్రారంభం అయిన తర్వాత బీఆర్ఎస్ ఎంతగా ఇబ్బంది పడుతుందన్నది చూడాలి.

ఉత్తరాదిపై దక్షిణాది విజయం!బిల్లు ఎలా వీగింది..

ఉత్తరాదిపై దక్షిణాది విజయం!బిల్లు ఎలా వీగింది?

డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం యావత్తు దేశాన్ని తట్టి లేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటంటే… ఉత్తరాది ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతూ దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా జరుగుతున్న ఎన్డీఏ ఎత్తులన్నీ చిత్తు అయ్యాయయన్నదే ఆ విశ్లేషణ సారాంశం.

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ఎన్డీఏ ఆలోచనతో ఒక్కసారిగా పెద్ద చర్చకే తెర లేసింది. జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాదిలో లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందని, అదే సమయంలో ఇప్పటికే అధిక సంఖ్యలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లోక్ సభ సీట్ల సంఖ్య మరింగా పెరుగుతందన్న ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే… కేంద్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకునే పార్టీలు ఇకపై దక్షిణాది రాష్ట్రాల్లోని లోక్ సభ సీట్లతో సంబందం లేకుండానే తమ పని ముగించుకుంటాయన్న వాదనా వినిపించింది. వెరసి దక్షిణాది రాష్ట్రాలకు అసలేమీ ప్రాధాన్యం దక్కదని, నిధుల విడుదలలో భారీ అంతరం చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదని నిపుణులు విశ్లేషించారు.

గురు, శుక్రవారాల్లో జరిగిన చర్చల్లో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకూ తీరని నష్టం జరుగుతుందన్న వాదనను వినిపించారు. ఈ క్రమంలో విపక్షాల్లోని దక్షిణాది భయాందోళనలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి… జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ను చేయడం లేదని చెప్పింది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత లోక్ సభ స్థానాలకు అదనంగా 50 శాతం సీట్లు పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే ఆ విషయాన్ని మాటమాత్రంగా కాకుండా బిల్లులో లిఖితపూర్వకంగా చేపట్టాలని విపక్షాలు కోరాయి. 

ఆ తర్వాత జరిగిన ఓటింగ్ లో విపక్షాలకు చెందిన సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేసినా… మూడొంతుల్లో రెండు వంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ సీఎంలు ఎంకే స్టాలిన్, ఎనుముల రేవంత్ రెడ్డిలు హర్షం ప్రకటించారు. వెరసి ఉత్తరాది వాదనపై దక్షిణాది విజయం సాధించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తించాయి.

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ఎండి.జాఫర్ రిజ్వి కాంగ్రెస్ సీనియర్ నాయకులు

పరకాల,నేటిధాత్రి

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ రిజ్వి జాఫర్ తీవ్రంగా ఖండించారు.ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దీర్ఘకాల ప్రజా ఉద్యమం,త్యాగాలు కారణమనిగుర్తుచేశారు.అలాంటి చారిత్రక ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని,అలాంటి సందర్భాల్లో మౌనం అనర్హమని పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని కాపాడే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని పేర్కొన్న ఆయన, బీజేపీ నాయకత్వం ఈ అంశంపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు

అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ ఎస్ పార్టీ…

అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ ఎస్ పార్టీ

సిరిగిరి సురేష్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్

కొత్తగూడ,నేటిధాత్రి:

గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మహాత్యులు ధనసరి అనసూయ సీతక్క గారి పై వస్తున్న అవినీతి ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నవని
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కొట్టిపారేశారు. పారదర్శకమైన పాలన అందిస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు మరియు బిఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు స్వార్థ ప్రయోజన శక్తులు పనిగట్టుకొని మంత్రి సీతక్క పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వారు మండిపడ్డారు.
వాస్తవాలు ఇవే..నిరాధారమైన ఆరోపణలు: ఏ ఒక్క ఆధారమూ లేకుండా కేవలం మాటలతో నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది.పారదర్శక టెండర్లు ప్రభుత్వంలో ప్రతి పైసా ఖర్చు డిజిటల్ రూపంలో, పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ ద్వారానే జరుగుతోంది. ఇందులో అవినీతికి తావులేదు.ప్రజల మద్దతు క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. ఈ విజయాలను చూసి భయపడే ఇలాంటి తప్పుడు కథనాలుసృష్టిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తప్పవు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, మంత్రి సీతక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం
అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.మేము చేసే ప్రతి పని ప్రజల సాక్షిగా, చట్టబద్ధంగానే జరుగుతోంది. ఇలాంటి గాలి వార్తలను ప్రజలు ఎవర నమ్మరని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఇకనైనా బుద్ది మర్చికొని అభివృద్ధి లో భాగం కావాలని లేని యెడల ప్రజలే వచ్చే ఎన్నికలో తగిన బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు…..

మున్సిపల్ చైర్మన్ షాపు దగ్గర రోడ్డు ఆక్రమణ…

మున్సిపల్ చైర్మన్ షాపు దగ్గర రోడ్డు ఆక్రమణ

రోడ్ల విస్తరణ కు అడ్డు పడుతున్నారు

మార్నింగ్ వాకింగ్ లో రోడ్ల విస్తరణ పై ఎమ్మెల్యే ప్రజలకు హామీ

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర మున్సిపల్ చైర్మన్ షాపు దగ్గర దాదాపు 10 ఫీట్ల స్థలం ఆక్రమించు కొని వారు వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు జెరగకుండా పదవిని హోదా అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం సారి కాదని జిల్లా అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ షాపు నుండి కొలతలు తీసుకోని రోడ్డు సెంటర్ చేసి విస్తరణ కటి oగి చేయాలని ఆయన డిమాండ్ చేశారు
వనపర్తి లో గోపాల్పేట రోడ్డు, చిట్యాల రోడ్డు నుండి రాజీవ్ చౌక్ వరకు గత ప్రభుత్వంలో 80 శాతం పూర్తయిన రోడ్డు వెడల్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విస్తరణ చేయలేదని వనపర్తి లో రోడ్డు వెడల్పు కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నది ఎమ్మెల్యే రెండు సంవత్సరాలుగా రోడ్డు వెడల్పు చేస్తాము అంటూ, వాకింగ్ చేస్తూ ప్రజలకు హామీ ఇచ్చారని ఇచ్చి న హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు,జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్లానింగ్ .బోర్డ్ వైస్ చైర్మన్ వెంటనే వనపర్తి లో పెబ్బేరు కొల్లాపూర్ కొత్తకోట రోడ్డును ప్రమా దాలు జెరగకుండా వెంటనే రోడ్డు కటి oగ్ చె యిoచాలని డాక్టర్ సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు

మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం…

మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

వ్యక్తిగత విమర్శలు కాదు ప్రజాస్వామాలపై మాట్లాడండి

దళిత నాయకుడు కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు అసహ్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరపగూడెం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రజానాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం నిర్వహించిన కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ దౌర్భాగ్యం అన్నారు ప్రజా ప్రతినిధులను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం నీచ రాజకీయాలను నిదర్శనం అని మండిపడ్డారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాల్సిన ప్రతిక్షణం చట్టసభల్లో విమర్శలకు దిగడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు అదేవిధంగా దళిత సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు వెంకటపురం సర్పంచ్ కేశవరావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, ఏరా సురేష్, గోగ్గలి రవి, భూక్యరాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, భూకబ్జాలపై గవర్నర్‌కు ఫిర్యాదు…

కాంగ్రెస్ మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, భూకబ్జాలపై గవర్నర్‌కు ఫిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, భూకబ్జాలకు పాల్పడటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు రాజ్‌భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నేరు హరీష్ రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్…

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

 

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

ఎమ్మె్ల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ‘నా సొంత భూమిని కేటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. ఆ సమయంలో అధికారంలో చేతిలో ఉండటంతో నేను తీవ్రంగా నష్టపోయాను. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, అప్పుడు ఏమీ చేయలేక నోరు మూసుకోవాల్సి వచ్చింది. భూ బదలాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి ప్రభుత్వం తక్షణమే హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్న. ఈ అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలు నా వద్ద ఉన్నాయి. ప్రభుత్వం కోరితే వాటిని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను వ్యక్తిగతంగా ఎంత నష్టపోయానో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది.

మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

బాధ్యతలు అప్పగించాలంటూ అధికారులకు కోర్టు ఉత్తర్వులు

బూటకపు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు : శాంతమ్మ

శంకరపల్లి, నేటిధాత్రి:

ఆరోపణలతో అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేదని మరోసారి రుజువైందంటూ మోకిలా తాండ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది చేసిన పనులకు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తిరిగి వర్య శాంతమ్మను పదవిలో కొనసాగాలని కోర్టు జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిజాలు ప్రజలు గ్రహిస్తూనే ఉంటారని, బెదిరింపులు అసత్య ఆరోపణలతో ఏం చేయలేరని గ్రామస్తులు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల తండా గ్రామపంచాయతీ సర్పంచ్గా వర్త్య శాంతమ్మను తిరిగి పదవిలో కొనసాగాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వాస్తులకు నష్టం కలిగించడం, పంచాయతీ స్థలంలో మొక్కలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో సస్పెండ్ కాబడిన శాంతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్ విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆమెను సర్పంచిగా బాధ్యతలు స్వీకరించాలని వెంటనే ఉపసర్పంచ్ నుంచి శాంతమ్మ సర్పంచ్ బాధ్యతలను తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా, మండల, గ్రామ అధికారులకు కోర్టు సూచించింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఎల్లప్పుడూ తనను గెలిపించిన ప్రజల కోసం సేవ చేసేందుకు ముంటానన్నారు. గ్రామ ప్రజల తీర్పుతో గెలిచామని, వారి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతానన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version