గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు…

గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించే కార్యక్రమం స్థానిక పాఠశాలలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, ఉపసర్పంచ్ శ్రీమతి బోట్ల శ్యామల తో పాటు వార్డు సభ్యులు కుమారస్వామి, శ్రీనివాస్,అరవింద్,లావణ్య, వెంకటేశ్వర్లు,మంజుల,రమ లను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ
గ్రామ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి,పాఠశాల అభివృద్ధిలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణం,మౌలిక వసతుల మెరుగుదల వంటి కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ
కార్యక్రమంలో ఉపాధ్యాయులు పావని, సత్యపాల్,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్ మాట్లాడుతూ
గ్రామ అభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని,విద్యార్థుల సంఖ్య పెంపు,ప్రహరీ గోడ నిర్మాణం,పరిశుభ్రత,మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, ముస్త్యాలపల్లి పాఠశాలను ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలు,పాఠశాల విద్యార్థి నుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.

గ్రామక్య సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం.

గ్రామక్య సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శ్రీ గణేష్, శాలిని మిశ్రా, ఝాన్సీ, స్వశక్తి గ్రామక్య సంఘాల సభ్యులు మరియు ఐకెపి,సిసి రమణాదేవి ఆధ్వర్యంలో గురువారం రోజున సర్పంచి తౌటం లక్ష్మి ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ ని మరియు వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ మాట్లాడుతూ మహిళ సంఘాలు పొదుపు ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు, అనంతరం ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆర్థికంగా బలోపేతం కావాలిని మహిళా సాధికారత సాధించాలని వారికోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందని అన్నారు, అనంతరం సీసీ రమణా దేవి మాట్లాడుతూ చిట్యాల గ్రామైక్య సంఘాల మహిళలు సమావేశాలు పెట్టుకోవడానికి భవన నిర్మాణం కోసం స్థలం కావాలని కోరగా సర్పంచి ఉప సర్పంచ్ సానుకూలంగా స్పందించి గ్రామంలో సర్వే చేయించి స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో
ఇంచార్జీ ఎపిఎం రాజేందర్,శ్రీగణేష్ వివో, ఝాన్సీ వివో,శాలిని మిశ్రా వివో స్వశక్తి వివో ల అధ్యక్షులు సుమలత, ఉమ,కల్పన, అనూష కార్యదర్శులు సంధ్య, అనూష,శారద, వివో లీడర్లు సుజాత, మౌనిక, వివో ఏ లు షాహ్నాజ్ ,లత, రామ్ చందర్ మరియు సంఘాల లీడర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version