ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భవ దినోత్సవం జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో చిట్యాల పట్టణ అధ్యక్షుడు బుర్ర అభిజ్ఞ గౌడ్ ఆధ్వర్యంలో ఎబివిపి జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం అభిజ్ఞ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని 1949లో నలుగురి విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు అన్ని యూనివర్సిటీలలో కళాశాలలో అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీ పని దేశం ధర్మం కోసం పనిచేసే విద్యార్థి సంఘం జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థి సంఘం ఎబివిపి అని వారు అన్నారు..

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్

నర్సంపేట నేటిధాత్రి:

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.
జూన్ 22 నుండి 24 వరకు ఆర్మూర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాసవర్గలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.గతంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా,ఆర్ట్స్ జోనల్ ఇన్చార్జిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతినిత్యం విద్యార్థులకు సేవలు అందిస్తూ అవినీతిని అంతం చేస్తానని తెలియజేశారు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని
HCU భూములను రక్షించాలన్నారు.
విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version